- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pulivendula: పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
స్టార్ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది.
హోటల్ పేరుతో జగన్ అనుయాయుడి క్లబ్హౌస్ కొన్న పర్యాటకాభివృద్ధి సంస్థ
అమ్మకందారు చెప్పిన రూ.12.87 కోట్లకే రిజిస్ట్రేషన్
సీఎంఓ అధికారుల ఆదేశాలతో అడ్డగోలు వ్యవహారం
పులివెందులలో పర్యాటకాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసిన క్లబ్హౌస్
ఈనాడు, అమరావతి: స్టార్ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది. దాని యజమాని.. వివేకా హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్రెడ్డికి బావ వరసయ్యే విజయభాస్కర్రెడ్డి! మరో రూ.23.50 కోట్లతో దాన్ని స్టార్హోటల్గా అభివృద్ధి చేయించేందుకు టెండర్లు పిలిపించింది. పర్యాటకాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యమిది. ఆయన జమానాలో సాగించిన అక్రమాలకు ఇదో మచ్చుతునక. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో హోటల్ పనులు నిలిచిపోయాయి. జగన్ తన కుటుంబం, సొంత మనుషుల కోసం పర్యాటకరంగ అభివృద్ధి పేరుతో ఊరుకో ప్యాలెస్, వాడకో స్టార్హోటల్ ప్రజాధనంతో నిర్మించుకున్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు దానికి ఏకపక్షంగా సహకరించారు.
అడ్డగోలుగా క్లబ్హౌస్ కొనుగోలు
పర్యాటకరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రైవేటు సంస్థలకు భూములు, స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పులివెందులలో క్లబ్హౌస్ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారని పులివెందులలోని విజయహోమ్స్లో చవ్వ విజయభాస్కర్రెడ్డికి చెందిన 1.71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్హౌస్ను రూ.12.87 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం పర్యాటకాభివృద్ధి సంస్థ అప్పటి ఛైర్మన్ వరప్రసాద్రెడ్డి, సభ్యులుగా ఉన్న పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్భార్గవ (ఇటీవల బదిలీ అయ్యారు), పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కన్నబాబు, ఇతర సభ్యులు తీర్మానం చేశారు. పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారుల అత్యుత్సాహంతో విజయభాస్కర్రెడ్డికి భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1.71 ఎకరాల స్థలం రూ.1,65,52,800కు, అందులో 46,050 చదరపు అడుగుల్లో నిర్మించిన నిర్మాణాలను రూ.7,46,19,600కు కొన్నారు. మొత్తం రూ.9,11,72,400పై సవరించిన విలువ కింద మరో 41.18% (రూ.3,75,44,700) జతచేసి రూ.12,87,17,100 చెల్లించారు. 2023 సెప్టెంబరు 26న విజయవాడలోని పటమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్ జరిగింది.
జగన్ జమానాలో పర్యాటకాభివృద్ధి సంస్థ దివాలా
గత ఐదేళ్లలో పర్యాటకరంగ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా జగన్ సొంత ప్రయోజనాల కోసం పర్యాటకాభివృద్ధి సంస్థను దివాలా తీయించారు. రుషికొండపై లక్షణంగా ఉన్న హోటల్, రెస్టారెంట్, సమావేశ మందిరం, ఇతర నిర్మాణాలు తొలగించి అదే స్థలంలో రాజభవనం నిర్మించారు. రుషికొండపై అప్పటికే ఉన్న నిర్మాణాల తొలగింపుతో పర్యాటకాభివృద్ధి సంస్థ గత మూడేళ్లలో రూ.10 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుత రాజభవనం ద్వారా రూపాయి ఆదాయం లేకపోగా... విద్యుత్తుఛార్జీలు, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
ఎవరు బాధ్యులు?
పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్టుల మరమ్మతులకు నిధుల్లేవంటూ గత ఐదేళ్లూ బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు రూ.12.87 కోట్లతో ఆఘమేఘాలపై క్లబ్హౌస్ కొనేశారు. ఈ విషయాన్ని ఏడాదిన్నరగా గోప్యంగా ఉంచారు. పులివెందులలో స్టార్హోటల్ నిర్మిస్తే సంస్థకు ఉపయోగం ఉంటుందా? అని అధికారులు ఆలోచించలేదు. సీఎంఓ అధికారులు చెప్పినట్లుగా తలూపారు. రూ.12.87 కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే. దీనికి ఎవరు బాధ్యులు? కొన్న ధరకు విక్రయించినా కొనేవారు లేరు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
నిర్మాణ పనులకు రూ.23.50 కోట్ల పాడా నిధులు
క్లబ్హౌస్ను ఫోర్స్టార్ హోటల్గా రూ.23.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) ద్వారా టెండర్లు పిలిచారు. 2023-24 బడ్జెట్ నుంచి నిధులు ఖర్చుచేసేందుకు తీర్మానం చేశారు. దీన్ని అభివృద్ధి చేసి తిరిగి పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. టెండర్ ఖరారు చేసిన పాడా అధికారులు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పనులు ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కథ అడ్డం తిరిగింది. ఇప్పటివరకైతే పనుల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లు రద్దుచేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అనుమతి లేకున్నా.. ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం
ధనార్జనే ధ్యేయంగా గత ఐదేళ్లలో వైకాపా నాయకులు వీలున్నచోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. -
నెల్లూరు జిల్లాలో 2 పెద్దపులులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు. -
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ
మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. -
సూర్యారాధన చేసిన పవన్ కల్యాణ్
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. -
జగన్ పర్యటనలో దొంగల హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. -
జగన్ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్సైట్లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. -
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. -
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. చిన్నఅవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకూ పనులు తుది దశకు వచ్చాయి. -
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. -
ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి
గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
పెద్దిరెడ్డీ.. ఇదేం పని?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘ఘన’కార్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రాయల్నగర్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సొమ్ముతో ఇంటికి సీసీ రోడ్డు వేయించుకున్నారు.. అంతేకాకుండా మరెవరికీ ప్రవేశం లేదంటూ రెండు వైపులా గేట్లు పెట్టేశారు. -
చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మన్యంవీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
గుంతలు పూడ్చే ప్రాజెక్టు గోవిందా!
గత వైకాపా ప్రభుత్వం తలపెట్టిన గ్రామీణ రహదారుల్లో గుంతలు పూడ్చే ప్రాజెక్టు అటకెక్కింది. ఆర్థికసాయం చేసేందుకు నాబార్డు ససేమిరా అనడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
గతంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి
దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. -
సంక్షిప్త వార్తలు (11)
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరిస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్మార్క్ తెలిపారు. -
ఇదీ సంగతి!
-
ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. -
కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.