- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gokavaram: తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!
ఇంటింటికి వెళ్లి పింఛను అందించడం ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రెండు రోజులుగా గదిలోనే చిక్కుకుపోయిన అతణ్ని సచివాలయ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకొచ్చారు.
మానసిక స్థితి సరిగా లేక గది లోపలి నుంచి తాళం వేసుకున్న వృద్ధుడు
రెండు రోజుల తర్వాత పింఛను ఇవ్వడానికి వెళ్లి గుర్తించిన సచివాలయ సిబ్బంది
వృద్ధుడిని బయటకు తీసుకొచ్చి పింఛను అందిస్తున్న సిబ్బంది
గోకవరం, న్యూస్టుడే: ఇంటింటికి వెళ్లి పింఛను అందించడం ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది. రెండు రోజులుగా గదిలోనే చిక్కుకుపోయిన అతణ్ని సచివాలయ సిబ్బంది గుర్తించి బయటకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆనిమళ్ల వెంకటపురుషోత్తం(64)కు పిల్లలు లేరు. కొవిడ్ సమయంలో భార్య చనిపోవడంతో మానసికంగా కుంగిపోయారు. స్థానికంగా ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. పనులు చేసుకునే ఓపిక లేక పింఛను సొమ్ముపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆదివారం గది లోపలి నుంచి తాళం వేసుకున్న ఆయన కొంతసేపటి తర్వాత నిద్రపోయారు. లేచిన తర్వాత తాళం ఎక్కడ పెట్టారో మరిచిపోవడంతో గదిలో బందీగా మారారు. అతడు ఉంటున్న పోర్షన్ పక్కన ఎవరూ లేకపోవడం, చుట్టుపక్కల ఇళ్లు దూరంగా ఉండటంతో.. ఎవరూ అతడిని పట్టించుకోలేదు. ఒకటో తేదీన (సోమవారం) పింఛను సొమ్ము అందించడానికి సచివాలయ సిబ్బంది వృద్ధుడి ఇంటికి వెళ్లినా తలుపులు వేసి ఉండటంతో వెనుదిరిగారు. మంగళవారం సాయంత్రం మరొకసారి పరిశీలించగా లోపల వెంకటపురుషోత్తం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు సమాచారమిచ్చి గది తలుపులు పగులగొట్టారు. అతణ్ని బయటకు తీసుకొచ్చి రూ.7 వేలు పింఛను అందించారు. బాధితుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అ‘ధర్మం’ బరితెగిస్తే అధికారులు అంటకాగారు!
వైకాపా పాలనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి లేఅవుట్కు రాజమార్గాన్ని వేసుకునేలా ప్రణాళికలు రచించారు. -
పోలీసు కస్టడీకి పిన్నెల్లి
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస కల్యాణ్ శుక్రవారం తీర్పునిచ్చారు. -
11న ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు జనరల్ కౌన్సెలింగ్ జాబితా విడుదల
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన శుక్రవారంతో ముగిసిందని ట్రిపుల్ ఐటీల ప్రవేశాల సమన్వయకర్త ఎస్.అమరేంద్రకుమార్ తెలిపారు. -
గిరిజన విద్యార్థుల చేతికే కాస్మొటిక్ వస్తువులు
గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు కాస్మొటిక్స్ ఛార్జీలను తల్లుల ఖాతాల్లోకి జమచేయకుండా.. ఆ నగదుతో వస్తువుల్ని కొనుగోలు చేసి వారికే అందించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. -
క్లస్టర్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లపై కక్షసాధింపు
వైకాపా పెద్దలు చెప్పినట్లు వినలేదన్న కారణంతో కర్నూలులోని క్లస్టర్ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్లపై గత ప్రభుత్వ హయాంలో ఉన్నతవిద్యాశాఖలోని కొందరు అధికారులు కక్ష కట్టారు. -
39 శాతం తక్కువ రేటుకే పనిచేస్తాం!
కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) పిలిచిన టెండర్లలో రెండు బైపాస్ రోడ్ల పనులను అంచనా కంటే ఎంతో తక్కువ మొత్తానికి కోట్ చేసి, గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు. -
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఇదీ ‘నాడు-నేడు’ ప్రగతి
నంద్యాల జిల్లా డోన్ జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల నీడే తరగతి గదిగా మారింది. ఇక్కడ 1800 మంది విద్యార్థినులు చదువుతున్నారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
రూ.41 లక్షలు చెల్లించక.. నిలిచిన మందుల పంపిణీ!
వైకాపా ప్రభుత్వం నిధులు చెల్లించక పోవడంతో ప్రజాప్రతినిధులు, సచివాలయంలో పనిచేసే ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులకు ఔషధాల పంపిణీ నిలిచిపోయింది. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
ఇంజినీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కళాశాలల ఫీజుల నిర్ణయం, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోంది. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
రూ.18 కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
అన్నమయ్య జిల్లా కలికిరిలోని ఎహసానుల్లా మిషన్ కాంపౌండ్ సమీపంలోని బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి ఇంటి పెరట్లో పెంచిన అంజూర చెట్టు కాండం వద్దే కాయలు విరగ్గాసి ఆకర్షిస్తోంది. -
ఇదీ సంగతి!