- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Password: కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.
Password | ఇంటర్నెట్ డెస్క్: ఫోన్, కంప్యూటర్, బ్యాంక్ అకౌంట్.. ఇలా ప్రతి దానికీ ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటాం. అందులోని సమాచారం బయటి వ్యక్తులు యాక్సెస్ చేయకుండా ఉండేందుకు చేసుకున్న ఏర్పాటు ఇది. కానీ, అలాంటి సున్నితమైన సమాచారం ఎంత వరకు గోప్యంగా ఉంచుతున్నాం? అనే ప్రశ్నకు కొందరి వద్ద సమాధానం ఉండడం లేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పాస్వర్డ్లను కూడా అసురక్షిత పద్ధతుల్లో భద్రపరుస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో తేలింది. 367 జిల్లాల పరిధిలో 48 వేల మందిపై లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే నిర్వహించి పాస్వర్డ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యాప్ స్టోర్లకు సంబంధించిన ముఖ్యమైన పాస్వర్డ్లను 17 శాతం మంది అసురక్షిత పద్ధతుల్లో సేవ్ చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. అంటే వీరంతా ఫోన్ కాంటాక్టుగానో, మొబైల్ నోట్స్లోనో సేవ్ చేస్తున్నట్లు సర్వే సంస్థ తెలిసింది. పొరపాటున ఏదైనా డేటా చౌర్యం జరిగితే సున్నితమైన సమాచారం సైబర్ నేరగాళ్ల పాలవ్వాల్సిందే. గడిచిన రెండేళ్లలో బ్యాంక్ సంబంధిత మోసాలు 300 శాతం మేర పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నా.. కొందరు కళ్లు తెరవడం లేదు.
అంతే కాదు 34 శాతం మంది ఏకంగా తమ పాస్వర్డ్లను ఇతరులతో పంచుకుంటామని చెప్పుకురావడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు మంది ఎంతో గోప్యంగా ఉంచాల్సిన పాస్వర్డ్లను పక్కవారితో పంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం కుటుంబ సభ్యులే కాకుండా ఆఫీసు సిబ్బంది, స్నేహితులతో సైతం వీటిని షేర్ చేసుకుంటున్నట్లు వారు బదులివ్వడం గమనార్హం. మిగిలిన వారు మాత్రమే పాస్వర్డ్లను తమ వద్ద మాత్రమే గోప్యంగా ఉంచుకుంటున్నారు. ఇదే సర్వేలో మరో ఆసక్తికర విషయమూ వెలుగుచూసింది. తమకు తెలిసిన వారో, తమ దగ్గరి బంధువుల్లో ఒకరు ఆర్థిక మోసాలకు గురైనట్లు ఏకంగా 53 మంది సర్వేలో పాల్గొన్న వ్యక్తులు తెలపడం గమనార్హం. అంటే మన చుట్టూ మోసాలు జరుగుతున్నాయని తెలిసినా జాగ్రత్తతో వ్యవహరించడం లేదన్నది ఈ సర్వే తేటతెల్లం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెన్సెక్స్ రికార్డు పరుగు
బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో బుధవారం మరో చిరస్మరణీయ రోజు. సూచీ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని సునాయాసంగా అధిరోహించింది. 70000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు 7 నెలల్లోపే (138 ట్రేడింగ్ రోజులు) దూసుకెళ్లడం విశేషం. -
హైదరాబాద్లో 40% పెరిగిన కార్యాలయాల అద్దె లావాదేవీలు
అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది. -
అధునాతన సాంకేతికతపై రూ.230 కోట్ల పెట్టుబడులు
అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్ప్యాక్ వెల్లడించింది. -
ప్రాయోజిత గ్రూపు సంస్థల షేర్లలో 25% మించి పెట్టుబడులు పెట్టొచ్చు
ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ప్యాసివ్ ఫండ్స్కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
‘కూ’త ఆగింది
దేశీయ సామాజిక మాధ్యమం ‘కూ’ మూతపడింది. ట్విటర్ (ప్రస్తుత ఎక్స్)కు పోటీగా, ప్రత్యామ్నాయంగా వచ్చామని తొలినాళ్లలో చెప్పుకున్న కూ ఇక పనిచేయదు. -
పటిష్ఠంగా నష్ట నియంత్రణ వ్యవస్థలు
పాలనా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నష్ట నియంత్రణ వ్యవస్థలు, విధానాలను పటిష్ఠం చేసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ సూచించారు. -
రూ.10 లక్షల కోట్లకు ఆహార సేవల విపణి
దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. -
గేమ్ డెవలప్మెంట్లో కృత్రిమ మేధ
సొంతంగా మొబైల్, ఆన్లైన్ గేములు ఆవిష్కరించే సంస్థ అయిన 7సీస్ ఎంటర్టైన్మెంట్, ఇకపై గేమ్ డెవలప్మెంట్లో ఏఐ (కృత్రిమ మేధ) ని విస్తృతంగా వినియోగించనుంది. -
ఇంటి వద్దా ఆరోగ్య సేవలు: స్టార్ హెల్త్
ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలను, తమ పాలసీదార్లకు అందించడాన్ని బీమా కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బుధవారం ప్రారంభించింది. -
దేశంలో పేదరికం తగ్గింది!
దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది. -
ద్రవ్యలోటు 4 శాతమైతే రెండేళ్లలో రేటింగ్ పెంపు!
అప్పుల నిర్వహణ సరిగ్గా ఉండి, ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి తీసుకొస్తే, వచ్చే 24 నెలల్లో భారత రేటింగ్ పెంపునకు అవకాశాలు ఉంటాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టరు ఈఫార్న్ ఫ్యూహా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(5)
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ లభిస్తోందని స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?