- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు..
వైకాపా విధ్వంసం ఘటనలో ఎట్టకేలకు దర్యాప్తు మొదలు
ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ కేసు దర్యాప్తును మళ్లీ మొదలుపెట్టారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. నాటి దాడి ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తుల చిత్రాలను సేకరించారు. కొంతమంది ఎవరనేది గుర్తించారు. మరికొంతమంది వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కార్యాలయ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. వారి సెల్ఫోన్లలో అప్పట్లో రికార్డు చేసిన దృశ్యాల్ని కూడా తీసుకున్నారు. అప్పట్లో తేలికపాటి సెక్షన్ల కింద ఒకే ఒక్క కేసు నమోదు చేశారు. ఆ వివరాలన్నింటినీ తాజాగా మంగళగిరి గ్రామీణ పోలీసులు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ ప్రక్రియంతా కొనసాగించారు.
ఒక్క నిందితుడినీ గుర్తించలేదు... అరెస్టుల ఊసే లేదు
2021 అక్టోబరు 19న తెదేపా కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైకాపా రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి. తెదేపా నాయకుడు దొరబాబుతో పాటు ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. ఒక్క నిందితుడ్నీ గుర్తించలేదు. అరెస్టుల ఊసే ఎత్తలేదు. కొందరికి 41ఏ నోటీసులిచ్చి మమ అనిపించేశారు. వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారులోనే దాడి చేయడానికి వచ్చారని, విధ్వంసానికి పాల్పడ్డవారిలో అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు పానుగుంట చైతన్య, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అనుచరులు ఉన్నారంటూ.. వారి చిత్రాలను తెదేపా విడుదల చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కేసును పూర్తిగా నీరుగార్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, తర్వాత వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. -
ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం
మెగా డీఎస్సీ వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. -
టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం పెంపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), మెగా డీఎస్సీ సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి, -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
పట్టిసీమ.. అన్నదాతల కొంగు బంగారం
‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది. -
ఎత్తిపోతల్లో ఎగసిన గోదారి!
నైరుతి పలకరించి నెల రోజులు గడిచినా కృష్ణాలో ప్రవాహాల్లేవు. గోదావరిలో మాత్రమే కాస్త వరద పారుతోంది. ఈ నీటి పాయలను బీళ్ల వైపు మళ్లించాలని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. -
కలరా కలకలం..
గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. కలరా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. -
అన్నవరం వేదపాఠశాల విద్యార్థులకు అతిసారం
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు బుధవారం అతిసారం బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఎనిమిది మందికి దేవస్థానం సిబ్బంది వైద్యసేవలు అందించారు. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
ఈ నెల 27వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
క్లబ్ హౌస్ యజమానికి అధికారుల దాసోహం
పులివెందులలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో కడప ఎంపీ అవివాష్రెడ్డి బావ, క్లబ్హౌస్ యజమాని విజయశేఖర్రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అడ్డదారులు తొక్కారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు.