- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
YS Jagan: జగనన్న మోసం.. రూ.10 వేల కోట్లపైనే!
పంటల బీమా కంపెనీల ప్రీమియం బకాయి రూ. 1,252 కోట్లు.. అది కట్టకపోతే పరిహారం అందదు. సూక్ష్మ సేద్య పరికరాలు అమ్మిన కంపెనీలకు బకాయి రూ. 1,170 కోట్లు.. చెల్లించకపోతే రైతుకు పరికరాలందవు.
ధాన్యం రైతులకు రూ.1,690 కోట్లివ్వాలి
పంటల బీమా ప్రీమియం బకాయిలే రూ.1,252 కోట్లు
సూక్ష్మ సేద్య సంస్థలకు రెండేళ్లలో రూ.1,170 కోట్ల బాకీ
రాయితీ పథకాల చెల్లింపుల్లోనూ రైతులకు మొండిచేయే
వ్యవసాయ, అనుబంధ శాఖలు, పౌరసరఫరాల సంస్థల్లో పరిస్థితి ఇది
ఈనాడు, అమరావతి: పంటల బీమా కంపెనీల ప్రీమియం బకాయి రూ. 1,252 కోట్లు.. అది కట్టకపోతే పరిహారం అందదు. సూక్ష్మ సేద్య పరికరాలు అమ్మిన కంపెనీలకు బకాయి రూ. 1,170 కోట్లు.. చెల్లించకపోతే రైతుకు పరికరాలందవు. రబీలో ధాన్యం రైతులకు బకాయి రూ. 1,690 కోట్లు.. ఇవ్వకపోతే ఖరీఫ్ పెట్టుబడికి ఇబ్బందే. వ్యవసాయ, ఉద్యాన రైతులకు బకాయి రూ. 1,865 కోట్లు.. లేదంటే పథకాల అమలు కష్టమే! జగన్ ప్రభుత్వ ఘనకార్యం ఇది. వ్యవసాయ, అనుబంధ శాఖలతోపాటు పౌరసరఫరాలశాఖ పరిధిలోనే సుమారు రూ. 10 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. చివరకు రైతులకు ధాన్యం డబ్బులు కూడా ఇవ్వకుండా.. తన ఇంటి గుత్తేదారుల కోసం సర్కారు ఖజానా ఖాళీ చేశారు. మూడేళ్లపాటు సూక్ష్మసేద్యాన్ని అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం చివరి రెండేళ్లు అంతంతమాత్రంగానే అమలు చేసింది. దానికీ రూ. 1,170 కోట్లు బకాయిలే. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోగా.. కేంద్ర నిధులతో కలిపి రూ. 1,800 కోట్లకు పైగా మళ్లించారు. ఇంత పెద్ద ఎత్తున బకాయిలున్నాయని ఇప్పుడు నివేదికలిచ్చిన అధికారులే.. నెల కిందటి వరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోందని వెనకేసుకొస్తూ ప్రకటనలివ్వడం గమనార్హం. పంటల బీమా ప్రీమియం మొదలుకొని పశునష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ తదితర పథకాల వరకు ఇదే రీతిన వ్యవహరించారు. ఇప్పుడేమో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ బకాయిల్ని కూడా కలిపి లెక్కలు వల్లె వేశారు.
వ్యవసాయశాఖలో రూ.3 వేల కోట్లకు పైనే
వ్యవసాయశాఖ పరిధిలో మొత్తం బకాయిలు రూ.3 వేల కోట్లకు పైనే ఉన్నాయి. ఇందులో బీమా సంస్థలకు రాష్ట్ర వాటా, రైతు వాటా కింద రూ. 1,251 కోట్లు జమ చేయాలి. దీన్ని విడుదల చేస్తున్నామంటూ డిసెంబరులోనే అధికారులు వైకాపా సర్కారుకు వంత పాడినా నేటికీ ఇవ్వలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర పథకాల కింద చెల్లించాల్సిన మొత్తం రూ. 1,385 కోట్ల బకాయిలున్నాయి. ఇందులో ఆర్కేవీవై, ఇతర పథకాల కింద చెల్లించాల్సిన మొత్తమే రూ. 378 కోట్లు. విత్తన రాయితీల కింద మొత్తం రూ. 685 కోట్లు బకాయిలు ఉండగా.. 2019-24 మధ్య ఇవ్వాల్సిందే రూ. 499 కోట్లు అని తేల్చారు. వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీ కింద రూ.40 కోట్లతోపాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం కూడా నిలిచిపోయింది. ఎరువులకు సంబంధించి మొత్తం రూ. 250 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రైతుభరోసా కేంద్రాల ఫైబర్నెట్, విద్యుత్తు ఛార్జీలు, స్మార్ట్ టీవీల పేరుతో రూ. 50 కోట్లు బకాయిపడింది. రబీ కరవుకు సంబంధించి రూ. 164 కోట్లు చెల్లించాలి.
