- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పైసా ఆదాయం లేకుండా ట్రేడింగ్.. ₹26 లక్షలు పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి!
FandO trading: ట్రేడింగ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించొచ్చంటూ సోషల్మీడియాలో వచ్చే ప్రకటనల్ని చూసి ట్రేడింగ్కు బానిసయ్యాడు ఓ స్టూడెంట్. దీంతో ఏకంగా రూ.26 లక్షలు పోగొట్టుకున్నాడు.
FandO trading | ఇంటర్నెట్డెస్క్: స్టాక్మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా ట్రేడింగ్ల్లో పాల్గొనడం.. వాట్సప్, టెలిగ్రాం గ్రూపుల్లో జాయిన్ అయి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించిందంతా పోగొట్టుకోవడం.. ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్న సంఘటనలు. సమగ్ర అవగాహన ఉంటేనే ఎఫ్అండ్ఓలో ట్రేడ్ చేయాలని, లేకపోతే దానికి దూరంగా ఉండాలని ఓవైపు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేస్తున్నా.. కొందరు మాత్రం ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా అదే వలలో చిక్కుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్ ఫైల్ని చూసి చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం రావడంతో చాలామంది ఐటీఆర్లు ఫైల్ చేయడం మొదలుపెట్టారు. అలా తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్ ఫైల్ని చూసి సీఏ రోషన్ అగర్వాల్ అవాక్కయ్యారు. ట్రేడింగ్లో అతడు ఏకంగా రూ.26 లక్షలు నష్టం వచ్చినట్లు అందులో పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయారు. ఏ ఉద్యోగమూ చేయకుండానే.. మూడో సంవత్సరం చదువుతున్న ఆ బీటెక్ విద్యార్థికి ట్రేడింగ్ చేయడానికి ఇంత మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.
‘‘బీటెక్ చదువుతున్న ఆ స్టూడెంట్కు ఎటువంటి ఆదాయం లేదు. పేరెంట్స్ విడిపోయారు. తల్లి హోటల్ నడుపుతోంది. యాప్ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ల అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్డ్రా చేశాడు. ఇలా డబ్బుతో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. ట్రేడింగ్లో రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్అండ్ఓ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’’ అని ఆ సీఏ పేర్కొన్నారు.
ఇండెక్సేషన్ అంటే ఏంటి ? ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?
‘‘తన స్నేహితుడు ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని.. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. స్నేహితులు, సోషల్ మీడియా ద్వారా ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాడు. తర్వాత దానికి బానిసయ్యాడు. గతేడాదిలో రిటర్నులు ఫైల్ చేయడానికి వచ్చినప్పుడే ట్రేడింగ్ మానేయాలని నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించా. అయినా ఫలితం లేకపోయింది. ఎందుకు మానలేకపోతున్నావని ప్రశ్నిస్తే.. ట్రేడింగ్కు బానిసైపోయా అని సమాధానమిచ్చాడు’’ అని అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం ఇకపై ట్రేడింగ్ చేయనని మాటిచ్చాడంటూ ఆనందం వ్యక్తంచేశారు. సులువుగా డబ్బు సంపాదించొచ్చు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చంటూ సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని సీఏ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443, నిఫ్టీ 131 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
Niva Bupa IPO: ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా ఐపీఓకు రాబోతోంది. సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్లో సెర్చ్ చేయొచ్చు!
Meta AI: వాట్సప్లో ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ సమాచారం అయిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. -
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
ITR filing 2023-24: ఐటీఆర్ దాఖలు చేసే సమయం దగ్గర పడటంతో అందరూ రిటర్నులు ఫైల్ చేయడం మొదలు పెట్టేశారు. అసలు రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? -
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
LPG commercial cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్పై రూ.32 తగ్గడం గమనార్హం. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహ్మద్ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్
-
ప్రాణం తీసిన ‘రాంగ్ రూట్’.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి
-
కుండపోత వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
-
ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల
-
తెలుగు సినిమా అనుకుంటే.. వరల్డ్ సినిమాను తీశారు: బ్రహ్మాజీ
-
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!