- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IPO: 3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి.
ఈ వారంలో 11 కంపెనీలు ఎక్స్ఛేంజీల్లో నమోదు
దిల్లీ: నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సాల్ వైర్ కంపెనీ మెయిన్ బోర్డ్ ఐపీఓలు కాగా, యాంబే ల్యాబొరేటరీస్ ఎస్ఎంఈ ఇష్యూగా రాబోతోంది. అలైడ్ బ్లెండర్స్, వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ వంటి మెయిన్ బోర్డ్ కంపెనీలతో పాటు మరో 9 ఎస్ఎంఈ కంపెనీల షేర్లు ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.
- పుణెకు చెందిన ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ జులై 3-5 తేదీల్లో జరగనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.960-1,008. ఈ ఐపీఓ ద్వారా రూ.1,952 కోట్లను సంస్థ సమీకరించబోతోంది. కనీసం 14 షేర్లకు మదుపర్లు బిడ్ వేయాలి. రూ.800 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ ప్రస్తుత వాటాదార్లు, ప్రమోటర్లు విక్రయించనున్నారు. ః బన్సాల్ వైర్ ఐపీఓ కూడా జులై 3-5 తేదీల్లో రాబోతోంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణి రూ.243-256. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.745 కోట్లను సమీకరించబోతోంది. కనీసం 58 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేయాలి.
- యాంబే ల్యాబొరేటరీస్ ఎస్ఎంఈ ఐపీఓ రూ.45 కోట్ల సమీకరణ లక్ష్యంతో జులై 4-8 తేదీల మధ్య రాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా 62.5 లక్షల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. 3.12 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్లో విక్రయించనుంది. ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.65-68. మదుపర్లు కనీసం 2,000 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి.
- ఈ వారంలో దలాల్ స్ట్రీట్లో 11 కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి. మెయిన్బోర్డ్ విభాగంలో వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ (జులై 3న), అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ (జులై 2న) లిస్ట్ కానున్నాయి. ఎస్ఎంఈ విభాగంలో నెఫ్రో కేర్ ఇండియా, డీన్స్టెన్ టెక్, కార్బన్ అండ్ కెమికల్స్, డివైన్ పవర్ ఎనర్జీ, అకికో గ్లోబల్ సర్వీసెస్, వీసామ్యాన్ గ్లోబల్ సేల్స్, మాసన్ ఇన్ఫ్రాటెక్, సిల్వాన్ ప్లైబోర్డ్ (ఇండియా), శివాలిక్ పవర్ కంట్రోల్ కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.