- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
YSRCP: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు.
భూసేకరణ కంటే ముందే కొన్నిచోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్
తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ
రైతుల నుంచి కమీషన్ రూపంలోనూ భారీగా వసూళ్లు
18 లేఔట్లలోనే రూ.482 కోట్ల మేర కుంభకోణం
ఈనాడు, అమరావతి, యంత్రాంగం
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. ప్రభుత్వం ఇళ్లస్థలాల కోసం భూ సేకరణ చేస్తుందని తెలుసుకున్న వైకాపా నేతలు కొన్నిచోట్ల రైతుల నుంచి ముందే తక్కువ ధరకు అగ్రిమెంటు చేసుకున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేశారు. తర్వాత ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయగానే భూముల విలువను మార్కెట్ ధర కంటే 25-30% వరకు పెంచి చూపించారు. ఆ మేరకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేసింది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే కొన్ని చోట్ల భూమిని సేకరించిన వారం, పది రోజుల్లోనే నిధులు వారి ఖాతాల్లోకి జమ అయ్యాయి. రైతులకు పప్పుబెల్లాలిచ్చి, వైకాపా నేతలు భారీగా దోచుకున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఈ తరహా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. మరికొన్ని చోట్ల రైతుల నుంచి కమీషన్ రూపంలో దోచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లేఔట్లలోని భూసేకరణ అవకతవకలను లెక్కిస్తేనే దాదాపు రూ.482 కోట్ల కుంభకోణం తేలింది. దీనిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.
ప్రైవేటు భూముల సేకరణకు రూ.11 వేల కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల కోసం వైకాపా ప్రభుత్వం రూ.11,334 కోట్లు పెట్టి ప్రైవేటు భూముల్ని కొనుగోలు చేసింది. కాలనీల ఏర్పాటుపై సమాచారమున్న కొందరు నేతలు... వారి భూములకు సమీపంలో అవి వచ్చేలా చేసుకుని విలువ పెరిగేలా మంత్రాంగం నడిపారు. మరికొందరు పేదల నుంచి తక్కువ ధరకు భూముల్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎన్నికల నాటికే రూ.11,164 కోట్లు వైకాపా ప్రభుత్వం చెల్లించింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.100 కోట్లకు పైగా..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూ సేకరణ పేరుతో రూ.100 కోట్లకు పైగానే వైకాపా నేతల జేబుల్లోకి వెళ్లింది. గన్నవరం నియోజకవర్గంలో 400 ఎకరాలు కొన్నారు. ఇక్కడ ఎకరం రూ.35 లక్షల వరకు ఉంటే రూ.50-60లక్షల చొప్పున కొన్నారు. కిందిస్థాయి అధికారి నుంచి అప్పటి కీలక ప్రజాప్రతినిధి వరకూ అందరూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మచిలీపట్నం పరిధిలో ఎకరా రూ. 15 లక్షలుంటే.. రూ.32 లక్షలకు కొన్నారు. ఇక్కడ 380 ఎకరాల కొనుగోలులో వైకాపా ప్రజాప్రతినిధి తనయుడు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి.
- గుడివాడ శివారులో 77 ఎకరాలను సేకరించారు. ఎకరా మార్కెట్ ధర రూ.25లక్షలు ఉంటే.. రూ.55లక్షలు చెల్లించారు. రైతుల ఖాతాలో సొమ్ములు పడగానే ఎకరాకు రూ.5-10 లక్షల కమీషన్లు వసూలుచేశారు. ఇక్కడి కీలక వైకాపా నేత, ఆయన ముఖ్య అనుచరులు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
- నందిగామలోని అనాసాగరంలో 35 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇక్కడ ఎకరానికి రూ.5లక్షల చొప్పున అక్కడి వైకాపా నేత కమీషన్ తీసుకున్నారు.
ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షల డిమాండ్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జగనన్న కాలనీల ఏర్పాటుకు వైకాపా నాయకుల ఒత్తిడితో అధికారులు 8 ఎకరాల ఎసైన్డ్ భూమిని ఎంపికచేశారు. ఎకరం రూ.44.53 లక్షల చొప్పున రూ.3.56 కోట్లు చెల్లించారు. ఇందుకు రైతుల నుంచి వైకాపా నాయకులు రూ.20 లక్షలు డిమాండ్ చేయగా రూ.10 లక్షలు ఇచ్చామని అప్పట్లో రైతులు ఫిర్యాదుచేశారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి, మేర్లపాక, పాగలి ప్రాంతాల్లో జగనన్న కాలనీల కోసం 385 ఎకరాలు సేకరించారు. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన అప్పటి వైకాపా ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు చేతివాటం ప్రదర్శించారు. రైతుల నుంచి ఎకరాకు రూ.లక్షపైనే.. అంటే రూ.3.85 కోట్లు రైతుల నుంచి వసూలు చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలో 169 ఎకరాలు సేకరించారు. వీటిని ఏ, బీ, సీ, డీగా విభజించి దానికి అనుగుణంగా పరిహారం చెల్లించారు. ఆ విభాగాలను మార్చేందుకు స్థానిక వైకాపా నేతలు రైతుల నుంచి సొమ్ము వసూలుచేశారు.
రూ.30 లక్షల భూమి రూ.80 లక్షలకు కొనుగోలు
బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో వైకాపా నేతలు 1.17 ఎకరాలను గజాల లెక్కన ధర నిర్ణయించారు. ఇక్కడ ఎకరా రూ.30 లక్షలు ఉంటే... రూ.88 లక్షలకు కొనిపించారు. తూర్పు బాపట్లలో 52 ఎకరాలకు పైగా ఎసైన్డ్ భూముల్ని జగనన్న కాలనీకి అధికారులు సేకరించారు. దీనికి సాగుదారులకు రూ.36కోట్లు చెల్లించారు. ఇందులో రూ.6 కోట్లను అధికారపార్టీ ప్రజాప్రతినిధి స్వాహాచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- నెల్లూరు జిల్లా కావలిలో జగనన్న కాలనీ కోసం ముసునూరు వద్ద 112 ఎకరాలను సేకరించారు. అక్కడ మార్కెట్ ధర ఎకరాకు రూ.12లక్షలు ఉండగా.. రూ.55లక్షలకు కొన్నారు. ఇందులో 13 ఎకరాలు వైకాపా నేతకు చెందిన 12 మంది అనుయాయుల పేరుతో కొనుగోలు చేసి ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో రూ.30కోట్లను వైకాపా నేతలు దండుకున్నారు.
- కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని మండగిరిలో 190 ఎకరాల్లో జగనన్న లేఔట్ వేశారు. అక్కడి ప్రజాప్రతినిధి తన బినామీలతో మండగిరిలో భూములను కొనిపించారు. రైతుల నుంచి ఎకరం రూ.5 లక్షలకు సేకరించి రూ.13.50 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి కొనిపించారు. రూ.15 కోట్ల మేర అవినీతి జరిగింది.
తెనాలిలో రూ.81 కోట్ల దోపిడీ
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో 500 ఎకరాలకు పైగా సేకరించారు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న అప్పటి నియోజకవర్గ కీలక వైకాపా నేత రైతుల నుంచి తక్కువ ధరకు అనుచరులతో భూములు కొనిపించారు. ఎకరా రూ.25-30 లక్షల వరకు రైతులకు చెల్లించి 60 ఎకరాలు కొన్నారు. పట్టణానికి దూరంగా ఉన్నా, ఆ నేతకు లబ్ధి కోసమే ఆ భూమిని ప్రభుత్వంతో ఎకరా రూ.90 లక్షలకు కొనిపించారు. దీంతో 60 ఎకరాలకు రూ.36 కోట్ల లబ్ధిని ఆ నేత పొందారు. తాను సూచించిన రైతుల భూములనే కొనాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మాట నెగ్గించుకున్నారు. ఇందుకు రైతుల నుంచి ఎకరాకు రూ.10-15లక్షల వరకు ఆయా ప్రాంతాలను బట్టి వసూలుచేశారు. ఇలా 450 ఎకరాలకు రూ.45 కోట్లు వెనకేసుకున్నారు. ఒక్క భూసేకరణలోనే రూ.81 కోట్లు ఆయాచితంగా లబ్ధి పొందారు. జిల్లా మొత్తం భూసేకరణ సొమ్ములో సగం తెనాలికే కేటాయించడం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వ భూములు లేకపోవడం, రాజధాని నిర్మాణ సమయంలో ఇక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగడం, వైకాపా వచ్చిన తర్వాత బహిరంగమార్కెట్లో భూముల విలువ తగ్గడం వంటి అంశాలను ఆ నాయకుడు తనకు అనుకూలంగా మార్చుకుని అక్రమార్జనకు తెరలేపారు.
పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో జగనన్న కాలనీ కోసం వంద ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ సమయంలో కొంతమందితో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరాకు రూ.5లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత ఆ డబ్బులను అక్కడి వైకాపా నేతకు అప్పట్లో అప్పగించారు. సుమారు రూ.4 కోట్లకు పైగా లబ్ధి పొందారు.
ఆవభూముల కొనుగోలు వెనుక రూ.150 కోట్ల అవినీతి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడిలో సుమారు 586 ఎకరాలు ఆవ (ముంపు) భూములు ఎకరాకు రూ.45 లక్షల చొప్పున సేకరించారు. వాస్తవానికి వీటి ధర రూ.20 లక్షలకు మించదని స్థానిక రైతులు చెబుతున్నారు. దీంతో వైకాపా నేతలు రూ.150 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారన్న ఆరోపణలున్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని పేదలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింగపురంలో ఒక రైతుకు చెందిన 61 ఎకరాలు సేకరించారు. మార్కెట్ విలువ రూ.50లక్షలు ఉండగా రూ.62లక్షలకు కొన్నా.. ఇప్పటికీ పేదలకు ఇవ్వలేదు. ఇక్కడ రూ.60కోట్ల మేర అవినీతి జరిగింది. గొల్లప్రోలు శివారులో జగనన్న కాలనీకి మార్కెట్ ధర కంటే దాదాపుగా రూ.20 లక్షలు అదనంగా పెట్టి ప్రభుత్వంతో కొనిపించారు. ఇక్కడ రూ.30 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. పిఠాపురం నియోజకవర్గ అప్పటి కీలక వైకాపా నేతనే ఈ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
రైతుల ఫిర్యాదుతో అవినీతి బాగోతం వెలుగులోకి
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలో చక్రం తిప్పిన కీలక మహిళా ప్రజాప్రతినిధి చిలకలూరిపేట నియోజకవర్గంలో పేదల ఇళ్లస్థలాల సేకరణకు రైతుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. అవి ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. పసుమర్రుకు చెందిన రైతులు తమనుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతో రూ.1.16 కోట్లను ఆమె వారికి తిరిగిచ్చారు. తాజాగా గుదేవారిపాలెం రైతుల నుంచి కూడా రూ.కోటి వసూలుచేసినట్లు వెలుగుచూసింది. వారికీ ఆ మొత్తాన్ని రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. -
నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. -
నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్కు ఏం కాదు
‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకుందాం
విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. -
ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. -
ఫోన్పే, గూగుల్పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. -
95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!
కాకినాడలో రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. -
స్తంభించిన దేవాదాయశాఖ వెబ్సైట్
దేవాదాయశాఖకు చెందిన వెబ్సైట్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్లైన్లో ముందే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. -
ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. -
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. -
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. -
పలువురు వీసీల రాజీనామా
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు. -
గుంతలు పూడ్చిన గుత్తేదారులకే రూ.668 కోట్ల బకాయిలు
మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా.. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం