- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP news: ఏపీలో ఇచ్చిన 20.19 లక్షల పాస్ పుస్తకాలు వెనక్కి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫొటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు.
రాజముద్రతో మళ్లీ పంపిణీ
పాత పద్ధతిలోనే డిజైన్
అధికారులతో చర్చించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫొటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందచేసినట్లు ‘జగనన్న భూ హక్కుపత్రం’ పేరుతో పట్టాదారు పుస్తకాన్ని రూపొందించి అందజేశారు. జగన్ ఫొటోతో పాస్పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్దార్థ జైన్తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 20.19 లక్షల భూహక్కు పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారు. సుమారు లక్ష వరకు భూహక్కు పత్రాలను పంచాల్సి ఉంది. వీటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతోపాటు కొత్తవి ఎలా ముద్రించాలి? ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
గతంలో ఎన్నడూ పాస్పుస్తకాలపై సీఎం ఫొటోలేదు
పట్టాదారు పుస్తకాలను దశాబ్దాలుగా పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎన్నడూ వాటి ఆధారంగా ప్రచారం జరగలేదు. భూ యజమాని పేరు, స్థల వివరాలతో ఉండాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని జగనన్న ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. పాస్పుస్తకంపై యజమాని ఫొటో కంటే..జగన్ ఫొటోలు పెద్ద సైజులో ముద్రించారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు దాదాపు పాత పద్ధతిలో ఉన్నట్లుగానే ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొత్త పుస్తకాల తయారీపై దృష్టిపెట్టారు. నాలుగైదు నమూనాలను తయారుచేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించి ఆమోదం తీసుకోనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో జగనన్న పేరుతో 74.65 లక్షల రాళ్లను పొలాల వద్ద పాతారు. కొన్నిచోట్ల సర్వే రాళ్లు అలాగే పడి ఉన్నాయి. వాటిని పాతవద్దని చెబుతున్నారు. అలాగే నాలుగైదు సైజుల్లో రాళ్లను తయారు చేయించి వాటిని సీఎంకు చూపించి ఆమోదం పొందనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే
‘‘జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైంది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ పనులు ఏవీ చేయలేదు. -
భోగాపురంలో భూబకాసురులు
వైకాపా ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం అనేది ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగే కొంతమంది అధికారులు హక్కుగా భావించిన పరిస్థితి. -
ఇంటింటా నైపుణ్య గణన
జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. -
నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా!
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఐజీగా కొనసాగుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటెయినర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, లేదంటే ప్రాణాలిచ్చేందుకూ వెనుకాడమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
కృష్ణపట్టిలో పెద్దపులి
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
వైకాపా వీర విధేయ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా
వైకాపాతో అంటకాగి, ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. -
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా
‘‘కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేశారు. ప్రభుత్వం రూ.39కి కిలో బియ్యం అందిస్తుంటే.. పేదల వద్ద రూ.7కి కొనుగోలు చేశారు. -
ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించిన భువనేశ్వరి
నిరుపేద చిన్నారులకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని వారిని అక్కున చేర్చుకున్న అమ్మ ఒడి..అదే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. -
14 అడుగుల గిరినాగు పట్టివేత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో 14 అడుగుల గిరినాగు (కింగ్ కోబ్రా) హల్చల్ చేసింది. అందరూ చూస్తుండగానే ఎస్సీ కాలనీలోని ఓ గుడిసెలోకి చొరబడింది. -
వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్పై వైకాపా పడగ
వైజాగ్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్)పై వైకాపా స్వారీ చేస్తోంది. కల్చరల్ సెంటర్కు సాధారణంగా ఒకటే కమిటీ ఉంటుంది. -
దారి కొట్టుకుపోయింది.. అవస్థలు మిగిలాయి..!
పక్కా రోడ్డు కోసం గిరిజనులు ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వం కనికరించి పనులు మొదలుపెట్టి.. మధ్యలోనే వదిలేసింది. ఇంకేం.. చేసిన కాస్త పనులూ వర్షాలకు కొట్టుకుపోయాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
గత సర్కారు నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వంపై చక్కదిద్దే భారం
గత ప్రభుత్వం పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన మౌలికసదుపాయాల పనులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. -
అరాచక అధికారులపై సర్కారు డేగకన్ను!
వైకాపా హయాంలో గత అయిదేళ్ల పాటు రాష్ట్రంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, రాజకీయ హత్యలు, తప్పుడు కేసులకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
గ్రామాలకు జగన్ ద్రోహం
గ్రామీణాభివృద్ధికి దోహదం చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలకు గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వకుండా భ్రష్టు పట్టించడమే కాదు.. కేంద్రం ఇతర పథకాల కింద ఇచ్చే నిధులూ ఉపయోగించుకోలేకపోయింది. -
తితిదేలో అక్రమాల చిట్టా సిద్ధం!
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు నడుం బిగించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు తమ పరిశీలనను ముగించారు. -
ఒక ముఖ్యమంత్రికి 986 మంది భద్రత కావాలా?
‘ఒక ముఖ్యమంత్రికి 986 మంది సిబ్బందితో భద్రత కావాలా? పరదాలు కట్టుకుని తిరగడం, చెట్లు కొట్టేయడం.. ఏమిటిది? నేరస్థులకు సెక్యూరిటీ కావాలని అంటున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయవ్య దిశగా పయనించనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం