- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Income Tax: కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరారా? కొత్తగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయబోతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే..
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీరు పన్ను వర్తించే ఆదాయం పరిధిలోకి వచ్చారా? మీ సంస్థ మీ వేతనం నుంచి టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) చేసిందా చూసుకోండి. ఆ తర్వాతే మీరు రిటర్నులు దాఖలు చేయాలా, వద్దా అనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది.
అర్థం చేసుకోండి..
గత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకూ ఆర్జించిన ఆదాయానికి ఇప్పుడు రిటర్నులు దాఖలు చేస్తున్నామన్న సంగతిని గుర్తుంచుకోండి. ఆదాయం అంటే కేవలం వేతనం ఒక్కటే కాదు. వడ్డీ ద్వారా వచ్చిన మొత్తం, ఇంటి అద్దెలు, ఇతరత్రా మీకు వచ్చిన ప్రతి రూపాయీ మీ ఆదాయంలో భాగంగానే చూపించాల్సి ఉంటుంది. ఆదాయం వచ్చినా, దాన్ని చూపించకపోతే, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
పత్రాలు సేకరించండి..
ముందుగా పన్ను దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలనూ సిద్ధం చేసుకోండి. పాన్, ఫారం-16, బ్యాంకు ఖాతా వివరాలు (వడ్డీ కోసం), మీరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు (పీపీఎఫ్, ఎన్పీఎస్), టీడీఎస్ సర్టిఫికెట్, ఫారం-26ఏఎస్లాంటివన్నీ సేకరించి పెట్టుకోండి.
రిజిస్ట్రేషన్ చేసుకోండి...
కొత్తగా రిటర్నులు దాఖలు చేసే వారు ముందుగా ఇన్కంట్యాక్స్ పోర్టల్లో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇన్కంట్యాక్స్ పోర్టల్లో అడిగిన వివరాలు ఇవ్వాలి. పాన్, మీ పేరు, చిరునామా, ఇ-మెయిల్, ఫోన్ నంబరులాంటివి అందించాల్సి ఉంటుంది. ఓటీపీలతో వీటిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్వర్డ్ పెట్టుకొని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాతే రిటర్నులు దాఖలు చేసేందుకు వీలవుతుంది.
ధ్రువీకరించుకోండి..
సంస్థ నుంచి ఫారం-16 అందుతుంది. దీనిని ఫారం-26ఏఎస్తో పోల్చి చూసుకోవాలి. మీరు ఇచ్చిన అన్ని మినహాయింపు వివరాలు ఫారం-16లో నమోదయ్యాయా చూసుకోండి. ఇందులో పేర్కొన్న టీడీఎస్ వివరాలు ఫారం-26ఏఎస్తో సరిపోవాలి. అప్పుడే మీరు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలవుతుంది.
మినహాయింపులు జాగ్రత్తగా..
ఆదాయపు పన్ను మినహాయింపులు పొందేందుకు మీరు పెట్టిన పెట్టుబడి వివరాలన్నీ జాగ్రత్తగా నమోదు చేయండి. సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. ఎన్పీఎస్లో జమ చేసిన మొత్తానికి రూ.50,000 వరకూ క్లెయిం చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది. దీంతోపాటు గృహరుణం ఉన్నప్పుడు దానికి చెల్లించిన వడ్డీకి రూ.2లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. పొదుపు ఖాతా మీద వచ్చిన వడ్డీకి రూ.10వేల వరకూ సెక్షన్ 80టీటీఏ కింద మినహాయింపు లభిస్తుంది. ఇవన్నీ సరిగ్గా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ రిటర్నులు కచ్చితంగా దాఖలు చేసినట్లు.
గడువులోపే..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సాధారణంగా జులై 31 చివరి రోజు. కొన్ని అనుకోని పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ గడువును పొడిగిస్తుంది. డిసెంబరు వరకూ అపరాధ రుసుముతోనూ రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుంటుంది. సాధ్యమైనంత వరకూ ఈ నెలాఖరులోగా రిటర్నులు దాఖలు చేయడం ఎప్పుడూ మంచిది. ఆలస్యంగా దాఖలు చేస్తే దీర్ఘకాలిక లాభనష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోతారు.
భద్రంగా ఉంచుకోండి..
ఫారం-16తోపాటు, ఫారం-26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్), మీరు రిటర్నులు దాఖలు చేసిన పత్రాలన్నింటినీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. డిజిటల్ రూపంలోనే ఉంటే.. అన్నీ ఒక చోట దాచిపెట్టుకోండి. వీలైనప్పుడు ఇవన్నీ మీకు అందుబాటులో ఉండాలి. ఏదైనా రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు కనీసం రెండు మూడేళ్ల ఫారం-16తోపాటు, రిటర్నులు దాఖలు చేసిన ఆధారాలు అడుగుతారు. కాబట్టి, మీరు పన్ను చెల్లించకపోయినా, మీకు వచ్చిన ఆదాయం మేరకు రిటర్నులు దాఖలు చేయడం ఎప్పుడూ ఉత్తమం. రిటర్నులను సమర్పించడం అంటే కేవలం చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేయడంగానే భావించకూడదు. మీ ఆర్థిక క్రమశిక్షణకూ ఇది ఒక గుర్తింపునిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. -
ఆరోగ్య బీమా క్లెయిమ్ చిక్కులకు చెక్.. త్వరలో ప్రభుత్వ పోర్టల్!
Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం త్వరలోనే సరికొత్త పోర్టల్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 14 తర్వాత ఆ ఆధార్ కార్డులు పనిచేయవా? ఉడాయ్ వివరణ..
Aadhaar Card: జూన్ 14లోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయబోవంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఉడాయ్ వివరణ ఇచ్చింది. -
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
Railway ticket booking: ట్రైన్ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా? అదెలాగంటే..? -
హెచ్చుతగ్గులు తక్కువగా...
ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ పతకాన్ని కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సూరత్లో కుప్పకూలిన భవనం.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు