Alluri Sitarama Raju: వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత: మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్‌

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మంగళవారం పెదబయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు.

Updated : 03 Jul 2024 08:52 IST

మాజీ ఎంపీపీ బాలంనాయుడిని ఎత్తుకొని అభినందిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

పెదబయలు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మంగళవారం పెదబయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జామిగుడ పంచాయతీ గుంజివాడకు చెందిన మాజీ ఎంపీపీ జర్సింగి బాలంనాయుడికి కొద్దినెలల కిందటే వందేళ్లు పూర్తయ్యాయని తెలుసుకున్నారు. ఆయన్ని పిలిపించుకుని కలెక్టర్‌ మాట్లాడడమే కాక ఎత్తుకొని అభినందించారు. ఇన్నేళ్లు ప్రజాజీవితంలో ఉండి మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని