- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు
అసాధారణ వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి, ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకూ అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, విలువలకు నిలువెత్తు శిఖరం... రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆయన పుట్టినగడ్డ ఘన నివాళులర్పించింది.
మహామనీషికి ఘనంగా నివాళులు
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన దిగ్గజాలు
రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగం
ఈనాడు, అమరావతి: అసాధారణ వ్యక్తిత్వం, అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి, ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకూ అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, విలువలకు నిలువెత్తు శిఖరం... రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆయన పుట్టినగడ్డ ఘన నివాళులర్పించింది. ఆయన గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో గురువారం అత్యంత ఘనంగా సంస్మరణ సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో... రాజకీయ, మీడియా, సినిమా, వ్యాపార రంగాల నుంచి అతిరథ మహారథులు పాల్గొన్నారు. రామోజీరావు కుమారుడు, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్.కిరణ్ సహా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా పెదపారుపూడితో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచీ సన్నిహితులు, బంధువులు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చారు. శిఖర సమానులైన రామోజీ వ్యక్తిత్వాన్ని, ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో కొనసాగాలన్న ఆయన పట్టుదలను, సమున్నత వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అహరహం ఆయన పడిన తపనను ఆహూతులు కొనియాడారు. ఆయనతో తమకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, వృత్తిగతమైన అనుభవాల్ని నెమరువేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు, ఎన్టీఆర్ ఇద్దరూ ఇద్దరేనని... వారు సాధించిన అసాధారణ విజయాల్ని చేరుకోవడం ఎవరి వల్లా కాదని చంద్రబాబు కొనియాడారు. ‘‘ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైనప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి ప్రజల తరఫున ముందుండి పోరాడిన వ్యక్తి రామోజీరావు’’ అని ఆయన పేర్కొన్నారు. రాజధానికి ‘అమరావతి’ పేరు సూచించింది ఆయనేనని గుర్తుచేశారు.
రామోజీ సంస్మరణ సభలో మౌనం పాటిస్తున్న సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ‘ఈనాడు’ ఎండీ కిరణ్
రాజధానిలో ‘రామోజీ విజ్ఞాన కేంద్రం’
వివిధ రంగాల్లో రామోజీరావు చేసిన విశేషకృషికి గాను ఆయనను ‘భారతరత్న’తో గౌరవించడం సముచితంగా ఉంటుందని రాజమౌళి తదితరులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్, రామోజీరావులకు ‘భారతరత్న’ సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతిని అద్భుత నగరంగా నిర్మించాలని రామోజీరావు ఆకాంక్షించారని, ఆయన స్మృతికి నివాళిగా దిల్లీలోని విజ్ఞాన్భవన్ తరహాలో అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రాజధానిలోని ఒక రహదారికి ‘రామోజీ మార్గం’గా పేరు పెడతామని చెప్పారు. సినిమా రంగానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను విశాఖలో ఏర్పాటు చేసే చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతామని వెల్లడించారు. రామోజీరావు సంస్మరణ సభను ఇంత ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఈనాడు’ ఎండీ సీహెచ్.కిరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన నమ్మిన, పాటించిన విలువల్ని తామంతా త్రికరణ శుద్ధితో కొనసాగిస్తామని తెలిపారు. అమరావతిని ఐకానిక్ నగరంగా నిర్మించాలని రామోజీరావు బలంగా ఆకాంక్షించేవారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి తమ కుటుంబం తరఫున రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆ మొత్తానికి చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లకు అందజేశారు.
సభలో నిలబడి రామోజీరావుకు నివాళులర్పిస్తున్న ప్రముఖులు, ప్రజలు
హాజరైన అతిరథ మహారథులు
విజయవాడ కానూరులోని అనుమోలు గార్డెన్స్లో జరిగిన రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ఏర్పాట్లు చేసింది. ఐదుగురు మంత్రుల కమిటీ.. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 6.35 వరకు సభ జరిగింది. భారీ వేదికపై రామోజీ చిత్రపటాన్ని ఉంచారు. సభకు హాజరైన ప్రముఖులంతా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలు, సాధించిన విజయాల్ని తెలియజెప్పే వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు. ఆయన మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్, రాజస్థాన్ పత్రిక సంపాదకుడు గులాబ్ కొఠారి హాజరయ్యారు. మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ పాల్గొన్నారు. రామోజీరావు కోడళ్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, మనుమరాళ్లు సహరి, ఆమె భర్త రేచస్ వీరేంద్రదేవ్, బృహతి, ఆమె భర్త వెంకట్ అక్షయ్, సోహన, ఆమె భర్త వినయ్, దివిజ, మనవడు సుజయ్, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల, ప్రముఖ వ్యాపారవేత్త బొల్లినేని కృష్ణయ్య, భాజపా నాయకుడు, ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు, పలువురు తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు కంభంపాటి రామ్మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, మురళీమోహన్, ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్, సురేష్బాబు, శ్యామ్ప్రసాద్రెడ్డి, కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి, జయసుధ, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి, ఎన్నారై తెదేపా మీడియా సమన్వయకర్త సాగర్ దొడ్డపనేని సహా పలువురు ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో సమాచార, పౌరసంబంధాల శాఖ ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తదితర ప్రముఖులు ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడ ఉంచిన రామోజీరావు భారీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు... సభ ముగిశాక కూడా ఛాయాచిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.
నివాళులర్పిస్తున్న మంత్రులు లోకేశ్, అనిత
ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచారు: లోకేశ్
ఎమర్జెన్సీని ప్రకటించిన 1975 నుంచి నిన్నటి జగన్ పాలన వరకు.. పాలకులు ప్రజల హక్కుల్ని కాలరాసినప్పుడు రామోజీరావు ధైర్యంగా ఎదురుతిరిగారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే క్రమంలో వ్యక్తిగతంగా ఎంత నష్టం వాటిల్లినా లెక్క చేయలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం మార్గదర్శి మీద ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు చేసింది. ప్రజల సొమ్ముకు గ్యారెంటీ లేదని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. అయినా ఒక్క ఖాతాదారూ మార్గదర్శిని అనుమానించలేదు. ఈటీవీలో ఒక వార్త వచ్చిందంటే అది నిజమేనని జనం నమ్ముతారు. ఇవన్నీ ఆయన విశ్వసనీయతకు నిదర్శనం. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి రామోజీరావు జీవితాన్ని మించిన పాఠ్యాంశం దొరకదు. తెలుగువారికి రామోజీరావు పెద్దదిక్కు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం