- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Tadepalli: దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు.
జగన్ ఇంటి ముందు మార్గం మూసేయడంతో ఇబ్బందులు
ఇరుకుదారిలో విల్లా వాసుల అవస్థలు
నాలుగు చెక్పోస్టులు దాటుకుని వెళ్లాల్సిన దుస్థితి
బకింగ్హామ్ కాలువ పక్కన నాలుగు వరుసల రహదారి నుంచి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇంటి ముందుగా విల్లాలోకి వెళ్లే మార్గం మూసివేత
ఈనాడు, అమరావతి: పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. జగన్ అధికార దుర్వినియోగానికి సంబంధించిన విషయాలన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాడేపల్లిలోని తన నివాసం చుట్టూ చేసుకున్న భద్రత ఏర్పాట్లతో పరిసరాల్లో ఉంటున్న ప్రజలకు చుక్కలు చూపించారు. ఆయన ఇంటి పక్కన నాలుగు వరుసల మార్గం మూసేసి, అటుగా సామాన్యులు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. జగన్ నివాసం ఎదురుగా ఉన్న విల్లాలకు వెళ్లే దారి ఆయన ఇంటి మీదుగా వెళ్తుండడంతో దాన్ని మూసేశారు. దీంతో నాలుగు వరుసల రహదారి నుంచి నేరుగా విల్లాల్లోకి వెళ్లేవారు ప్రత్యామ్నాయంగా వెనుకవైపు నుంచి ఇరుకు రహదారిలో రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు సీఎం హోదాలో ఉన్నందున ఇబ్బందులు పడ్డామని, ఇకనైనా మార్గాన్ని తెరవాలని స్థానికులు కోరుతున్నారు.
విల్లాల అంతర్గత రహదారుల్లో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన పోలీసు ఔట్ పోస్టు
ప్లాన్లో మార్గం ఉన్నా ఎదురు చెప్పలేక..
తాడేపల్లిలో జగన్ నివాసం ముందు పార్క్ విల్లాస్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఈ విల్లాలకు బకింగ్హామ్ కాలువ పక్కనే ఉన్న నాలుగు వరుసల రహదారి నుంచి ప్రధానమార్గం ఉంది. మాస్టర్ప్లాన్లోనూ ఇదే మార్గానికి అనుమతించారు. అయితే జగన్ సీఎం అయ్యాక బకింగ్హామ్కాలువ పక్కనే ఉన్న నాలుగు వరుసల రహదారిని మూసేయడంతో పాటు అక్కడి నుంచి విల్లాల్లోకి వచ్చే ప్రధాన మార్గాన్ని మూసేశారు. సీఎం హోదాలో ఉన్నందున అక్కడివారు ప్రశ్నించలేక మిన్నకుండిపోయారు. ప్రత్యామ్నాయంగా జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి ఇరుకుమార్గంలో వెళుతూ, నాలుగు పోలీసు చెక్పోస్టులు దాటుకుని అవస్థలు పడుతున్నారు. మరోవైపు విల్లాల్లో నుంచి జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్డును సగం ఆక్రమించి పోలీసులు టెంటు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా, ఏవైనా పెద్దవాహనాలు వచ్చినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఈ మార్గం నుంచి కొందరు వీఐపీలు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేవారు. దాంతో భద్రత పేరుతో పోలీసు చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. తమకు కనీసం ప్రత్యామ్నాయం చూపాలని విల్లా యజమానులు కోరుతున్నా ఐదేళ్లుగా పట్టించుకోలేదు. బకింగ్హామ్ కాలువ పక్కన ఉన్న రోడ్డునుంచి గోశాల పక్కన ఖాళీ స్థలం మీదుగా దారి ఇవ్వాలని ఓ గేటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఇస్తే ప్రధాన రహదారి నుంచి నేరుగా విల్లావాసులు వెళ్లడానికి వీలవుతుంది. దీనికి సైతం అనుమతి ఇవ్వకుండా గేట్లు మూసేశారు. వైకాపా ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున నిబంధనల మేరకు లేఔట్ మాస్టర్ప్లాన్లో ఉన్న మార్గాన్ని తెరవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే బకింగ్హామ్ కాలువ పక్కన నాలుగు వరుసల రోడ్డు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందున ఆ మార్గం నుంచి విల్లాల్లోకి వెళ్లే మార్గాన్నీ తెరవాలని వారు కోరుతున్నారు. మాస్టర్ప్లాన్ ప్రకారం జగన్ నివాసం ముందునుంచి దారి ఉన్నందున ఇప్పటికైనా నిబంధనలు అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విల్లావాసులు రాకపోకలు సాగిస్తున్న ఇరుకైన రహదారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
-
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!
-
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM