- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: అమ్మ వెంకటరెడ్డీ.. ఇంత మోసమా?
జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసేశారు.
రూ.800 కోట్లు బకాయిపడిన జేపీ సంస్థ
బాకీ లేదంటూ ధ్రువపత్రమిచ్చిన మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి
ఇసుక నోట్ఫైల్లో కనిపించని ఆ పత్రం వివరాలు
కొత్త గుత్తేదార్లు జీసీకేసీ, ప్రతిమ సైతం రూ.220 కోట్ల బాకీ
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసేశారు. ఈ సర్టిఫికెట్కు సంబంధించి దస్త్రంలో ఎక్కడా నోట్ఫైల్ లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. పూర్వపు సంచాలకుడు వెంకటరెడ్డి మొన్నటివరకు ఇలా చేసిన మోసాలు, వైకాపా పెద్దల దోపిడీకి ఎలా సహకరించారనే నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. గత ఐదేళ్లలో ఇసుకలో ఏం జరిగిందనేది వారం రోజులుగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇసుక టెండర్లు, తవ్వకాలు, విక్రయాలు, లావాదేవీల అంశాలన్నీ నిశితంగా అధ్యయనం చేశారు. ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఈ వివరాలు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
బకాయి చెల్లించకపోయినా.. క్లియరెన్స్
జయ్ప్రకాశ్ పవర్ వెంచర్స్ (జేపీ) 2021 మే నుంచి 2023 నవంబరు వరకు ఇసుక గుత్తేదారుగా ఉంది. దాని ఉపగుత్తేదారుగా టర్న్కీ ఎంటర్ప్రైజెస్ వ్యవహరించింది. ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. తొలుత రెండేళ్లకు రూ.1,528 కోట్లు చెల్లించేలా జేపీ సంస్థ టెండరు దక్కించుకుంది. తర్వాత మరో ఆరు నెలలు కొనసాగడంతో మరో రూ.320 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా దాదాపు రూ.1,850 కోట్ల వరకు ప్రభుత్వానికి జేపీ సంస్థ చెల్లించాలి. కానీ రూ.1,059 కోట్లే చెల్లించింది. దీంతో ఇంకా దాదాపు రూ.800 కోట్ల బకాయి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వివరాలన్నీ దాచిపెట్టి.. జేపీ సంస్థ బాకీ లేదంటూ మార్చి 14న గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి నో డ్యూ సర్టిఫికెట్ జారీచేశారు. అలాగే ఉపగుత్తేదారు టర్న్కీ సంస్థ బ్యాంక్ గ్యారంటీగా చూపిన రూ.120 కోట్లు విడుదల చేయాలంటూ మార్చి 23న బ్యాంక్ మేనేజర్కు వెంకటరెడ్డి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంక్ గ్యారంటీ కూడా విడుదలైపోయింది.
నోట్ ఫైల్లో వివరాలేవీ?
ఓ గుత్తేదారు బకాయి మొత్తం చెల్లిస్తే.. దాని వివరాలన్నీ నమోదుచేసి, నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు దస్త్రంలో పేర్కొనాలి. కానీ ఇసుక దస్త్రంలో అలాంటి నోట్ఫైల్ లేదు. కిందిస్థాయి అధికారుల సంతకాలు ఏవీ లేకుండానే.. సంచాలకుడు వెంకటరెడ్డి నేరుగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసినట్లు స్పష్టమవుతోంది. తర్వాత నోట్ఫైల్ కాపీని ఆ దస్త్రంలో జతచేయాలంటూ కిందిస్థాయి అధికారులకు ఇచ్చే ప్రయత్నం చేయగా, వాళ్లు లొసుగులను గుర్తించి, దానిపై సంతకాలు చేయలేదని, నోట్ఫైల్లో చేర్చలేదని తెలుస్తోంది.
జీసీకేసీ, ప్రతిమాదీ ఇదే తీరు
గతేడాది డిసెంబరు నుంచి రాష్ట్రంలో రెండు ప్యాకేజీల్లో ప్రతిమా ఇన్ఫ్రా, ఓ ప్యాకేజీలో జీసీకేసీ సంస్థ ఇసుక టెండరు దక్కించుకొని వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి 15 రోజులకు అడ్వాన్స్గా ఇసుక సొమ్ము చెల్లించాకే విక్రయాలు చేయాలి. కానీ ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటికి రూ.220 కోట్ల వరకు గనులశాఖకు బాకీ ఉన్నాయి. అయినా మొన్నటివరకు గనులశాఖ సంచాలకునిగా ఉన్న వెంకటరెడ్డి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
సీఎం ముందుకు ఇసుక దోపిడీ వివరాలు
గతంలో జేపీ సంస్థ పేరిట, ప్రస్తుతం జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా పేరిట జరిగిన ఇసుక దోపిడీ వివరాలను గనులశాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. ఎలా అడ్డగోలుగా దోచేశారు.. నిబంధనలు ఎలా ఉల్లంఘించారు.. టెండరు నిబంధనలు ఎలా పాటించలేదు.. తదితర వివరాలన్నీ చెబుతారు. వీటిపై సిట్ వేయాలా? సీఐడీ విచారణకు ఆదేశించాలా? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ చేయించాలా? అనేది సీఎం నిర్ణయిస్తారని గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి.
అసలు జేపీ చెల్లించింది రూ.250 కోట్లే
గనులశాఖకు జేపీ సంస్థ రూ.1,059 కోట్లు చెల్లించినట్లు రికార్డుల్లో ఉన్నా.. అందులో ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో జేపీ సంస్థ చెల్లించినది రూ.259 కోట్లేనని అధికారులు గుర్తించారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి జేపీ సంస్థ భారీగా ఇసుక తరలించినట్లు లెక్కలు చూపారు. దీంతో గృహనిర్మాణ సంస్థ రూ.500 కోట్లు గనులశాఖకు చెల్లించింది. అలాగే నాడు-నేడు పనులకు పెద్దఎత్తున ఇసుక సరఫరా చేశామంటూ జేపీ సంస్థ లెక్కలు చూపడంతో వైద్యశాఖ, విద్యాశాఖ కలిపి దాదాపు రూ.300 కోట్ల వరకు గనులశాఖకు చెల్లించాయి. అంటే జేపీ సంస్థ బదులు గృహనిర్మాణ సంస్థ, వైద్య, విద్యాశాఖలు కలిపి రూ.800 కోట్లు గనులశాఖకు రీయింబర్స్ చేశాయి. జేపీ సంస్థ రూ.259 కోట్ల నగదే చెల్లించి చేతులు కడిగేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వైకాపా ముఖ్యనేతలు నిత్యం లక్షల టన్నుల ఇసుక విక్రయించి, కోట్ల రూపాయలు సొమ్ముచేసుకోగా.. ప్రభుత్వానికి మాత్రం జేపీ సంస్థ తరఫున రూ.250 కోట్లే చెల్లించారనేది స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, తర్వాత వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. -
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. -
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. -
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
అమరావతిని బంగారం చేస్తాం
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికే నిర్ణయం
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. -
అందరికీ ఉచిత ఇసుక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా