- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Airtel: జియో బాటలోనే ఎయిర్టెల్.. టారిఫ్ల పెంపు
Airtel: ఎయిర్టెల్ సైతం టారిఫ్లను పెంచింది. పెంచిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
దిల్లీ: జియో బాటలోనే ఎయిర్టెల్ సైతం తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 10-21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందులోభాగంగానే టారిఫ్లను పెంచుతున్నట్లు వెల్లడించింది.
పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉందని వివరించింది. ప్రీపెయిడ్ సహా పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం సవరించింది.
ప్రీపెయిడ్ ప్లాన్లు..
- రూ.199 ప్లాన్: గతంలో దీని ధర రూ.179. ఇందులో 2GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
- రూ.509 ప్లాన్: ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ.455. ఇది 6GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
- రూ.1,999 ప్లాన్: గతంలో రూ.1,799. ఇందులో 24GB డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
- రూ.299 ప్లాన్: ఇంతకుముందు రూ.265. ఇది రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 28 రోజుల పాటు వస్తాయి.
- రూ.349 ప్లాన్: ఇప్పటి వరకు దీని ధర రూ.299గా ఉంది. ఇందులో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
- రూ.409 ప్లాన్: ఇంతకుముందు రూ.359. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 28 రోజుల పాటు అందిస్తుంది.
- రూ.449 ప్లాన్: గతంలో రూ.399. ఇందులో రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
- రూ.579 ప్లాన్: ఇంతకుముందు దీని ధర రూ.479. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలను ఇస్తుంది.
- రూ.649 ప్లాన్: గతంలో రూ.549. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
- రూ.859 ప్లాన్: ఇంతకుముందు ధర రూ.719. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
- రూ.979 ప్లాన్: గతంలో ధర రూ.839. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల పాటు రోజుకు 100 SMSలు వస్తాయి.
- రూ.3,599 ప్లాన్: ఇంతకుముందు రూ.2,999. ఇది రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 365 రోజుల పాటు లభిస్తాయి.
రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?
డేటా యాడ్-ఆన్ ప్లాన్లు..
- రూ.22 ప్లాన్: గతంలో దీని ధర రూ.19. ఇందులో ఒకరోజు వ్యాలిడిటీతో 1GB అదనపు డేటా ఉంటుంది.
- రూ.33 ప్లాన్: ఇంతకుముందు రూ.29, దీంట్లో ఒక రోజు గడువుతో 2GB అదనపు డేటా లభిస్తుంది.
- రూ.77 ప్లాన్: గతంలో రూ.65, ఇది బేస్ ప్లాన్ గడువు వ్యాలిడిటీతో 4GB అదనపు డేటాను అందిస్తుంది.
పోస్ట్పెయిడ్ ప్లాన్లు..
- రూ.449 ప్లాన్: ఈ ప్లాన్ రోల్ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్తో 40GB డేటాను అందిస్తుంది.
- రూ.549 ప్లాన్: ఇది రోల్ఓవర్తో 75GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
- రూ.699 ప్లాన్: కుటుంబాల కోసం, ఈ ప్లాన్లో 105GB డేటా రోల్ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్, 2 కనెక్షన్ల కోసం వింక్ ప్రీమియం ఉన్నాయి.
- రూ.1,199 ప్లాన్: పెద్ద కుటుంబాలకు, ఈ ప్లాన్ రోల్ఓవర్తో 190GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, డిస్నీ+ హాట్స్టార్ 12 నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 4 కనెక్షన్లకు అందిస్తుంది.
ఈ కొత్త టారిఫ్లు భారతి హెక్సాకామ్ లిమిటెడ్తో సహా అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయి. సవరించిన ధరలు జూలై 3 నుంచి ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
ఎస్బీఐ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. -
నాణ్యత లేదు.. ప్రమాణాలు లేవు
దేశంలోని చిన్న, మధ్య తరహా ఫార్మా యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!
వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాణించిన చిన్న షేర్లు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. -
సెల్కాన్ గ్రూపు నుంచి వైఫై-6 రౌటర్లు
మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్కాన్ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది. -
హెచ్సీజీ చేతికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్?
విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ వైద్య సేవల సంస్థ అయిన హెచ్సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. -
రూ.12,000 కోట్ల సమీకరణలో ఎన్టీపీసీ
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది. -
సంక్షిప్త వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి
-
‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్
-
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య