- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP news: భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి.
డీ పట్టా, 22ఏ ఎసైన్డ్ భూములపై ఉన్నతాధికారులు, వైకాపా నేతల కన్ను
జగన్ హయాంలో అడ్డగోలుగా యజమానులతో ఒప్పందాలు
భోగాపురం కోస్టల్ కారిడార్ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో జీడితోటలు
ఈనాడు, విజయనగరం - భోగాపురం, పూసపాటిరేగ, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. అధికారమే అండగా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలోని డీ పట్టా, 22ఏ ఎసైన్డ్ భూములపై కన్నేశారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి సహకారం కూడా తోడవడంతో బరితెగించారు. విజయనగరం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూముల స్వాధీనానికి పావులు కదిపారు.
గతేడాది మే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిశీలన వంకతో వచ్చిన కొందరు ఉన్నతాధికారులు తమకు అనుకూలమైన డి-పట్టా భూములు చూసుకున్నారు. వీరికి స్థానిక అధికారులు సహకరించారు. విజయనగరం జిల్లా సరిహద్దులోని విశాఖ జిల్లా భీమిలి రెవెన్యూ పరిధిలో అన్నవరం నుంచి చేపలుప్పాడ వరకు 630 ఎకరాల 22-ఎ భూముల యజమానులతో చర్చలు జరిపారు. వారిని ఒప్పించిన ఉన్నతాధికారి కుటుంబ వ్యాపార భాగస్వామి ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అడ్వాన్స్లు చెల్లించారు. ఆ తర్వాత భోగాపురం మండలం వైపు తూడెం, దిబ్బలపాలెం, పిన్నింటిపాలెం, రామచంద్రపేట, చింతపల్లి, బర్రిపేట, కందివలస వరకు వందలాది ఎకరాల డి-పట్టా భూములకు గాలం వేశారు. స్థానిక వైకాపా నాయకుల మధ్యవర్తిత్వం, స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఒప్పంద పత్రాలు రాయించారు.
పూసపాటిరేగలో డి-పట్టా భూముల మధ్యలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన రహదారి
ప్రభుత్వం మారడంతో బెదిరింపులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. ముందుగా ఒప్పందం చేసుకున్న వారెవరైనా మాటమార్చితే తమ ‘ప్రతాప’ం చూపుతామంటూ రైతులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో అధిక సంఖ్యలో డి-పట్టా భూములకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నారో జాడలేదని, చరవాణుల్లో తమను బెదిరిస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పూసపాటిరేగ మండలం కందివలస గ్రామానికి చెందిన రైతులు తమ డి-పట్టా భూముల్లో సరుగుడు తోటలు పెంచారు. వాటి ఫలసాయం అందుకునే దశలో భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ విషయం ఎక్కడైనా బయటపెడితే మూల్యం చెల్లించుకుంటారని వారిని బెదిరిస్తున్నట్లు తెలిసింది. అప్పట్లో ఈ రెండు మండలాల్లో పనిచేసిన రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బ్రోకర్లకు అన్ని విధాలా సహకరించారు. అప్పటి డీజీపీ స్థాయి అధికారి ఏరికోరి తమ వారికి అన్నివిధాలా అండగా నిలిచే అధికారులనే ఈ ప్రాంతంలో నియమించారు.
ఆ వంద ఎకరాల మాటేమిటి?
భోగాపురం మండలం కంచేరు రెవెన్యూలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి జీడితోటలతో నిర్మానుష్యంగా ఉండేది. ఈ భూమిపై అప్పట్లో వైకాపా నాయకులు కొందరు కన్నేశారు. వాటాలు వేసుకొని హద్దులు పాతేశారు. అప్పట్లో ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు నాలుగైదు రోజులు హడావుడి చేశారు. ఈ సమాచారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారికి తెలిసింది. ఈ భూమిని విమానాశ్రయ వాణిజ్య అవసరాలకు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంపై కన్నేసిన ఐఏఎస్ అధికారి ఒకరు ఇది భవిష్యత్తులో బీచ్ కారిడార్కు అనుకూలంగా ఉంటుందని భావించారు. ఆయన వెళ్లిన తర్వాత మరికొందరు ఐఏఎస్ అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో రెండు రోజులు పర్యటించారు. ఎలాగైనా ఈ భూమిని చేజిక్కించుకోవాలని పథకం రచించినా ప్రభుత్వం మారడంతో తాత్కాలికంగా అందరూ గప్చుప్గా ఉన్నారు.
ఎవరి కోసం ఈ రోడ్డు?
గత ప్రభుత్వాలు పూసపాటిరేగ మండలంలో అత్యధికంగా పేదలకు డి-పట్టా భూములు పంపిణీ చేశాయి. అందులో జాతీయ రహదారి పక్కనే సుమారు 400 ఎకరాలు ఉన్నాయి. వీటిని ఆక్రమించుకునేందుకు వైకాపా పెద్దలు, కొందరు అధికారులు కన్నేశారు. కొంత మంది రైతులతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములకు భవిష్యత్తులో విలువ పెరుగుతుందని ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేయించారు. చోడమ్మ అగ్రహారం నుంచి పొట్టసోములు కల్లాల వరకు, అక్కడి నుంచి సమీపంలోని ఓ ప్రైవేటు పరిశ్రమ వెనుకభాగం వరకు రెండు బిట్లుగా సుమారు రూ.10 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పొడవునా గ్రామమే కాదు ఒక్క ఇల్లు కూడా లేకపోయినా, ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయడం అక్రమార్కుల ముందుచూపునకు అద్దం పడుతోంది.
ఐబీ అధికారుల ఆరా
భోగాపురం మండలంలో ఇటీవల కేంద్ర నిఘా సంస్థ అధికారులు పర్యటించారు. విమానాశ్రయం పనులు ఎలా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో డి-పట్టా భూముల లావాదేవీలపై పత్రికల్లో వచ్చిన కథనాలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆరా తీసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.