- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
మాజీ ఉప రాష్ట్రపతిపై మూడు పుస్తకాల ఆవిష్కరణ
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి: వెంకయ్య
‘వెంకయ్యనాయుడు.. ఏ లైఫ్ ఇన్ సర్వీస్’ పుస్తకాన్ని వర్చువల్గా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ
ఈనాడు, హైదరాబాద్: దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్యనాయుడని, ఆయన జీవితం తనతోపాటు లక్షల మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ‘భారతమాతకు జై’ అనే సంకల్పంతో భాజపా మహా వటవృక్షంగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు. జులై 1వ తేదీ వెంకయ్యనాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబసభ్యులు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ప్రధానమంత్రి దిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు జీవితానికి సంబంధించిన మూడు పుస్తకాలు ‘వెంకయ్యనాయుడు.. ఏ లైఫ్ ఇన్ సర్వీస్’ (జీవన ప్రస్థానం), ‘సెలబ్రేటింగ్ భారత్’ (13వ ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల ప్రయాణం), ‘మహానేత’ (జీవన చిత్ర మాలిక)లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు దంపతులు, తెలంగాణ, మిజోరం గవర్నర్లు సీపీ రాధాకృష్ణన్, కంభంపాటి హరిబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, తెలంగాణ, ఏపీ హైకోర్టుల న్యాయమూర్తులు జస్టిస్ రామకృష్ణప్రసాద్, జస్టిస్ హరినాథ్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సత్యకుమార్, జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు, మాజీ ఎంపీలు మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్రావు, సి.రామచంద్రయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ.. ‘వెంకయ్య జీవితానికి సంబంధించిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి. దేశసేవలో సరైన మార్గాన్ని నిర్దేశిస్తాయి. సుదీర్ఘకాలం వెంకయ్యనాయుడితో కలసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో భాజపా ఇంత మంచి స్థాయిలో ఉందంటే వెంకయ్యనాయుడు లాంటివారే కారణం. 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఆయన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి, 17 నెలలు జైల్లో ఉన్నారు. వాజ్పేయి మంత్రివర్గంలో వెంకయ్య ఏ శాఖ కోరుకున్నా దక్కేది. కానీ పేదలు, రైతులు, గ్రామీణ ప్రాంతాలకు సేవచేయాలనే సంకల్పంతో గ్రామీణాభివృద్ధిశాఖ కావాలని ఎంచుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. 2014లో మా మంత్రివర్గంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా.. స్మార్ట్సిటీ మిషన్, అమృత్ మిషన్ వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికారు. ఆయన వాక్చాతుర్యం, చతురత అద్భుతం. వెంకయ్యనాయుడి మాటల్లో గంభీరత, దార్శనికత ఉంటాయి. మేం ఆర్టికల్ 370 రద్దు బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అక్కడ మాకు మెజారిటీ లేకపోయినా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టి బిల్లు నెగ్గేలా చేయగలగడం వెంకయ్యనాయుడికే సాధ్యమైంది. మకర సంక్రాంతి లేదా తెలుగు పండుగల సందర్భంగా దిల్లీలో ఆయన ఇచ్చే ఆతిథ్యం కోసం అంతా ఎదురుచూసేవాళ్లం. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనుంది. వెంకయ్యనాయుడు కూడా తమ జీవన శతాబ్ది వేడుకలు జరుపుకోవాలి’ అంటూ ప్రధాని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు
భారతీయ భాషలకు ప్రాధాన్యమివ్వాలి: వెంకయ్యనాయుడు
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ అద్భుతంగా సేవలు అందిస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో రెండో అత్యున్నత పదవి నుంచి విరమణ చేసిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలను తొలగించి.. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. అవసరమైనంత కాలం ఉచిత బియ్యంతో పేదలకు ప్రభుత్వం అండగా నిలవొచ్చని.. కానీ ఉచితాలను అలవాటు చేయడం సరికాదన్నారు. భారతీయ భాషలను ప్రోత్సహించడం మంచి పరిణామమన్నారు. పార్లమెంట్, విద్యావ్యవస్థలు, న్యాయస్థానాల్లో కూడా వ్యవహారాలన్నీ భారతీయ భాషల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. మొదట మాతృభాష, తర్వాత సోదరభాష, తర్వాతే ఏ ఇతర భాష అయినా అని అన్నారు. రాజకీయ పార్టీలంటే గౌరవం తగ్గిపోతోందని, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. పార్టీ మారినప్పుడు అనివార్యంగా రాజీనామా చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టంలో లొసుగులున్నాయని, పదో షెడ్యూలును సవరించాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. -
నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. -
నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్కు ఏం కాదు
‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకుందాం
విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. -
ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. -
ఫోన్పే, గూగుల్పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. -
95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!
కాకినాడలో రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. -
స్తంభించిన దేవాదాయశాఖ వెబ్సైట్
దేవాదాయశాఖకు చెందిన వెబ్సైట్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్లైన్లో ముందే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. -
ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. -
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. -
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. -
పలువురు వీసీల రాజీనామా
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు. -
గుంతలు పూడ్చిన గుత్తేదారులకే రూ.668 కోట్ల బకాయిలు
మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా.. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు.
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
-
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!