- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది.
రాజకీయ సిఫార్సు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట
సాధారణ ఉపాధ్యాయులకూ న్యాయం జరిగేలా చట్టం
14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు
ఈనాడు - అమరావతి
రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సాధారణ ఉపాధ్యాయులకూ న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు. 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో మూలకు పడేశారు. ఇప్పుడు లోకేశ్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలి.
ఉపాధ్యాయుల అభిప్రాయాలతో..
బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాలు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా.. మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలుచేస్తున్నాయి. అస్సాం, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా.. బిహార్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపుర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి. వీటిన్నింటినీ అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనుంది.
కర్ణాటకలో అందరికీ అన్ని కేటగిరీలు
కర్ణాటకలో మూడు కేటగిరీల విధానం ఉంది. ఎక్కువ రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేశాకే బదిలీలు చేపడుతున్నాయి. కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు, మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు జోన్-సీలో చేరాలి. అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీచేసి, అక్కడ వచ్చే ఖాళీలను భర్తీచేస్తారు. సర్వీసు ఆధారంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటుంది. జోన్-ఏలో పదేళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులను జోన్-బీ, సీలకు బదిలీ చేస్తారు. ఏడాది విడిచి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో బదిలీలు చేస్తున్నారు. మూడేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ విధానం ఉంది.
- అరుణాచల్ప్రదేశ్లో ప్రత్యేక విధానం ఉంది. ప్రతి ఏటా డిసెంబరులో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. జనవరి 1-15 వరకు ఖాళీలను గుర్తిస్తారు. మే 1-15 వరకు కౌన్సెలింగ్కు ఐచ్ఛికాలు తీసుకుని, మే 16-31 మధ్య బదిలీ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ తప్పనిసరి.
- హిమాచల్ప్రదేశ్లో ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి 15లోపు బదిలీలు చేస్తారు. ఐదేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది. మణిపూర్లో విద్యాసంవత్సరం ముగిశాక బదిలీలు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు మూడేళ్లు, కేటగిరి-సీలో రెండేళ్లు, కేటగిరి ఏ, బీలలో మూడేళ్లు పూర్తి చేసుకున్నవారికి తప్పనిసరి బదిలీ విధానం ఉంది.
- పంజాబ్లో డిసెంబరులో హేతుబద్ధీకరణ, జనవరిలో ఖాళీల ప్రకటన, ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి రెండో వారంలోపు బదిలీలు పూర్తిచేసి, ఆర్డర్లు ఇస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఉద్యోగం చేరినవారు మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకుంటే తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పరిగణిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. -
జగన్ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్సైట్లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. -
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. -
నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. -
సూర్యారాధన చేసిన పవన్ కల్యాణ్
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలో దొంగల హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. -
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. -
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. -
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. -
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!
గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
గతంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. -
సంక్షిప్త వార్తలు (11)
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్మార్క్ తెలిపారు. -
ఇదీ సంగతి!
-
ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. -
కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే