- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TGHigh Court: జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది.
తెలంగాణ హైకోర్టు ఆదేశం
కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి
పురోగతిపై నివేదిక ఇవ్వాలని సీబీఐ కోర్టుకు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ.. విచారణను 23కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తి చేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ముందుకు సాగని కేసులు
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై కేసుల విచారణను సమీక్షిస్తోంది. ప్రజాప్రతినిధుల్లో అత్యధిక కేసులను జగన్మోహన్రెడ్డి ఎదుర్కొంటున్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై 11 సీబీఐ కేసులు, 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు పలువురు నిందితులు దాదాపు 134 దాకా డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ గత ఏడాది డిసెంబరు 15న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల తయారీ ప్రక్రియ కొనసాగుతోందని, 13 వేల పేజీల రికార్డులు, అధిక సంఖ్యలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించడంలో జాప్యం జరుగుతోందని, దిద్దుబాట్లు తదితరాలకు ఏప్రిల్ 30 వరకు గడువు కావాలని సీబీఐ కోర్టు హైకోర్టుకు ఫిబ్రవరి 15న లేఖ రాసింది. దీనిపై విచారించిన హైకోర్టు డిశ్ఛార్జి పిటిషన్లను తేల్చడానికి ఏప్రిల్ 30 వరకు గడువిచ్చింది. అయితే ఏప్రిల్ 19న భారీ ఎత్తున చేపట్టిన 47 మంది జడ్జీల బదిలీల్లో భాగంగా సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. డిశ్ఛార్జి పిటిషన్లపై ఉత్తర్వులు వెలువరించి రిలీవ్ కావాల్సి ఉండగా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా డిశ్ఛార్జి పిటిషన్లపై ఉత్తర్వులు సిద్ధం కాకపోవడంతో పిటిషన్లను తిరిగి విచారణకు రీఓపెన్ చేసి వెళ్లారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టి.రఘురాం తాజాగా ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టారు. వారం రోజులుగా రోజు విడిచి రోజు వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులతో జగన్ కేసుల్లో విచారణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి
ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు.