- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Maruti Suzuki: జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
ఈవీల అమ్మకాలు 1,06,081
దిల్లీ: ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. 2023 జూన్లో 3,28,710 పీవీలు విక్రయమవ్వగా, 2024 జూన్లో 3.67% వృద్ధితో 3,40,784కు చేరాయి. అయితే విద్యుత్తు వాహనాల విక్రయాలు మాత్రం ఈ ఏడాది మే నాటి 1,23,704తో పోలిస్తే 14% తగ్గి 1,06,081కు పరిమితమయ్యాయి. అయితే 2023 జూన్తో పోలిస్తే మాత్రం ఈవీల అమ్మకాలు 20% పెరిగాయి. ఈవీలపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడానికితోడు కొనుగోలుదార్లు ఇంధనం, విద్యుత్తుతో నడిచే హైబ్రిడ్ వాహనాలకు మొగ్గుచూపడం ఇందుకు కారణమని వివరిస్తున్నారు.
- మార్కెట్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు 1,33,027 నుంచి 3% పెరిగి 1,37,160కి చేరాయి. చిన్న కార్లయిన ఆల్టో, ఎస్-ప్రెసో విక్రయాలు 14,504 నుంచి 9,395కు పరిమితమయ్యాయి. కాంపాక్ట్ విభాగంలోని బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ఆర్ కార్ల విక్రయాలు 64,471 నుంచి 64,049కు తగ్గాయి. యుటిలిటీ విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 విక్రయాలు 43,404 నుంచి 52,373కు పెరిగాయి. దేశ వ్యాప్తంగా 37-38 రోజులకు సరిపోయేలా నిల్వలు డీలర్ల వద్ద ఉన్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ వెల్లడించారు.
- హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాలు 50,001 నుంచి 50,103కు పెరిగాయి. టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన (విద్యుత్ వాహనాలతో కలిపి) దేశీయ విక్రయాలు 47,359 నుంచి 8% తగ్గి 43,624కు పరిమితమయ్యాయి. మే, జూన్ వాహన విక్రయాలపై సార్వత్రిక ఎన్నికలు, ఎండల ప్రభావం పడిందని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. గత 2 నెలల్లో రిటైల్ విక్రయాలు తగ్గినా, కొత్త వాహనం కొనుగోలుకు విచారణలు బలంగా ఉన్నందున, గిరాకీ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఆగస్టు నుంచి పండుగల సీజన్ మొదలైతే పరిశ్రమ మళ్లీ గాడిలో పడుతుందని తెలిపారు.
- మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల వాహన దేశీయ విక్రయాలు 32,588 నుంచి 23% పెరిగి 40,022కు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. 2023 జూన్లో డీలర్లకు 19,608 వాహనాలను సంస్థ సరఫరా చేయగా, గత నెలలో 40% వృద్ధితో 27,474 వాహనాలను అందించింది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా రిటైల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 5,125 నుంచి 9% తగ్గి 4,644కు పరిమితమయ్యాయి.
- ద్విచక్ర వాహనాలకొస్తే బజాజ్ ఆటో దేశీయ విక్రయాలు 1,99,983 నుంచి 8% పెరిగి 2,16,451కు చేరాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ ద్విచక్ర వాహన టోకు విక్రయాలు 2,35,833 నుంచి 8% పెరిగి 2,55,734కు చేరాయి. సుజుకీ మోటార్సైకిల్ దేశీయ విక్రయాలు 13% వృద్ధితో 71,086కు పెరిగాయి.
14% తగ్గిన ఈవీల విక్రయాలు
విద్యుత్ వాహనాల (ఈవీల) విక్రయాలు ఈ ఏడాది మేతో పోలిస్తే జూన్లో 14 శాతం తగ్గాయి. 2023 జూన్ విక్రయాలతో పోలిస్తే మాత్రం గత నెలలో 20 శాతానికి పైగా పెరిగాయి. ప్రభుత్వ ఈవీ విధానాల్లో మార్పులు, హైబ్రిడ్ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో, గత నెలలో ఈవీల విక్రయాలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మేలో 1,23,704 ఈవీలు విక్రయం కాగా, గత నెలలో 1,06,081కు తగ్గాయి. ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇదే అత్యల్పం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8,39,545 ఈవీలను విక్రయించారు. మొత్తం వాహన విక్రయాలు 1,25,41,684తో పోలిస్తే, ఈవీల వాటా 6.69 శాతంగా ఉంది.
సబ్సిడీ తగ్గించారు
విద్యుత్ ద్విచక్ర వాహనాలకు గరిష్ఠ సబ్సిడీని రూ.60,000 నుంచి రూ.22,500కు తగ్గిస్తూ గత ఏడాది కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో వీటి ధరలను కంపెనీలు సుమారు 20 శాతానికి పైగా పెంచాయి. ఫలితంగా విద్యుత్ ద్విచక్ర వాహనాల సగటు ధర రూ.80,000-1,50,000కు చేరింది. ఫలితంగా వినియోగదార్ల కొనుగోలు నిర్ణయాలు మారిపోయాయి. ఈ ఏడాది విక్రయించిన మొత్తం విద్యుత్ వాహనాల్లో 57% వాటా ద్విచక్ర వాహనాలదే. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ద్విచక్ర వాహనాల సబ్సిడీని రూ.10,000కు, త్రిచక్ర వాహనాల సబ్సిడీని రూ.1,11,505 నుంచి రూ.50,000కు తగ్గించడంతో విక్రయాలపై ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.