- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AGI Greenpac: అధునాతన సాంకేతికతపై రూ.230 కోట్ల పెట్టుబడులు
అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్ప్యాక్ వెల్లడించింది.
ఏజీఐ గ్రీన్ప్యాక్
ఈనాడు, హైదరాబాద్: అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్ప్యాక్ వెల్లడించింది. ఈ మొత్తంతో ఫర్నెస్లను ఆధునికీకరించడంతోపాటు, ఐఓటీ లాంటి ఆధునిక సాంకేతికతలను అమలు చేయనున్నట్లు సంస్థ సీఈఓ రాజేశ్ ఖోస్లా తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో ఈ ఉత్పత్తులకు గిరాకీ ఉందని, ఇప్పటికే అమెరికా, కెనడాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. వినూత్న, అధిక నాణ్యత గల గాజు ప్యాకేజింగ్ ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని భువనగిరిలో ఉన్న ప్లాంటులో రోజుకు 154 టన్నుల స్పెషాలిటీ గ్లాస్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. పలు రంగుల్లోనూ గాజు సీసాలను ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. 3 మిల్లీ లీటర్ల నుంచి 6 లీటర్ల సామర్థ్యం వరకూ తమ ఉత్పత్తులున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గాజు గ్లాసు ప్యాకేజింగ్ మార్కెట్ ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది రూ.8 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. గాజు సీసాల పరిశ్రమ ఏటా 25% వృద్ధిని సాధిస్తోందని తెలిపారు. పర్యావరణంపై అవగాహనకు అనుగుణంగా, గాజు ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతానికి ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలోని మూడు ప్లాంట్లలో కలిసి 4000 మంది పనిచేస్తున్నారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,421 కోట్ల ఆదాయం సాధించినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.