- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Airtel: ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఇదే బాటలో వొడాఫోన్ ఐడియా
దిల్లీ: ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన పోటీ సంస్థ అయిన రిలయన్స్ జియో ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే భారతీ ఎయిర్టెల్ కూడా ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా రెండున్నరేళ్లలో టెలికాం కంపెనీలు ఇంత భారీగా ఛార్జీలను సవరించడం ఇదే మొదటిసారి. వివిధ పథకాలకు సంబంధించి పెరిగిన టారిఫ్ల వివరాలు ఇలా..
- అన్లిమిటెడ్ వాయిస్ పథకాల టారిఫ్లు 11% వరకు పెరిగాయి. రూ.179 ప్లాన్ ధర రూ.199కు; రూ.455 ప్లాన్ రూ.509కు; రూ.1,799 ప్లాన్ రూ.1,999కు పెరిగింది.
- రోజువారీ డేటా పథకం విభాగంలో 56 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే రూ.479 పథకం ఛార్జీని రూ.579కు (20.8% పెంపు) పెంచారు.
- 28 రోజుల వర్తింపుతో రోజుకు 1 జీబీ డేటా లభించే పథకం ఛార్జీని రూ.265 నుంచి రూ.299కు, రోజుకు 1.5 జీబీ డేటా పథకం ఛార్జీని రూ.299 నుంచి రూ.349కు ఎయిర్టెల్ పెంచింది.
- అత్యధికంగా 84 రోజుల కాలపరిమితి ఉండే పథకాల కోసం ఇకపై చందాదార్లు రూ.140 అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా లభించే పథకానికి ఛార్జీ రూ.719 నుంచి రూ.859కు; రోజుకు 2 జీబీ డేటా లభించే డేటా పథకానికి ఛార్జీ రూ.839 నుంచి రూ.979కు పెరిగింది.
- యాడ్ ఆన్ డేటా పథకాలు కూడా ప్రియమయ్యాయి. ఒక్క రోజు చెల్లుబాటు అయ్యే 1 జీబీ డేటా కోసం ఇకపై రూ.22తో రీఛార్జ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఇది రూ.19గా ఉండేది. 2 జీబీ రీఛార్జీ ధర రూ.29 నుంచి రూ.33కు పెరిగింది. 65 రోజుల పాటు వర్తించే 4జీబీ యాడ్ఆన్ డేటా పథకం ధరను రూ.65 నుంచి రూ.77కు ఎయిర్టెల్ సవరించింది.
- పోస్ట్ పెయిడ్ ఛార్జీలు 10-20% మేర పెరగనున్నాయి. వినియోగదార్లు వాళ్లు ఎంచుకున్న పథకం, ప్రయోజనాల ఆధారంగా ఈ పెంపు రూ.50-200 మేర ఉండొచ్చు.
- కొత్త టారిఫ్లు భారతీ హెగ్జాకామ్ లిమిటెడ్కున్న సర్కిళ్లతో పాటు అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని భారతీ ఎయిర్టెల్ తెలిపింది.
- వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను జులై 4 నుంచి 11-24% వరకు పెంచుతున్నట్లు తెలిపింది. 28 రోజులు వర్తించే మొబైల్ సేవల ప్రారంభ స్థాయి ప్లానును రూ.179 నుంచి రూ.199కి పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.