- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు
ఇప్పటికే జౌళి రంగం కోసం రూ.10,000 కోట్లకు పైగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. త్వరలో వస్త్ర రంగానికి సైతం ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోందని జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.
వస్త్ర రంగానికీ పీఎల్ఐ పథకం!
దిల్లీ: ఇప్పటికే జౌళి రంగం కోసం రూ.10,000 కోట్లకు పైగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. త్వరలో వస్త్ర రంగానికి సైతం ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోందని జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారమిక్కడ జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్(ఐఐజీఎఫ్)ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘భారీ అవకాశాలు మన ముందున్నాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 50 బి.డాలర్ల (సుమారు రూ.4.15 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ తన లక్ష్యంగా పెట్టుకోవాల’ని సూచించారు. అయిదేళ్ల కాలానికి గాను రూ.10,683 కోట్ల పీఎల్ఐ పథకాన్ని జౌళి రంగం కోసం 2021లో ఆమోదం తెలిపిన విషయం విదితమే. ప్రస్తుతం భారత జౌళి పరిశ్రమ మార్కెట్ పరిమాణం 165 బి.డాలర్లుగా ఉందని.. దీనిని 350 బి.డాలర్లకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అధిక వడ్డీ రేట్లు వృద్ధికి అడ్డుపడట్లేదు: దాస్
ముంబయి: అధిక వడ్డీ రేట్లు వృద్ధికి అవరోధంగా నిలవట్లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కిందకు తీసుకొని రావడం పైనే పరపతి విధాన కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం దేశం తన వృద్ధి పథంలో కీలక వ్యవస్థాగత మార్పు దిశగా వెళ్తోంది. సుస్థిరమైన 8 శాతం వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ వృద్ధి స్థిరంగా ఉండి, మంచి వృద్ధిని నమోదు చేస్తే.. అప్పుడు పరపతి విధానం, వడ్డీ రేట్లు వృద్ధికి అవరోధంగా నిలవబోవన్నది స్పష్టమైన సంకేతమ’ని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దాస్ తెలిపారు. వడ్డీ రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతో వృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారనడం సరికాదని తెలిపారు. అలాంటి ఆందోళనలు అక్కర్లేదని, వృద్ధి జోరు ప్రతి నెలా కొనసాగుతోందని వెల్లడించారు. వృద్ధిపై సానుకూల అంచనాలు ఉన్నప్పుడు ద్రవ్యోల్బణంపై దృష్టి సారించేందుకు అవసరమైన వెసులుబాటు తమకు లభిస్తుందని పేర్కొన్నారు.
తొలి రోజు స్పెక్ట్రమ్ వేలంలో రూ.11,000 కోట్ల విలువైన బిడ్లు
దిల్లీ: స్పెక్ట్రమ్ వేలం తొలి రోజున రూ.11,000 కోట్ల విలువైన బిడ్లను టెలికాం సంస్థలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఐదు రౌండ్లలో బిడ్డింగ్ ప్రక్రియ జరిగినట్లు తెలిపాయి. ప్రభుత్వం రూ.96,238 కోట్ల విలువైన 10,500 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను వేలానికి ఉంచింది. ‘తొలి రోజు టెలికాం సంస్థలు సుమారు రూ.11,000 కోట్ల విలువైన బిడ్లను వేశాయి. బుధవారం వేలం పునఃప్రారంభం అవుతుంద’ని ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. టెలికాం విభాగం(డాట్) జారీ చేసిన నివేదిక ప్రకారం.. మొదటి రోజు ప్రధానంగా 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ల విభాగంలో బిడ్లు వచ్చాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి.
ఎన్టీపీసీ రూ.12,000 కోట్ల సమీకరణ ప్రణాళికలు
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీలు) ద్వారా రూ.12,000 కోట్ల వరకు సమీకరించనుంది. ఈ నెల 29న జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను డైరెక్టర్లు పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. గత నెలలో ప్రకటించిన 2023-24 నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ రూ.6,490 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.4,871.5 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.44,253.17 కోట్ల నుంచి 7.6 శాతం వృద్ధితో రూ.47,622.06 కోట్లకు చేరింది.
సిద్స్ ఫామ్కు రూ.83 కోట్ల పెట్టుబడులు
దిల్లీ: డెయిరీ రంగంలోని హైదరాబాద్ అంకురం సిద్స్ ఫామ్ రూ.83 కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించింది. ఓమ్నివోర్, నరోత్తమ్ శిఖారియా ఫ్యామిలీ ఆఫీస్(ఎన్ఎస్ఎఫ్ఓ) ఈ పెట్టుబడులను అందించినట్లు సిద్స్ ఫామ్ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్తో పాటు, బెంగళూరులో విస్తరించేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు ఈ రంగంలో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటామని తెలిపింది. తాజా, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించేందుకు తమ విస్తరణ ప్రణాళికకు ఈ నిధులు వినియోగించుకుంటామని సిద్స్ ఫామ్ వ్యవస్థాపకుడు కిశోర్ ఇందుకూరి వెల్లడించారు. రెండు నగరాల్లో ప్రస్తుతం 25,000 మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, లక్ష మందికి చేరువయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. జులై 2న ఈ కార్యక్రమం జరగనుంది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
-
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
-
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
-
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్