ఉద్యాన శాఖలో సూక్ష్మ సేద్య బకాయిలే రూ.1,167 కోట్లు
ఉద్యాన శాఖలో మొత్తం రూ. 1,645 కోట్లు బకాయిలు పెట్టారు. ఇందులో సూక్ష్మసేద్య బకాయిల కింద 2022-23 సంవత్సరానికి రూ. 560.50 కోట్లు, 2023-24కి రూ. 606.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆయిల్పామ్ రైతులకు రూ. 238.50 కోట్లు, ఎంఐడీహెచ్, ఆర్కేవీవై పథకాల కింద బకాయిలు రూ. 240 కోట్లు ఉన్నాయి. రైతులకు రాయితీలు కూడా విడుదల చేయకుండా సతాయించారు.
పశుసంవర్ధకశాఖలో రూ.562 కోట్లు
పశుసంవర్ధకశాఖ పరిధిలో పశునష్టపరిహార పథకానికి రూ. 126 కోట్ల బకాయిలున్నాయి. 1962 పథకం కింద అంబులెన్స్ల నిర్వహణకు రూ. 111 కోట్లు, మందులకు రూ. 66 కోట్లు, వ్యాక్సిన్లకు రూ. 21 కోట్లు, మినీ గోకులాలకు రూ. 178 కోట్లతోపాటు గడ్డి విత్తనాలు, దాణా, సరఫరాదారులకు కూడా ప్రభుత్వం భారీగా బాకీ పడింది.
సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ బకాయిలే రూ.947 కోట్లు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి సహకార పరపతి సంఘాలకు కమీషన్ చెల్లిస్తారు. దీనికిగాను పౌరసరఫరాల సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు రూ. 947 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో 2019-20 నుంచి రూ.2023-24 మధ్య సేకరణకు సంబంధించి రూ. 821 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సహకార సంఘాల కంప్యూటరీకరణకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వడ్డీ రాయితీ, ఇతర పథకాల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ మొత్తం రూ. 414 కోట్లు. ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఐసీడీపీ) కింద ఎన్సీడీసీ నుంచి విడుదలైన నిధుల్లో ఇంకా ఖర్చు చేయాల్సిన రూ. 261 కోట్లు కూడా ప్రభుత్వ ఖాతాల్లోనే చేరాయి. ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసి.. వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి కింద గోదాముల నిర్మాణానికి రూ. 313 కోట్ల విలువైన పనులు చేస్తే రూ. 240 కోట్లు చెల్లించేశారు. ఇవన్నీ వైకాపా గుత్తేదారులు, అందులోనూ వైకాపా నేతల సన్నిహితులు చేసిన పనులు కావడంతో ఆఘమేఘాలపై చెల్లించేశారు.
పౌరసరఫరాల సంస్థలో రూ.3,500 కోట్ల బాకీలు
పౌరసరఫరాల శాఖను వైకాపా సర్కారు అప్పులమయంగా మార్చింది. గత ఐదేళ్లలోనే సుమారు రూ.20 వేల కోట్ల అప్పులు తెచ్చింది. వీటితో కలిపి సంస్థ మొత్తం అప్పులు రూ.36 వేల కోట్లకు పైమాటే. ధాన్యం రైతులతోపాటు సరఫరాదారులకు చెల్లించాల్సింది రూ. 3,500 కోట్లు ఉంది. ఇందులో ధాన్యం బకాయిలే రూ. 1,700 కోట్లు. వాటిని సాధ్యమైనంత త్వరగా ఇవ్వకపోతే 83 వేల మంది రైతులు ఖరీఫ్ సాగుకు తీవ్ర ఇబ్బందులు పడతారు. సోమవారం నిర్వహించిన మీకోసం- ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధిక శాతం వినతులు ధాన్యం రైతుల నుంచే వచ్చాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అన్నదాతల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. -
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
-
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