- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అధిక ద్రవ్యోల్బణ ప్రభావం గ్రామీణులపైనే ఎక్కువ
కొవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకున్న మాదిరే భారత ద్రవ్యోల్బణం పుంజుకోవడమూ ‘కె- ఆకారం’లోనే సాగుతోందని, కొన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ విశ్లేషించింది.
హెచ్ఎస్బీసీ విశ్లేషణ
దిల్లీ: కొవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకున్న మాదిరే భారత ద్రవ్యోల్బణం పుంజుకోవడమూ ‘కె- ఆకారం’లోనే సాగుతోందని, కొన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ విశ్లేషించింది. పట్టణాల్లోని వారితో పోలిస్తే గ్రామీణ వినియోగదారులపై ఈ అధిక ధరల ప్రభావం ఎక్కువగా ఉందని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం వల్ల పట్టణ ప్రాంతం కంటే గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం 1.1 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, పంటలు దెబ్బతినడం వల్ల ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం అధిక ద్రవ్యోల్బణానికి దారి తీసిందని హెచ్ఎస్బీసీ నివేదిక తెలిపింది. ‘కొన్ని ఇంధన ధరలను తగ్గించడం ద్వారా అధిక ద్రవ్యోల్బణం నుంచి కొంత మేర ఊరటను ప్రభుత్వం కల్పించింది. అయితే పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ లాంటి ఇంధనాల వినియోగం పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో తక్కువగానే ఉంటుంది. పట్టణాల్లో కంటే గ్రామాల్లో ద్రవ్యోల్బణం అధికంగా నమోదవ్వడానికే ఇది కారణమ’ని ఆ నివేదికలో పేర్కొంది. వర్షాలు పుంజుకోకుంటే.. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించే అవకాశాలూ ఉండవని తెలిపింది. ‘జులై, ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదుకాకుంటే.. 2024లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పరిస్థితి 2023 కంటే కూడా అధ్వానంగా మారొచ్చ’ని వివరించింది. ఒకవేళ వర్షపాతం మెరుగ్గా నమోదైతే.. ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావచ్చు. దీంతో ఆర్బీఐ కూడా కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉంది. 2025 మార్చి కల్లా కనీసం 0.50 శాతం మేర రెపో రేటును తగ్గించే వీలుంటుందని నివేదిక అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..