- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IPO: ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
IPO: రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభమయ్యాయి. జులై 5 వరకు ఆయా కంపెనీల షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు.
దిల్లీ: ఎంక్యూర్ ఫార్మా ఐపీఓ (Emcure Pharma IPO) బుధవారం ప్రారంభమైంది. జులై 5 వరకు షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ధరల శ్రేణిని రూ.960- 1,008గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.1,952 కోట్లు సమీకరించనుంది. కొత్తగా రూ.860 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.1,152 కోట్లు విలువ చేసే షేర్లు అందుబాటులో ఉంచింది. మదుపర్లు కనీసం రూ.14,112తో 14 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి.
ఈ ఐపీఓలో (IPO) ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని షేర్లను రిజర్వ్ చేశారు. అర్హత గల సంస్థాగత మదుపర్లకు (QIBs) 50 శాతం, రిటైల్ మదుపర్లకు 35 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) 15 శాతం షేర్లను కేటాయించారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని ఎంక్యూర్ ఫార్మా తెలిపింది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వివిధ రకాల ఔషధాల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు చేపడుతోంది.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- తేదీలు : జులై 3 - 5
- ధరల శ్రేణి : రూ.960 - 1,008
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 14 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి : రూ.14,112
- షేర్ల అలాట్మెంట్ : జులై 8
- రిఫండ్లు : జులై 9
- డీమ్యాట్ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 9
- లిస్టింగ్ తేదీ : జులై 10
బన్సల్ వైర్ ఐపీఓ..
స్టీల్ వైర్ల తయారీ సంస్థ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ (Bansal Wire Industries IPO) ఐపీఓ సైతం నేడే ప్రారంభమైంది. జులై 5 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. రూ.745 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేరు ధరల శ్రేణిని రూ.243-256గా నిర్ణయించింది. ఈ ఐపీఓ పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే జరుగుతోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లు అందుబాటులో లేవు. మదుపర్లు కనీసం రూ.14,848తో 58 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి.
ఈ ఐపీఓలో (IPO) సమీకరించిన నిధులతో కంపెనీ కొత్త రకం వైర్ల తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉంది. అందుకనుగుణంగా దాద్రీలోని తయారీకేంద్రంలో మార్పులు చేయనుంది. అర్హత గల సంస్థాగత మదుపర్లకు (QIBs) 50 శాతం, రిటైల్ మదుపర్లకు 35 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ హై కార్బన్ స్టీల్ వైర్, మైల్డ్ స్టీల్ వైర్, స్టెయిన్లెస్ స్టీల్ వైర్.. ఇలా మూడు విభాగాల్లో వైర్లను తయారుచేస్తోంది.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- తేదీలు : జులై 3 - 5
- ధరల శ్రేణి : రూ.243 - 256
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 58 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి : రూ.14,848
- షేర్ల అలాట్మెంట్ : జులై 8
- రిఫండ్లు : జులై 9
- డీమ్యాట్ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 9
- లిస్టింగ్ తేదీ : జులై 10
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
Adani Hindenburg Row: అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వెనక చైనా హస్తం ఉందని ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
మీ డబ్బు సురక్షితంగా..
ఆర్థిక లావాదేవీలు డిజిటల్లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?