- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: చేసిన పాపం కాల్చేస్తే పోతుందని!?
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైకాపా పాలన అక్రమాల ఆధారాల్ని మాయం చేసేందుకే పీసీబీ పత్రాల దహనం!
అన్ని వేళ్లూ నాటి మంత్రి పెద్దిరెడ్డి, పీసీబీ ఛైర్మన్ సమీర్శర్మ, ఓఎస్డీ రామారావు వైపే
రాత్రి వేళ తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు
దస్త్రాలు తరలించిన ఇన్నోవా కారు
ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్ అమరావతి, మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్టుడే: కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబంధించిన కీలక పత్రాల దహనం అనేక సందేహాలకు తావిస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పీసీబీ కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమాలకు ఆధారాలు లభించకుండా చేసేందుకు పత్రాల్ని, దస్త్రాల్ని తగలబెట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ నాటి అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటీవలి వరకూ పీసీబీ ఛైర్మన్గా పనిచేసిన సమీర్ శర్మ, ఆయన ఓఎస్డీ రామారావు వైపే చూపిస్తున్నాయి. పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన కీలక పత్రాలు బస్తాల కొద్దీ బయటకు ఎలా వచ్చాయి? ఎవరి ఆదేశాల మేరకు వాటిని బయటకు తీసుకొచ్చారు? రాత్రి 10 గంటల తర్వాత, ఊరు చివర కృష్ణా నది కరకట్టపై ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే ఎందుకు పారిపోయారు? తదితర ప్రశ్నలు అనేక అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. జగన్ జమానాలో ఇసుక, మైనింగ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పటి అటవీ, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు సహా ఇతర అంశాల్లో పీసీబీ అధికారులు కొందరు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపా హయాంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల యాజమాన్యంలో ఉన్న పరిశ్రమలపై కక్ష కట్టి వేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆధారాలు ధ్వంసం చేసేందుకే పత్రాల్ని తగలబెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమీర్ శర్మకు తెలియదా?
గత ప్రభుత్వ హయాంలో సమీర్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ చేసిన వెంటనే.. జగన్... ఆయన్ను పీసీబీ ఛైర్మన్గా నియమించారు. సుదీర్ఘకాలం పాటు ఐఏఎస్ అధికారిగా, రాష్ట్రానికి సీఎస్గా పనిచేసి, ఇన్నాళ్లూ కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతల్లో కొనసాగిన సమీర్ శర్మకు దస్త్రాల్ని, పత్రాల్ని కాల్చకూడదని తెలియదా? ఆ పత్రాలు నిరుపయోగమైనవైతే నిబంధనల ప్రకారం కటింగ్ మిషన్లో పెట్టి చిత్తుగా మార్చాలి.
సుదీర్ఘకాలం పాటు ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహించి 2021 జూన్లో రామారావు పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా చేరారు. ఎక్సైజ్ శాఖలో పనిచేసినప్పుడు బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అనేక ఇతర అంశాలకు సంబంధించి రామారావుపై ఫిర్యాదులున్నాయి. ఆయన అత్యంత వివాదాస్పదుడు. ఈ పత్రాల దహనంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు బయటపడింది.
దస్త్రాలు దహనమైన చోట ఆధారాలు సేకరిస్తున్న పెనమలూరు సీఐ రామారావు
106 సెక్షన్ కింద...
దస్త్రాల దహనంపై పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు, డ్రైవర్ నాగరాజు, అటెండర్ రూపేంద్రలను స్టేషన్కు పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. దస్త్రాల్ని తీసుకొచ్చిన వాహనాన్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీసీబీ అధికారుల వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముందుకు వెళ్లనుంది.
సమీర్శర్మే తగలబెట్టించారు
- మాజీ మంత్రి కేఎస్ జవహర్
పీసీబీ దస్త్రాల్ని తన డ్రైవర్ నాగరాజు ద్వారా అప్పటి ఛైర్మన్ సమీర్శర్మ తగలబెట్టించారని తెదేపా నేత, మాజీమంత్రి కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన దస్త్రాల్ని కాల్చేసినంత మాత్రాన వైకాపా నేతలు, వారితో అంటకాగిన అధికారులు చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఇప్పటికైనా పీసీబీ మాజీ ఛైర్మన్ సమీర్శర్మ, వాసుదేవరెడ్డి లాంటి వారు అప్రూవర్లుగా మారి... జే గ్యాంగ్తో కలిసి చేసిన అరాచకాల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
వెంటనే నివేదిక ఇవ్వండి: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
దస్త్రాల దహనంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీసీబీలో దస్త్రాలు, రికార్డులు, వాటి నిర్వహణ, భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధివిధానాలపై వెంటనే నివేదిక ఇవ్వండి. జోనల్, రీజనల్ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణపై దృష్టిపెట్టండి. వాటి భద్రతపై తనిఖీ చేయండి’ అని అధికారులను ఆదేశించారు.
పూర్తిస్థాయి విచారణ చేయిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
దస్త్రాల దహనంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. మచిలీపట్నంలో గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా హయాంలో అవినీతి, అక్రమాలతో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి ప్రజాధనం దోచుకున్నారని, ఆ పాపాల్ని కనిపించనీయకుండా చేసేందుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రాథమిక సమాచారం మేరకు... దస్త్రాల్ని మాయంచేసే కుట్రలో కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. లోతైన దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు
ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు. -
మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఓఆర్ఆర్తో ‘అభివృద్ధి పరుగులు’
అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. -
రేపటి నుంచి ఉచిత ఇసుక
రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. -
విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!
దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. -
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. -
8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..