- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP news: అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వైకాపా దాష్టీకాల్లో భాగస్వాములైన పోలీసుల జాబితా సిద్ధం!
గత ప్రభుత్వ హయాంలో నమోదైన అక్రమ కేసుల వివరాల సేకరణ
ముఖ్యమైన కేసుల్ని నిర్వీర్యం చేయటంపైనా ఆరా
ఈనాడు-అమరావతి: వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టాలు, నిబంధనల్ని లెక్క చేయకుండా వైకాపా బంటుల్లా పేట్రేగిన కొందరు పోలీసు అధికారులు వీటిల్లో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. జగన్ జమానాలో పెద్దఎత్తున సాగిన అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలు, వాటికి కారకులు, బాధితులకు అండగా ఉండకుండా.. రివర్స్లో వారిపైనే కేసులు బనాయించిన ఉదంతాలు, వాటికి బాధ్యులైన వారి వివరాలతో జాబితా సిద్ధం చేస్తోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది.
డాక్టర్ సుధాకర్ మరణం మొదలు.. అమర్నాథ్గౌడ్ హత్య వరకు
కరోనా వేళ మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మొదలు.. తన అక్కను వేధిస్తున్న వైకాపా మూకల్ని ప్రశ్నించినందుకు వారి చేతిలో హత్యకు గురైన పద్నాలుగేళ్ల బాలుడు అమర్నాథ్గౌడ్ కేసు వరకూ అన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది. వైకాపా నాయకుడి కుమార్తె కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న చదువుల తల్లి మిస్బాను ఆత్మహత్య చేసుకునేలా వేధించటం, మాస్క్ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్కుమార్ చావుకు కారణమవ్వటం, దొంగతనం కేసులో ఇరికించి.. హింసించి అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు బాధ్యులవ్వటం వంటి ఘటనలన్నింటిపైనా పోలీసు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని అంతమొందించి.. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసును ఎలా నీరుగార్చారు? దానికి ఎవరు బాధ్యులన్న సమాచారాన్నీ తీసుకుంటున్నారు. ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై సాగిన తీవ్ర అణచివేత, హింసాత్మక ఘటనలన్నింటినీ సమీక్షించి, వాటిల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెదేపా కార్యకర్తల హత్యలతోపాటు ఇతర కేసుల ప్రస్తుత స్థితిపై నివేదిక
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా.. ఒక్కర్ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ ఫుటేజీలో దాడులు చేసిన వారెవరో స్పష్టంగా తెలుస్తున్నా.. వారిని ఎందుకు గుర్తించలేదు? ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపైకి నాటి వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ వందలాది మందితో దండయాత్రగా వెళ్లి దాడికి తెగబడితే.. ఏ ఒక్కర్నీ ఎందుకు అరెస్టు చేయలేదు? వీటి వెనక ఉన్న శక్తులెవరనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వీటితోపాటు గన్నవరం, మాచర్లలో తెదేపా కార్యాలయాలపై దాడి, దహనం చేసిన కేసులను ఎవరు నిర్వీర్యం చేశారనేది ఇప్పటికే గుర్తించింది. మాచర్లలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా రాష్ట్రవ్యాప్తంగా గత అయిదేళ్లలో జరిగిన తెదేపా కార్యకర్తలు, నాయకుల హత్యలు.. దాడుల కేసుల పురోగతి, ప్రస్తుత స్థితిపై పోలీసు ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలను నివేదికలు అడిగారు. అవసరమైతే వాటిపై పునఃవిచారణ చేయించాలని భావిస్తున్నారు.
ఆస్తులు, వ్యాపారాలు, గనులు లాక్కున్న వారిపైనా నివేదికలు
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని ప్రయోగించి ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కొంతమంది అధికారులూ భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల్లో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేస్తోంది. వైకాపా ప్రభుత్వ బాధితులు కొంతమంది ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.