- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hanuma vihari: మళ్లీ ఆంధ్రా జట్టుకు ఆడతా: క్రికెటర్ హనుమ విహారి
మంత్రి నారా లోకేశ్ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్ హనుమ విహారి స్పష్టం చేశారు.
మంత్రి లోకేశ్తో చర్చల అనంతరం ప్రకటన
వైకాపా ప్రభుత్వంలో తీవ్ర అవమానాలతో కెప్టెన్సీకి రాజీనామా
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో క్రికెటర్ హనుమ విహారి
ఈనాడు డిజిటల్, అమరావతి: మంత్రి నారా లోకేశ్ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్ హనుమ విహారి స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని మంగళవారం తెలిపారు. సచివాలయంలో మంత్రి లోకేశ్ను కలిసిన అనంతరం విహారి విలేకర్లతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవమానాలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లాను. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)తో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని చెప్పారు. గతంలో జట్టును ఆరుసార్లు సెమీస్కు తీసుకెళ్లాను. గత ప్రభుత్వం నా ప్రతిభను తొక్కేసింది. తాము చెప్పిన వారిని జట్టులో చేర్చుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు కుట్ర పన్నారు. నేను ఉంటే వాళ్లకు ఇబ్బందని భావించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులు పెట్టారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవమానంతో ఆంధ్రా జట్టును వదిలేయడానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కూడా తీసుకున్నాను. నేను ఇబ్బందులు పడినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అండగా నిలిచారు’ అని తెలిపారు.
మంత్రి లోకేశ్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న హనుమ విహారి
హనుమ విహారికి స్వాగతం: లోకేశ్
మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకరమైన పరిస్థితుల్లో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న తెలుగుతేజం హనుమ విహారికి రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో స్వాగతం పలుకుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన శరత్చంద్రారెడ్డిని ఏసీఏ అధ్యక్షుడిగా నియమించిన గత ప్రభుత్వం.. క్రికెట్లో రాజకీయ క్రీడ మొదలుపెట్టింది. 17వ స్థానంలో ఉన్న వైకాపా నాయకుడి కుమారుడు కుంట్రపాక పృథ్వీరాజ్ను ప్రోత్సహించడానికి అసమాన ప్రతిభాపాటవాలున్న హనుమ విహారిని ఏసీఏ తీవ్రంగా వేధించింది. విహారి విశేషానుభవం ఇతరులకు అందకుండా అడ్డుపడింది. ఇతర రాష్ట్రాల జట్టుకు నేతృత్వం వహించేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వడానికి కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టారంటే.. ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.’ అని తెలిపారు.
ఉపముఖ్యమంత్రి పవన్ను కలిసిన హనుమ విహారి
ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను ఆంధ్రా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి కలిశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా పవన్కు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. -
భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. -
ఇంటింటా నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. -
నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా!
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: రజనీకాంత్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు తీవ్ర అస్వస్థత
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?