- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shein brand: జుడియో, మింత్రాకు పోటీగా.. భారత్లోకి షీయెన్ బ్రాండ్ రీఎంట్రీ!
Shein brand: దేశీయ ఫాస్ట్ ఫ్యాషన్ మార్కెట్లోకి చైనాకు చెందిన షీయెన్ బ్రాండ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఏడాదిక్రితం ఈమేరకు రిలయన్స్తో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Shein brand | ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ షీయెన్.. మళ్లీ భారత్లోకి అడుగుపెట్టనుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్తో ఏడాదిక్రితం కుదిరిన ఒప్పందం నేపథ్యంలో మరికొన్ని వారాల్లో ఈ బ్రాండ్ దుస్తులు మళ్లీ దర్శనమివ్వనున్నాయి. రిలయన్స్ రిటైల్ సంస్థ వీటిని ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లలో విక్రయించనుంది. దేశీయంగా ఈ ఫాస్ట్ ఫ్యాషన్ విభాగంలో మింత్రా, టాటా గ్రూపునకు చెందిన జుడియో ఆధిపత్యం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో షెయిన్ బ్రాండ్ను రిలయన్స్ తీసుకొస్తుండడం గమనార్హం. ఈ విభాగంలో షీయెన్ ఇప్పటికే గ్లోబల్ లీడర్గా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన షీయెన్ బ్రాండ్ను క్రిస్ జు 2008లో చైనాలో స్థాపించారు. భారత్తో పాటు ప్రపంచదేశాల్లో ఈ దుస్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. 2020లో చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఈ బ్రాండ్ను భారత్ నిషేధించింది. సరిగ్గా నాలుగేళ్ల విరామం తర్వాత రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ఈ బ్రాండ్ మళ్లీ భారత్లోకి అడుగుపెట్టనుంది.
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
దేశీయంగా ఈ బ్రాండ్ కార్యకలాపాలన్నీ రిలయన్స్ రిటైలే చూడనుంది. షెయిన్ ఎలాంటి పెట్టుబడులూ పెట్టడం లేదు. కంపెనీ లాభాల్లో వాటా మాత్రమే లైసెన్సు ఫీజుగా రిలయన్స్ చెల్లించనుంది. డేటా కూడా దేశీయంగానే స్టోర్ చేస్తారు. దీనిపై షీయెన్కు ఎలాంటి కంట్రోల్ ఉండదు. దేశీయంగా ఫాస్ట్ ఫ్యాషన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ వ్యాపారం.. 2030-31 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్స్కు అనుగుణంగా తక్కువ సమయంలోనే దుస్తులు రూపొందించి, వాటిని అందుబాటు ధరల్లో విక్రయించడం ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ ముఖ్య ఉద్దేశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ మరుసటి రోజు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ (Union Budget 2024) ను సమర్పిస్తారని కిరణ్ రిజిజు తెలిపారు. -
వాట్సప్ స్కామ్స్ బారిన పడకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
WhatsApp scams: స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించే వాట్సప్నే ఆసరాగా మార్చుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. -
జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్
Jio 5g plans: జియో కొత్తగా 5జీ బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో రీఛార్జి చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
RBI: మార్గదర్శకాలను పాటించని కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా విధించింది. -
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!
-
14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్పై ఇంటికి..
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం
-
హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు
-
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. విభజన అంశాలపై చర్చ
-
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు