- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: నేడు రామోజీరావు సంస్మరణ సభ
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేసింది.
అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
పాత్రికేయ దిగ్గజాలు ఎన్.రామ్, శేఖర్ గుప్తా తదితరులు
ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేసింది. విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే సభలో అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్, శేఖర్ గుప్తా, గులాబ్ కొఠారి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొననున్నారు. పత్రికా రంగంతోపాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు.. అంచెలంచెలుగా ఎదిగారు. ‘ఈనాడు’తోపాటు ‘ఈటీవీ’ ప్రసారాలతో మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల వెన్నంటి నిలిచారు. ‘మార్గదర్శి’తో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అందించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్మరణ సభకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. బుధవారం సాయంత్రానికి సభ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక, దాదాపు పది వేల మంది వరకు కూర్చునేలా మూడు భారీ గుడారాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించింది. సభలో ఉన్న ఏ1 గ్యాలరీలో రామోజీరావు సమీప బంధువులు, మంత్రులు, వీవీఐపీలు, ప్రముఖులు ఉంటారు. ఎం1 గ్యాలరీలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు ఉంటారు. బీ1 గ్యాలరీని ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ప్రతినిధులు, జాతీయ మీడియా ప్రతినిధులు, సినిమా రంగం, ఇతర మీడియా ప్రముఖులకు కేటాయించారు.
విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ ఫ్లెక్సీ
పాల్గొననున్న ప్రముఖులు
సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్.రామ్, రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి, ది ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, జయసుధ, నిర్మాత, నటుడు మురళీమోహన్, దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్.ఎస్.రాజమౌళి, బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు అశ్వనీదత్, సురేష్బాబు, శ్యాంప్రసాదరెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. సంస్మరణ సభ సందర్భంగా రామోజీరావు జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు.
వేదికపై తెరలు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
సభాప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అధికారులు తదితరులు
సిద్ధమైన సభా వేదిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా వైకాపా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేతగా నిలిచిన భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?