- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Peddireddy: పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు.
ప్రజలు కాలు పెట్టకుండా గేట్లు
మూడెకరాల బుగ్గమఠం భూముల్లో సౌధం
కార్పొరేషన్ నిధులతో రోడ్డు
గేట్లు పెట్టి.. సొంత అవసరాలకు వినియోగం
విధేయత ఒలకబోస్తున్న నగరపాలక అధికారులు
రోడ్డుకు అడ్డంగా ఎవరూ రాకుండా ఏర్పాటు చేసిన గేటు
ఈనాడు, తిరుపతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. వైకాపా సర్కారు హయాంలో దీనికి అధికారగణం అడ్డంగా సహకరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వారంతా విధేయత చాటుకుంటూనే ఉన్నారు. దారి తెరవండి మహాప్రభో అని స్థానికులు మొరపెట్టుకుంటున్నా.. కార్పొరేషన్ నిధులతో రోడ్డు వేశారో లేదో పరిశీలించి రెండు రోజుల్లో చెబుతామంటూ అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు ధర్నాకు దిగితే.. వారిని అక్కడ నుంచి తొలగించడంపై చూపిన శ్రద్ధ.. దారి తెరవడంపై మాత్రం పెట్టడం లేదు. బుగ్గ మఠం భూములను చెరబట్టి మూడెకరాల్లో సౌధం నిర్మించుకున్నారని.. జనసేన నాయకుడు కిరణ్రాయల్ ఆరోపించారు.
మూడు ఎకరాల బుగ్గమఠం భూముల్లో
తిరుపతి రాయల్నగర్లో మూడుఎకరాల విస్తీర్ణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసం ఉంది. ఇవి బుగ్గమఠం భూములని.. ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీగా ఉన్న సమయంలో ఈ భూమి మధ్య నుంచి ఒక మట్టి రోడ్డు ఉండేది. కార్పొరేషన్లో విలీనమైన తర్వాత గ్రావెల్ రోడ్డు నిర్మించారు. వెస్ట్ చర్చితోపాటు ఎమ్మార్పల్లి వైపు నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగాయి. వైకాపా అధికారంలోకి రాగానే ఈ దారిని మూసేశారు. అటువైపు ఎవరూ రాకుండా కంచె వేసేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన క్షేత్రంలో నుంచి కార్పొరేషన్ అధికారులు నిర్మించిన సిమెంటు రోడ్డు
టెండరు కూడా పిలవకుండా
కార్పొరేషన్ నిధులతో తన ఇంటికి రోడ్డు వేయించుకునేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ప్రజల్ని అడ్డం పెట్టుకున్నారు. రాకపోకలు సాగించేందుకు వీలుగా సీసీ రోడ్డు నిర్మించాలని వారి పేరుతో దరఖాస్తు ఇప్పించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై కదిలారు. వెంటనే 400 మీటర్ల రోడ్డుకు అంచనాలు రూపొందించారు. నిబంధనల మేరకు రూ.10 లక్షలకు పైన వ్యయమయ్యే ఏ పని చేయాలన్నా టెండరు పిలవాలి. అయితే దీన్ని రెండు భాగాలుగా విభజించి.. (రూ.9.55 లక్షలు, రూ.9.50లక్షల చొప్పున) పనుల్ని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. మొత్తంగా పెద్దిరెడ్డి ఇంటికి రోడ్డు కోసం రూ.19.05 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ప్రజల అవసరాలను పక్కన పెట్టి రోడ్డుకు గేట్లు పెట్టి సొంతానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల వాహనాలు తప్ప ఇతరులు ఎవరూ కూడా రాయల్నగర్ ప్రాంతం వైపు నుంచి వచ్చేందుకు అవకాశం లేకుండా చేశారు.
గేట్లు తొలగించకుంటే బద్దలు కొడతాం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద జనసేన నేతల ఆందోళన
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తున్న జనసేన నేతలు
బుగ్గమఠం భూములను ఆక్రమించడమే కాకుండా అందులో నుంచి కార్పొరేషన్ సొమ్ముతో సీసీ రహదారిని నిర్మించి సామాన్య ప్రజలు ఎవరూ వెళ్లకుండా అడ్డుగా పెట్టిన గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద జనసేన నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. రహదారికి అడ్డంగా వేసిన గేటును తొలగించాలంటూ జనసేన నేత కిరణ్ రాయల్, సుభాషిణి తదితరులు పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా గేటును తొలగించేందుకు చొచ్చుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు
ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. -
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఓఆర్ఆర్తో ‘అభివృద్ధి పరుగులు’
అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. -
రేపటి నుంచి ఉచిత ఇసుక
రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. -
విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!
దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. -
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. -
8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
-
‘కల్కి’ మరో రికార్డు.. కమల్హాసన్ డైలాగ్పై సాయిమాధవ్ ఏమన్నారంటే?
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!