- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Offices: ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఉద్యోగులను రప్పించేందుకు కంపెనీల చర్యలు
వలసలకూ అడ్డుకట్ట
ముంబయి: ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘పని ప్రదేశాలను అందంగా ముస్తాబు చేయడమే కాకుండా.. ఆకర్షణీయ డిజైన్లతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దడాన్నే’ ఆఫీస్ పీకాకింగ్గా వ్యవహరిస్తుంటారు. ఇందుకోసం భారీ మొత్తాలనే కంపెనీలు ఖర్చు చేస్తున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ‘కొవిడ్-19 పరిణామాల తర్వాత, ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఆఫీస్ పీకాకింగ్ విధానానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కొవిడ్-19 పరిణామాల్లో ఎక్కడి నుంచైనా పని చేసే వెసులుబాటును ఉద్యోగులకు పలు కంపెనీలు కల్పించాయి. కొవిడ్ పరిణామాలు ముగిశాకా, ఈ ధోరణి కొనసాగింది. ఇంటి నుంచి పని చేస్తున్న మాదిరి, సౌకర్యవంతంగా ఉందనే భావనను ఉద్యోగుల్లో కలిగించేందుకు కార్యాలయాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం కంపెనీలకు ఏర్పడింద’ని టీమ్లీజ్ సర్వీసెస్ సీఈఓ (స్టాఫింగ్) కార్తీక్ నారాయణ్ తెలిపారు. ఇందుకోసం పని ప్రదేశాల్లో ఆకర్షణీయ అలంకరణలు చేస్తున్నారు. వినూత్న శైలి ఫర్నిచర్, ప్రశాంతంగా సేదదీరే ఏర్పాట్లు, సూర్యకాంతిని అనుభవించేలా తీర్చిదిద్దుతున్నారు. ఉద్యోగుల్లో ఉల్లాసాన్ని నింపడమే దీని వెనక ఉద్దేశమని వివరించారు.
ఆ రంగాల్లో అత్యధికంగా..
ఉద్యోగులకు మానసికోల్లాసం కలిగించి, ఉత్పాదకత పెంచేందుకు కంపెనీలు పీకాకింగ్ను వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాయని నారాయణ్ తెలిపారు. అత్యంత ప్రతిభావంతులను తమ కార్యాలయాలకు ఆకర్షించేందుకు ఈ తరహా కార్యకలాపాలపై దిగ్గజ సాంకేతిక కంపెనీలు రూ.కోట్లల్లో ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘నిపుణులను ఆకర్షించే విషయంలో అత్యంత పోటీ నెలకొన్న ఐటీ- టెక్నాలజీ, ఆర్థిక, కన్సల్టింగ్ రంగాల్లోని కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ పీకాకింగ్ను చేపడుతున్నాయి’ అని ఆయన అన్నారు. హైబ్రిడ్ (కొన్ని రోజులు ఇంటి నుంచి - మరికొన్ని రోజులు ఆఫీస్కు వచ్చి) పని విధానం కొనసాగినంత వరకు.. ఆఫీస్ పీకాకింగ్ పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆఫీస్ పీకాకింగ్ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుల్ను మించిన బంగారం
ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. -
జీఎస్టీని 5 శాతం చేయండి
దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. -
501 ఒప్పందాలు.. 21.4 బి.డాలర్లు
ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!
-
భారత స్థిరాస్తిలోకి రూ.25,700 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. -
ఎఫ్ఎంసీజీ ఆదాయ వృద్ధి 7-9%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. -
గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా నిష్క్రమణ
ఓలాలో క్యాబ్/ఆటో/బైక్ బుక్ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. -
బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా రతన్ కుమార్ కేశ్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రతన్ కుమార్ కేశ్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై సమాచారం పెద్ద అక్షరాల్లో..
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది. -
సంక్షిప్తవార్తలు(5)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!