- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: మా ఊరికి పెద్ద దిక్కు రామోజీరావు
‘మా పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఆయన సొంతూరి గురించి ఎంతో ఆలోచించేవారు.
ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం
గ్రామానికి ఆయన చేసిన మేలు మరచిపోలేం
సంస్మరణసభ వద్ద పెదపారుపూడివాసుల ఆవేదన
సభా వేదిక ముందు అక్షర శిఖరం రామోజీ అంటూ ముగ్గుతో వేసిన చిత్రం
ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మా పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు. ఆయన లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఆయన సొంతూరి గురించి ఎంతో ఆలోచించేవారు. మేం తరచూ ఆయనను కలిసేవాళ్లం. ఎప్పుడు కలిసినా ఊరిలో సౌకర్యాల గురించి, రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించే అడిగేవారు. ఆయన మా ఊరిలో జన్మించడం మా అదృష్టం. పెదపారుపూడిలో ఎన్నో సమస్యలను ఆయనే పరిష్కరించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం నుంచి రహదారుల వరకూ అన్నీ ఆయన సొంత డబ్బులతో చేపట్టారు. చుట్టుపక్కల ఉండే గ్రామాలతో పోలిస్తే.. మా ఊరు అధునాతనంగా కనిపించడానికి రామోజీరావే కారణం. ఊళ్లో పాఠశాలలు, రైతు కేంద్రాలు, సిమెంట్ రహదారులు సహా వేటిని చూసినా ఆయనే గుర్తొస్తారు. అలాంటి మహానుభావుడు ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నాం’ అని కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కానూరులో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొనేందుకు పెదపారుపూడి నుంచి ఆ ఊరివాళ్లంతా ప్రత్యేకంగా మూడు బస్సుల్లో తరలివచ్చారు. రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధం, తమ ఊరికి జరిగిన మేలును గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
రామోజీ సేవలు చిరస్మరణీయం..
పెదపారుపూడి గ్రామంతో రామోజీరావుది విడదీయలేని బంధం. గ్రామంలో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మంచినీటి పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్లు, రైతు భరోసా కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులను ఆయనే చేపట్టారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. రామోజీరావు మా ఊరికి చేసిన మేలును మేం ఎప్పటికీ మరచిపోం. ఆయన ప్రస్తుతం మన మధ్య లేరనే వాస్తవాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం.
చప్పిడి సమీర, సర్పంచి, పెదపారుపూడి
ఆ ఊరిలో పుట్టడం మా అదృష్టం
రామోజీరావు జన్మించిన గ్రామంలో మేం పుట్టడం మా అదృష్టం. దేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరు. హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీని కట్టించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గ్రామాన్ని మరచిపోకుండా.. మాకు అవసరమైన తాగునీరు, పాఠశాల, రోడ్లు వంటివి ఎన్నో సౌకర్యాలను కల్పించారు. ఆయన మరణం మా ఊరికి తీరని లోటు, బాధాకరం.
కె.పూర్ణచంద్రరావు
గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు
మా ఊరిని దత్తత తీసుకుని.. రూ.కోట్లు ఖర్చు చేశారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. గ్రామంలో సామాన్యుడు జీవించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొన్నాళ్లు ఉంటే.. ఫిలిం సిటీ మాదిరిగా గ్రామాన్ని తీర్చిదిద్దుతారని అనుకున్నాం. ఆయన దూరం కావడం చాలా బాధాకరం.
శివరామకృష్ణ ప్రసాద్
ఆయనను మరిచిపోలేకపోతున్నాం..
తాను పుట్టిపెరిగిన ఊరిని మరచిపోకుండా దత్తత తీసుకుని మరీ అభివృద్ధి చేయడం అనేది అందరూ చేయలేరు. ఊరిలో ఏమేం సమస్యలున్నాయో తెలుసుకుని, అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించడం మామూలు విషయం కాదు. అధిక దిగుబడి వచ్చే పంటలను వేయమని రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఆయన సంస్మరణ సభ జరుగుతోందని తెలిసి ఊరంతా తరలివచ్చాం. ఆయన కుటుంబానికి మా గ్రామస్థులమంతా జీవితాంతం రుణపడి ఉంటాం.
జి.మహదేవరావు
మా పిల్లలందరికీ ఆయనే స్ఫూర్తి
మా నాన్నకు.. రామోజీరావు మంచి మిత్రులు. గ్రామంలో చాలామందికి ఆయన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన స్ఫూర్తితోనే మా పిల్లలను క్రమశిక్షణతో పెంచి ఉన్నత స్థితిలో ఉంచగలిగాం. ఆయన మా ఊరికే కాదు.. ఈ దేశానికే ఆదర్శప్రాయులు. మా గ్రామానికి రామోజీరావు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దశాబ్దాలుగా మేం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన పరిష్కరించారు.
టి.వెంకటాచారి
ఎంతఎదిగినా సొంతూరిని మరచిపోలేదు
ఉన్నత శిఖరాలకు ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో రామోజీరావును చూసి నేర్చుకోవాలి. తన పట్టుదల, కృషితో ఉన్నతస్థానానికి చేరినా.. సొంత ఊరిని మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఊరిని బాగు చేయించారు, భవనాలు కట్టించారు. చాలామందికి ఉద్యోగాలు కల్పించారు. గ్రామంలో తరచూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించేవారు. ఉచితంగా మందులు పంపిణీ చేసేవారు.
బి.గణేశ్బాబు
ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు
గ్రామంలో ప్రతి ఇంటికీ ఆయనే పెద్దకుమారుడిలా మారి.. సమస్యలను తీర్చారు. ఎంతోమందికి ఈనాడు, మార్గదర్శి, ఫిలింసిటీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంటింటికీ తాగునీటి కుళాయిలు పెట్టించారు. ఊరిలో ఎన్నో ప్రభుత్వ భవనాలను కట్టించారు. చిన్నతనంలో తాను చదివిన పాఠశాలను రామోజీరావు ఇప్పుడు ఎంతో అధునాతనంగా తీర్చిదిద్దారు.
జోసఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్
-
ఆరోజు భయపడ్డాం.. ఈరోజు సాధించాం: వైరలవుతోన్న నాగ్ అశ్విన్ పోస్ట్..
-
దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
-
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
-
క్రెడిట్ కార్డే కాదు.. కరెంట్ బిల్లు చెల్లింపులూ ఆ యాప్స్లో కుదరవ్..!
-
జులైలో అలరించనున్న చిత్రాలివే.. సీక్వెల్తో కమల్.. యాక్షన్తో ధనుష్