- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
YS Jagan: జగన్ రక్షణకే 986 మంది
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో నిరంతరం ఎంతమంది పోలీసులు ఉంటారో తెలుసా? పదీ, ఇరవై కాదు.. ఏకంగా 986 మంది.
ఇంట్లో ఉంటేనే ఇంతమంది.. బయటకెళ్తే రెండు, మూడింతలు
ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రూ.296 కోట్లు
ప్యాలెస్ చుట్టూ అడుగడుగునా తనిఖీలు.. అత్యాధునిక రక్షణ పరికరాలు
తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్పోస్టులు
చుట్టుపక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా
ఆయన మాజీ సీఎం అయినా ఇప్పటికీ అదే భద్రత!
మాజీ సీఎంకు రెండు బుల్లెట్ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు
సీఎం చంద్రబాబుకు బుల్లెట్ప్రూఫ్ ఫార్చూనర్ వాహనమే
ఈనాడు - అమరావతి
జగన్ బయటకు వచ్చారంటే చాలు.. ఇంత భారీ భద్రత, ఆర్భాటం నిత్యకృత్యం. 2023 సెప్టెంబరులో ‘వాహనమిత్ర’ నిధుల విడుదల సభకు వెళుతున్నప్పటి చిత్రం ఇది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో నిరంతరం ఎంతమంది పోలీసులు ఉంటారో తెలుసా? పదీ, ఇరవై కాదు.. ఏకంగా 986 మంది. అంటే ఒక చిన్న గ్రామ జనాభాతో సమానం! దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర ఉండే భద్రతాసిబ్బంది అందరినీ కలిపినా ఈ సంఖ్య చేరడం కష్టమే. వీరికి ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.50 వేల లెక్కన చూసినా ఐదేళ్లలో చెల్లించిందే రూ.296 కోట్లు. ఆపైన ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు.. ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ (కంచె), బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు.. ఇలా ఎన్నో! దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జడ్ ప్లస్ కేటగిరీలో ఉండే వారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో! తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉంటారు. మూడు షిఫ్టుల్లో కలిసి ఈ సంఖ్య 934. ఇదంతా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే. బయటకు అడుగుపెడితే భద్రతా సిబ్బంది సంఖ్య రెండు, మూడింతలు పెరుగుతుంది. కిలోమీటర్ల పొడవునా చెట్లు కొట్టేస్తారు. పరదాలు కట్టేస్తారు. దుకాణాలు మూయిస్తారు. రాకపోకలు నిలిపేస్తారు. జగన్మోహన్రెడ్డి కోసం ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు, ఆ మార్గంలో ప్రయాణించే వారైతే ఐదేళ్లుగా నరకమే చూస్తున్నారు. తమ ఇంటికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా గుర్తింపుకార్డులు మెడలో వేసుకుని తిరగాల్సిందే. అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే.. వారికి రుజువులు చూపించాలి. ఎవరైనా వస్తున్నారంటూ కొద్దిసేపు ఆగమంటే.. ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టేసి చేతులు కట్టుకుని నిల్చోవాల్సిందే. ఇళ్లపై ఎగరేసే డ్రోన్ల ద్వారా వారి వ్యక్తిగత గోప్యతకూ ఐదేళ్లుగా భంగం వాటిల్లుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత ఉండాల్సిందే. అయితే ఇంత భారీ స్థాయిలోనా? అవసరానికి మించి ఉండాలా అనేదే ప్రశ్న. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. తీవ్రవాదుల ఆనవాళ్లు లేవు. జగన్కు వారి నుంచి అంత ముప్పూ లేదు. అయినా ప్రత్యేక చట్టం తెచ్చి మరీ రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు ఇలా అసాధారణ భద్రత ఉంటుందని విన్నాం. కానీ జగన్ ఆయన్ను తలదన్నేస్తున్నారు.
అడుగడుగునా చెక్పోస్టులు
తాడేపల్లిలో జగన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్పోస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ప్యాలెస్ చుట్టూనే కాదు ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజి సహా అడుగడుగునా చెక్పోస్టులే. ఒక్కోచోట 10 నుంచి 16 మంది కాపు కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. సీఎం రక్షణలో నిమగ్నమయ్యే బాంబ్ స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు అదనం. ఎస్ఎస్జీ బలగాలు కాకుండా.. చెక్పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు సుమారు 555 మంది. గుంటూరు జిల్లా నుంచి ఎస్పీ ర్యాంకు అధికారితోపాటు ఏపీఎస్పీ బెటాలియన్స్ నుంచి ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మొత్తం 389 మంది భద్రతా సిబ్బందికి 50% అదనపు భత్యం చెల్లిస్తున్నారు.
379 మందితో కమాండో తరహా వ్యవస్థ..
దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో జగన్కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్ఎస్జీ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, 116 మంది ఇతరత్రా విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రపతి, ప్రధానికి మించిన స్థాయిలో ఆయన చుట్టూ పోలీసు వలయం ఏర్పాటైంది. ఆయనతోపాటు భారతికి నలుగురు, తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్తోపాటు లోటస్పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం జగన్ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంటారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులకు కూడా దేశ, విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంతగా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో మరెవరూ ఉండరేమో?
సాయుధ బలగాలతో నిత్యం యుద్ధవాతావరణం
తాడేపల్లి పెట్రోలు బంకు నుంచి భరతమాత విగ్రహం వరకు.. సర్వీస్రోడ్డులో పెద్దఎత్తున యూనిఫాంలో ఉండే సాయుధ పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. రోజూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్లను బ్లాక్ చేసి.. రాకపోకలు నిలిపేస్తుంటారు. ఐదేళ్లుగా అక్కడి ప్రజలు ఈ నిర్బంధంలో మగ్గుతున్నారు. జగన్ రక్షణ పేరుతో డ్రోన్ పహారా నిత్యకృత్యంగా తయారైంది. ఆయన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు ఏ క్షణం ఏం చేస్తున్నారో అంటూ పోలీసులు డ్రోన్ల ద్వారా గమనిస్తుంటారు. సొంత ఇంట్లోనూ స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి కల్పించారనే ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. నివాస ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలున్నా.. జగన్ నివాసం దగ్గర మాత్రం అవన్నీ వర్తించవన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇలా ఎగరవేసిన డ్రోన్ ఒకటి నియంత్రణ కోల్పోయి, కనిపించకుండా పోవడంతో.. తాడేపల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి.. అయినా అదే భద్రత
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్కు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఓడి పోయినా ఇప్పుడూ అదే కొనసాగుతోంది. అక్కడి ప్రజల ఇబ్బందులు ఎంతమాత్రం తీరలేదు. వినతులు ఇవ్వగా, ఇవ్వగా.. ఇటీవల ప్యాలెస్ పక్క రోడ్డులో రాకపోకలకు అనుమతించారు. నిజానికి ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేదు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఉన్న భద్రత ఎంతమాత్రం తగ్గించలేదు. జగన్ కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ప్రూఫ్ కార్లు ఉండగా.. జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్ప్రూఫ్ ఫార్చూనర్ వాహనం మాత్రమే అందుబాటులో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. -
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు