- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Amravati: మూడు మార్గాలూ డబుల్ లైన్లతోనే అమరావతికి న్యాయం
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్ లైన్తో ఒరిగేదేంటి?
ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్ సిద్ధం
మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలి
సీఎం చంద్రబాబు జోక్యంతోనే.. ఇదంతా సాధ్యం
ఈనాడు, అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్ లైన్తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టు అసలు స్వరూపమిది..
అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
- ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్ లైన్, అమరావతి-పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ. సింగిల్ లైన్, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కి.మీ. సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కి.మీ. మేర కొత్త లైన్కు ఆమోదం తెలిపారు.
- దీనికి రూ.3,272 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్ తయారుచేసి 2017 నవంబరు 13న రైల్వేబోర్డుకు అందజేశారు.
- వీటికి 687 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంటుందని తేల్చారు.
- మూడు లైన్లలో కలిపి మొత్తం 200 వంతెనలు నిర్మించాలని నివేదికలో పేర్కొన్నారు.
- వీటన్నింటికీ మట్టి పరీక్షలు సైతం అప్పట్లోనే పూర్తిచేశారు.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్లో ఇది డబుల్ లైన్ ఉండగా, సింగిల్ లైన్కే పరిమితం అవుతున్నారు.
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..
రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్ స్టేషన్కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.
106 కి.మీ. డబుల్ లైన్ నిర్మిస్తేనే..
రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్లైన్కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి
మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్లైన్కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.
మూడు లైన్లతో మేలు జరిగేదిలా..
1 ఎర్రుపాలెం-నంబూరు లైన్తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
2 అమరావతికి దగ్గరి మార్గం.
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్ లైన్ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
3 సీమ నుంచి నేరుగా రాజధానికి..
రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్ లైన్లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్-గుంటూరు పాతలైన్లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరావతిలో పెట్టుబడులు పెట్టండి.. కర్ణాటక వ్యాపారవేత్తలకు చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. -
ఏపీలో ఇచ్చిన 20.19 లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫొటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. -
వైజాగ్ స్టీల్ను సెయిల్లో విలీనం చేయండి: కేంద్రమంత్రికి ఏపీ భాజపా ఎంపీల వినతి
విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు. -
హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయండి: ఏపీ ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు ఆదేశం
హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. -
విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి అవార్డు
విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అవార్డు లభించింది. -
కాలినడకన తిరుమలకు రాజధాని రైతులు
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు బృందాలుగా తిరుమలకు చేరుకుంటున్నారు. -
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలో సీఐ దురుసు ప్రవర్తన
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు. -
పిన్నెల్లి అరెస్టు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. -
రాజకీయ ప్రేరేపిత రౌడీషీట్లు ఎత్తేయండి
వైకాపా ఐదేళ్ల పాలనలో తెదేపా నేతలపై ఇష్టారాజ్యంగా పెట్టిన రౌడీషీట్లను ఎత్తేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
నేడు రామోజీరావు సంస్మరణ సభ
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేసింది. -
ఇన్నాళ్లకు పాపం పండింది
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్నూమిన్నూ కానకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం ఎట్టకేలకు పండింది. -
డ్రగ్స్, గంజాయి రక్కసి కోరలు పీకాల్సిందే
జగన్ జమానాలో మాదక ద్రవ్యాలకు, గంజాయికి కేంద్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. -
నేటి వరకు యథాతథ స్థితి పాటించండి
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ తొమ్మిది జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. -
ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పింఛన్లను జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
రీ సర్వేపై రైతుల నుంచి అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయ్?
భూముల రీ సర్వే నిర్వహణ తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. -
గనులశాఖలో అన్నీ ఆన్లైన్ పర్మిట్లే
గనులశాఖలో ప్రక్షాళన మొదలైంది. గత ఐదేళ్లూ ఆన్లైన్ బిల్లు లేకుండా గుత్తేదారులు చేతిరాతతో రాసిచ్చి భారీగా అక్రమాలు చేయగా.. ఈ విధానానికి చెక్పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. -
జల సంరక్షణ పనుల్లో రూ.427 కోట్ల బకాయిలు
జగన్ ప్రభుత్వం చిన్ననీటి వనరులను నిర్లక్ష్యం చేసింది. అంతకుముందు తెదేపా ప్రభుత్వంలో ‘నీరు-చెటు’్ట పేరుతో జలసంరక్షణ పనులు చేసినా ఆ బిల్లులూ చెల్లించకుండా రైతు సంఘాలను, గుత్తేదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. -
హైకోర్టులో ప్రత్యేక పన్నుల బెంచ్ ఏర్పాటుకు కృషి చేయాలి
పన్ను ఎగవేతదారులను నియంత్రించి, సక్రమంగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించాలని వాణిజ్య పన్నుల అధికారులకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. -
సంక్షిప్తవార్తలు(11)
వైఎస్సార్ రైతు భరోసా వెబ్సైట్ను ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో మార్పు చేశామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
గంజాయిని సమూలంగా నిర్మూలిస్తాం
హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి, ఇతర డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించడానికే పని చేస్తున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. -
ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించొద్దు
ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
శాం పిట్రోడాకు బాధ్యతలు.. మోదీజీ ఆనాడే చెప్పారు: కిరణ్ రిజిజు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విరాట్ - రోహిత్లకు ముప్పు పొంచి ఉందిలా..!
-
అందరి దృష్టీ రెండో సెమీఫైనల్పైనే .. వాతావరణం లేటెస్ట్ అప్డేట్
-
ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు: సీఎం రేవంత్రెడ్డి
-
ఇండియా సిమెంట్స్లో అల్ట్రాటెక్కు 23% వాటా.. ఒప్పంద విలువ ₹1,885 కోట్లు