- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IPOs: నేడే 2 ఐపీఓలు ప్రారంభం.. రూ.550 కోట్ల సమీకరణ.. పూర్తి వివరాలివే
IPOs: పైపింగ్ సొల్యూషన్స్ అందించే డీ డెవలప్మెంట్ ఇంజినీర్స్తో పాటు బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ ఎక్మే ఫిన్ట్రేడ్ ఐపీఓలు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటి షేర్ల సబ్స్క్రిప్షన్ జూన్ 21న ముగియనుంది.
ముంబయి: పైపింగ్ సొల్యూషన్స్ అందించే డీ డెవలప్మెంట్ ఇంజినీర్స్ లిమిటెడ్ ఐపీఓ (Dee Development IPO) బుధవారం ప్రారంభమైంది. రూ.418 కోట్ల సమీకరణే లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ 21న ముగియనుంది. షేరు ధరల శ్రేణి రూ.193-203. రిటైల్ మదుపర్లు కనీసం 73 షేర్ల కోసం రూ.14,819 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
తాజా ఐపీఓలో (IPO) డీ డెవలప్మెంట్ రూ.325 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేస్తోంది. మరో 45.82 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు. కొత్త షేర్ల ద్వారా సమీకరించిన నిధుల నుంచి రూ.175 కోట్లు రుణ చెల్లింపులు, రూ.75 కోట్లు నిర్వహణ మూలధనం, రూ.75 కోట్లు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ సీఎఫ్వో సమీర్ అగర్వాల్ వెల్లడించారు.
ఐపీఓలో (Dee Development IPO) అందుబాటులో ఉన్న షేర్లలో సగం అర్హత గల సంస్థాగత మదుపర్ల (QIBs)కు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) కేటాయించారు. డీ డెవలప్మెంట్ ఒక ఇంజినీరింగ్ కంపెనీ. చమురు, గ్యాస్, విద్యుత్తు, రసాయనాల కంపెనీలకు కావాల్సిన పైపింగ్ సొల్యూషన్స్ను అందిస్తుంది. ఈ కంపెనీకి మొత్తం ఏడు తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో ఒకటి బ్యాంకాక్లో ఉంది. జేజీసీ కార్పొరేషన్, నూటర్ ఎరిక్సెన్, మ్యాన్ ఎనర్జీ సొల్యూషన్స్ ఎస్ఈ, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, జాన్ కాకెరిల్ ఎస్ఏ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్పీసీఎల్, తోషిబా జేఎస్డబ్ల్యూ పవర్ సిస్టమ్స్ వంటి కంపెనీలు డీ డెవలప్మెంట్ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.
ఎక్మే ఫిన్ట్రేడ్ ఐపీఓ
బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ ఎక్మే ఫిన్ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్ ఐపీఓ (Akme Fintrade IPO) సైతం ఈరోజే ప్రారంభమైంది. 21వ తేదీ వరకు షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. షేరు ధరల శ్రేణి రూ.114-120. గరిష్ఠ ధర వద్ద ముదుపర్లు కనీసం రూ.15,000తో 125 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ పరిమాణం రూ.132 కోట్లు. దీంట్లో 1.1 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేస్తోంది.
ఎక్మే ఫిన్ట్రేడ్ ఉదయ్పుర్ కేంద్రంగా పనిచేస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. ప్రధానంగా వాహన, చిరు వ్యాపారులకు వ్యాపార రుణాలను సమకూరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్