- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Foxconn: ఫాక్స్కాన్లో వివాహిత మహిళలకు ఉద్యోగాల నిరాకరణ.? నివేదిక కోరిన కేంద్రం
భారత్లో ఐఫోన్ తయారుచేసే సంస్థ ఫాక్స్కాన్ (Foxconn)పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్ర కార్మికశాఖ అప్రమత్తమైంది. తమిళనాడు ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని కోరింది.
ఇంటర్నెట్డెస్క్: భారత్లో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల సప్లయర్గా ఉన్న ఫాక్స్కాన్ (Foxconn) ఓ అనైతిక నిర్వాకానికి పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చింది. ఈ కంపెనీలో వివాహిత మహిళలకు కొలువులు నిరాకరిస్తున్నట్లు ఆంగ్లవార్తా సంస్థ రాయిటార్స్ ఇటీవల ఓ కథనంలో వెల్లడించింది. దీనిపై కేంద్ర కార్మికశాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ అంశంపై సంపూర్ణ నివేదికను తమకు సమర్పించాలని తమిళనాడు లేబర్ డిపార్ట్మెంట్ను కోరింది. ప్రాంతీయ చీఫ్ లేబర్ కమిషనర్ను దీనిలో వాస్తవాలను పరిశీలించి తమకు తెలియజేయాలని పేర్కొంది. సమానవేతన చట్టం 1976 ప్రకారం ఉద్యోగ నియామకాల సమయంలో లింగవివక్ష అస్సలు చూపకూడదని గుర్తు చేసింది.
ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ల ఉద్యోగాల్లోని వివాహిత మహిళలను ఓ పద్ధతి ప్రకారం ఫాక్స్కాన్ తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అవివాహితులతో పోలిస్తే ఆ గృహిణులకు అదనపు బాధ్యతలు ఉండటాన్ని ఇందుకు సాకుగా చూపుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిక్రూటింగ్ ఏజెంట్లు, హెచ్ఆర్ సిబ్బంది వెల్లడించినట్లు సదరు వార్తాసంస్థ తెలిపింది. దీనిపై యాపిల్, ఫాక్స్కాన్ స్పందిస్తూ.. 2022లో నియామకాల సమయంలో హెచ్ఆర్ పాలసీలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నాయి. వాటిని మెరుగుపర్చామని వెల్లడించాయి. అంతేకానీ, 2023, 2024 నియామకాల్లో లోపాలపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు.
‘‘ఫాక్స్కాన్ నియామక ప్రక్రియలో లోపాలున్నట్లు 2022లో తెలియగానే చర్యలు తీసుకొన్నాం. మా పంపిణీదారుతో కలిసి సమస్యలపై నెలవారీ ఆడిట్ నిర్వహించాము. ఉన్నత ప్రమాణాలు నెలకొనేటట్లు చూసుకొన్నాం’’ అని యాపిల్ పేర్కొంది.
25శాతం కొత్త ఉద్యోగులు వివాహిత మహిళలే
తమపై వస్తున్న ఆరోపణలకు ఫాక్స్కాన్ సంస్థ స్పందించింది. తమ వద్ద ఉన్న కొత్త ఉద్యోగుల్లో 25శాతం మంది వివాహిత మహిళలేనని ప్రభుత్వానికి వెల్లడించింది. ఇక తమిళనాడులోని ఫ్యాక్టరీలోని మొత్తం ఉద్యోగుల్లో 70శాతం మహిళలే అని పేర్కొంది. ఈ నిష్పత్తి భారత్లో తమ రంగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పింది. పురుషులు కేవలం 30శాతం మాత్రమేనని తెలిపింది. కాకపోతే వారి భద్రతా ప్రమాణాలను అనుసరించి స్త్రీ,పురుషులు, మతాలకు సంబంధం లేకుండా ఎవరైనా సరే శరీరంపై లోహపు వస్తువులను ఉంచుకోకూడదని పేర్కొన్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
Credit card rules: క్రెడిట్ కార్డులకు సంబంధించి బ్యాంకులు కొన్ని మార్పులు చేశాయి. జులై నుంచే ఆ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నడిపిస్తోన్న ఈశా అంబానీ(Isha Ambani).. తన కవలలకు ఐవీఎఫ్(IVF) పద్ధతిలో జన్మనిచ్చినట్లు తెలిపారు. -
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. -
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. జులై 2న ఈ కార్యక్రమం జరగనుంది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
హరిహర వీరమల్లు.. పవన్ షూటింగ్ పార్ట్ ఎన్ని రోజులంటే?
-
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్