- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nvidia CEO: ఎన్నో టాయిలెట్లు కడిగా: దిగ్గజ కంపెనీ సీఈఓ
Nvidia CEO: ప్రపంచంలో ఏ పనీ చిన్నది కాదు అంటున్నారు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. తాను ఒకప్పుడు టాయిలెట్లు కూడా కడిగానని చెప్పారు.
Nvidia CEO Jensen Huang | ఇంటర్నెట్డెస్క్: సాధారణంగా జీవితంలో ఎవరూ నేరుగా ఉన్నత శిఖరాలను అధిరోహించరు. ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ పైమెట్టుకు చేరుకోవాల్సిందే. అయితే, ఈ ప్రయాణంలో దేన్నీ తక్కువ చేసి చూడొద్దని అంటున్నారు ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్. చేసే పని చిన్నదైనా సరే దానికి విలువ ఇవ్వాలని, గౌరవించాలని అప్పుడే మనం ఎదుగుతామన్నారు. పని విలువపై ఆయన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కెరీర్ తొలినాళ్లలో తాను కూడా ఎన్నో టాయిలెట్లు కడిగానని అందులో ఆయన చెప్పారు.
‘‘నా వరకు ఏ పనీ నాకు చిన్నది కాదు. కెరీర్ తొలినాళ్లలో నేను ఓ బ్రేక్ఫాస్ట్ సెంటర్లో పనిచేశా. అప్పుడు గిన్నెలు శుభ్రం చేశా. టాయిలెట్లు కడిగా. ఇక్కడున్న మీ అందరూ కలిసి కడిగినదానికంటే ఎక్కువ టాయిలెట్లు శుభ్రం చేశా. ఆ అనుభవమే నాకు అన్నిరకాల పనులను గౌరవించడం నేర్పింది. దానివల్లే ఇప్పుడు కంపెనీలోని ప్రతీ ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నా. వారి భుజంపై చేయి వేసి అండగా నిలబడుతున్నా. ఈ ప్రపంచంలో ‘తక్కువ’ అనే పని ఏదీ లేదు’’ అని సీఈఓ హువాంగ్ (Nvidia CEO Jensen Huang) వివరించారు.
స్పందించిన మస్క్..
ఈ ఏడాది మార్చిలో స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మాట్లాడినప్పటి వీడియో ఇది. తాజాగా దీన్ని ఓ జర్నలిస్టు షేర్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై టెస్లా, ‘ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందిస్తూ హువాంగ్పై ప్రశంసలు కురిపించారు. తనదైన శైలిలో ఓ పోస్ట్ చేశారు. ‘‘కచ్చితంగా ఇదే సరైన ప్రవర్తన..! కొవిడ్ వేళ టాయిలెట్ పేపర్ల కొరత ఉన్న సమయంలో నేను మా ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో వాటిని అందుబాటులో సరిపడా ఉంచగలిగా’’ అంటూ మస్క్ రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ మరుసటి రోజు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ (Union Budget 2024) ను సమర్పిస్తారని కిరణ్ రిజిజు తెలిపారు. -
వాట్సప్ స్కామ్స్ బారిన పడకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
WhatsApp scams: స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించే వాట్సప్నే ఆసరాగా మార్చుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. -
జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్
Jio 5g plans: జియో కొత్తగా 5జీ బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో రీఛార్జి చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
RBI: మార్గదర్శకాలను పాటించని కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా విధించింది. -
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!
-
అవినీతి ఆరోపణలతో సీబీఐకి చిక్కిన గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్
-
అయోధ్య ఫలితం.. గుజరాత్లోనూ రిపీట్: రాహుల్
-
జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్
-
వాట్సప్ స్కామ్స్ బారిన పడకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
-
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది