- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Vizag film nagar club: వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది.
శాశ్వత ఛైర్మన్, సభ్యులుగా జగన్ సలహాదారుల తిష్ఠ
రూ.38 కోట్ల క్లబ్ నిధులపై నీలినీడలు
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్
ఈనాడు-విశాఖపట్నం: వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. ఇక్కడ మాత్రం శాశ్వత కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ అని రెండిటిని గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు సృష్టించారు. శాశ్వత కమిటీ ఛైర్మన్గా, సభ్యునిగా జగన్ నియమించుకున్న ప్రభుత్వ సలహాదారులు సాగి దుర్గాప్రసాద్రాజు, లంకా శ్రీధర్లు ఉన్నారు. మిగిలిన సభ్యుల్లోనూ వైకాపా సానుభూతిపరులే ఎక్కువ. శాశ్వత కమిటీలో సభ్యులెవరైనా చనిపోతే వారి వారసులకే అవకాశం ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చి, క్లబ్పై శాశ్వతంగా పాగా వేశారు.
స్థలం, నిధులు ఎరవేసి
రాష్ట్ర విభజన తర్వాత విశాఖకు సినీ పరిశ్రమ తరలివచ్చే అవకాశాలున్నాయని భావించి ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ను 2017లో ప్రారంభించారు. దీనికి గతంలో ఛైర్మన్గా కేఎస్ రామారావు వ్యవహరించారు. ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్న సమయంలో జగన్ సలహాదారు సాగి దుర్గాప్రసాద్రాజు రంగంలోకి దిగారు. ‘క్లబ్కు తెదేపా హయాంలో కేటాయించిన 5 ఎకరాలకు మరికొంత కలిపి మొత్తం 10 ఎకరాలు కేటాయిస్తాం. రూ.వంద కోట్ల నిధులు తెచ్చి వెంటనే క్లబ్ నిర్మాణం పూర్తి చేస్తాం. అందుకు కమిటీలో మేం చెప్పినవాళ్లను సభ్యులుగా చేర్చుకోవాలి’ అంటూ ఒత్తిడి తెచ్చి కేఎస్ రామారావుతోనే ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి అందరినీ ఒప్పించినట్లు సమాచారం. ఆ తర్వాత బైలాస్ మార్పుచేసి.. కేఎస్ రామారావును తప్పించి, శాశ్వత కమిటీని తెరపైకి తెచ్చారు. దానికి ఛైర్మన్గా సాగి దుర్గాప్రసాద్రాజును నియమించారు. అందులో శాశ్వత సభ్యులుగా విజయసాయిరెడ్డి అనుచరునిగా ముద్ర వేసుకున్న ఏసీఏ కార్యదర్శి గోపినాథ్రెడ్డి, మారిటైం బోర్డు మాజీ ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, జగన్ సలహాదారు లంకా శ్రీధర్, వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హైదరాబాద్కు చెందిన మెహర్కుమార్, రాజశేఖరరెడ్డి, ఎంఎస్ఎన్ రాజు, శ్రీనివాసరాజులను నియమించుకున్నారు. మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ను నియమించేందుకు.. క్లబ్లో సభ్యత్వం కట్టించి పావులు కదిపారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు రావడంతో రోహిత్ను తప్పించి, కాయల వెంకటరెడ్డిని మేనేజ్మెంట్ కమిటీలో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భీమిలి భూముల్లో కమీషన్లకు పావులు
క్లబ్కు భూములు ఇస్తామంటూ ఆశ చూపి వైకాపా పెద్దలు కమిటీలో తిష్ఠ వేసినా.. తరువాత ఆ ప్రయత్నమే చేయలేదు. భోగాపురం వద్ద 15 ఎకరాలు కేటాయిస్తామంటూ ఎన్నికల ముందు కొత్త పల్లవి అందుకున్నా, దాన్నీ పక్కన పెట్టారు. ప్రస్తుతం విశాఖలో క్లబ్ కోసం లీజుకు తీసుకున్న స్థలం వైకాపా తరఫున ఉండి నుంచి గత రెండు పర్యాయాలు పోటీ చేసిన నరసింహమూర్తి రాజుది. దానికి గతంలో రూ.4 లక్షల ఉన్న అద్దెను రూ.6 లక్షలకు పెంచి ఏటా రూ.72 లక్షలు జేబులో వేసుకొనేలా ప్రణాళిక రచించారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో సాగి దుర్గాప్రసాద్రాజు, కాయల వెంకటరెడ్డి క్లబ్ నిధులు రూ.38 కోట్లతో భీమిలి వద్ద యాజమాన్య హక్కులు లేని భూమిని అధిక ధరకు కొనుగోలు చేయడానికి పావులు కదిపారు. అందులో రూ.11 కోట్లకుపైగా కమీషను రూపంలో తమ జేబుల్లో వేసుకునే ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం. క్లబ్ ప్రాంతంలో పోర్టికోలు నిర్మించి రూ.1.50 కోట్ల నిధులను ఇప్పటికే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. 2019లో రామానాయుడు స్టూడియో దిగువన తెదేపా హయాంలో కేటాయించిన ఐదు ఎకరాల జీవో ఇంకా మనుగడలో ఉంది కనుక.. క్లబ్లో ఉన్న డబ్బులిస్తే ఆ పాత జీవోతో స్థలం తెస్తానంటూ హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ రాజు కొత్త నాటకానికి తెర తీశారంటూ క్లబ్ సభ్యులు కొందరు మండి పడుతున్నారు. ఇలా వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ను చుట్టుముట్టిన కష్టాలకు కూటమి ప్రభుత్వంలోనైనా విముక్తి లభిస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం