- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP Pensions: ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది.
తొలిరోజే 95 శాతం పంపిణీ
సచివాలయాల సిబ్బందితో అందజేత
పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు
18 రోజుల్లోనే ఎన్డీయే కీలక హామీ అమలు
లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే యంత్రాంగం
పింఛను అందుకున్న విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన దివ్యాంగుడు కోలా దుర్గారావు సంతోషం
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. సామాజిక భద్రత పింఛన్ను ఇంత పెద్దమొత్తంలో అందించడం దేశ చరిత్రలో రికార్డు. గతనెల వరకు వారికి రూ.3 వేల చొప్పున అందుతుండగా.. కొత్త ప్రభుత్వం ఒకేసారి రూ.1000 పెంచి, రూ.4 వేలు చేసింది. పైగా దాన్ని ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించి, మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు పూయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాల వారు పింఛను సొమ్మును చూసి మురిసిపోయారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. పలుచోట్ల వారు వినూత్న రీతిలో పంపిణీ చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. రాత్రి 10 గంటలకల్లా 95.05 శాతం (61.95 లక్షల మందికి) పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డుగా అభివర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో వృద్ధురాలికి హోంమంత్రి అనిత పింఛను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అసాధ్యమన్న దాన్ని.. సుసాధ్యం చేసి
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా, అప్పటి వైకాపా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేశాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే నగదు అందించవచ్చని చంద్రబాబు సూచించినా పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్లు కూడా ఇళ్ల వద్ద పంపిణీ సాధ్యమని చెప్పినా వినిపించుకోలేదు. ఏప్రిల్ 1న మండుటెండల్లో వృద్ధులు, దివ్యాంగులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి, గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిప్పి, వికృత క్రీడను నడిపారు. దానికి కారణం తెదేపానే అని చూపించేందుకు కుయుక్తులు పన్నారు. అదీ చాలదన్నట్లు మే నెల పింఛను మొత్తాన్ని ఏకంగా బ్యాంకుల్లో జమ చేసి అష్టకష్టాలు పెట్టారు. మొత్తంగా 33 మందికి పైగా వృద్ధుల మరణానికి కారకులయ్యారు. ఈ కుట్రను గ్రహించిన పింఛనుదారులు వైకాపాకు ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల వద్ద నగదు అందజేసింది. గత ప్రభుత్వం అసాధ్యమన్న దానిని సుసాధ్యం చేసి చూపించింది.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని మంచాడవలసలో లబ్ధిదారులకు పింఛన్లు అందించాక గ్రామస్థులతో కలిసి థింసా నృత్యం చేస్తున్నమంత్రి సంధ్యారాణి
తెల్లవారుజాము నుంచే..
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల తెల్లవారుజామున 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖల వారు, తెదేపా నాయకులు పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందించారు. అధికారులు పంపిణీ తీరును నిరంతరం పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రక్రియ ప్రారంభమవడంతో ఉదయం గంటకుపైగా సర్వర్ మొరాయించింది. అధికారులు సరిదిద్దటంతో తర్వాత సాఫీగా సాగింది. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జోరు వానలోనూ పింఛన్లు అందజేశారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చారు.
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో మంచానికే పరిమితమైన దివ్యాంగుడికి పింఛను నగదు రూ.15 వేలు అందజేస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
వాడవాడలా క్షీరాభిషేకాలు
ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల హామీ నెరవేర్చడంపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకాలు చేశారు. ఇళ్ల వద్దకు వెళ్లిన తెదేపా, జనసేన, భాజపా నేతలకు లబ్ధిదారులు హారతులతో స్వాగతం పలికారు. పలుచోట్ల కేకులు కోసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొన్నిచోట్ల థాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో వికలాంగుడు బుడత అన్నయ్యకు పింఛన్ అందిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి
ఉద్యోగులకు సీఎం అభినందనలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకేరోజులో రికార్డు స్థాయిలో 95.05 శాతం పింఛన్లు పంపిణీ చేసిన అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో పించన్ల పంపిణీ జరగలేదని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరో.. పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువైందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
లబ్ధిదారుల ఉదారత.. ప్రభుత్వానికి విరాళాలు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్కు చెందిన చేనేత కార్మికురాలు బాలనారాయణమ్మ తనకు ఇచ్చిన రూ.7 వేల వృద్ధాప్య పింఛన్ను తిరిగి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి ఈ సొమ్మును వినియోగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఆ మొత్తాన్ని అందించారు.
- ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లికి చెందిన నారాయణ రూ.7 వేల పింఛను సొమ్ముకు రూ.116 కలిపి రూ.7,116ను ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్కు అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వినియోగించాలని కోరారు.
- గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన పాలకీటి తిరుపతయ్య రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులకు రూ.10 వేల నగదును విరాళంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్కు అందజేశారు.
- కనిగిరికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి తనకు వచ్చిన పింఛన్ సొమ్ముకు రూ.4 వేలు కలిపి రూ.10 వేలు అమరావతి నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
- ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన పద్మావతి రూ.7 వేల పింఛనుకు మరో రూ.3 వేలు కలిపి రూ.10 వేలను రాష్ట్రాభివృద్ధికి విరాళంగా అందించారు.
అభిమానం చాటుకున్నారిలా!
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు వృద్ధురాలి కాళ్లు కడిగి పింఛను అందించారు. పలువురు లబ్ధిదారులకు పాదాభివందనం చేశారు.
- అల్లూరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి రాజవొమ్మంగి మండలం లబ్బర్తిలో ఓ లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛను ఇచ్చి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి మరీ సొమ్ము అందజేశారు.
- ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పలు తండాల్లోకి మేళతాళాలతో వెళ్లారు. కడప నగరంలోనూ మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పింఛన్లు అందించారు.
- రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం నెలటూరుకు చెందిన అంగారపు సురేశ్కు ఆసుపత్రికి వెళ్లి సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శి దీప్తి పింఛను అందించారు.
కూటమి అండగా.. కుటుంబంలో పండుగ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లండిపూడి గ్రామానికి చెందిన నారిన వెంకటేశ్వరరావు బ్రెయిన్స్ట్రోక్తో ఐదేళ్లనుంచి మంచానికే పరిమితమయ్యారు. గత ప్రభుత్వం ఇచ్చిన పింఛను డబ్బులు వైద్యానికి ఏ మూలకూ సరిపోయేవి కావు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన రూ.15 వేల పింఛను ఒక్కసారిగా ఆయన కుటుంబానికి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఇది తమకు నిజమైన పండగ రోజు అని వెంకటేశ్వరరావు భార్య సూర్యకుమారి ఆనందబాష్పాలు రాల్చారు.
పి.గన్నవరం, న్యూస్టుడే
మలిసంధ్యలో వెలుగు కిరణం: విజయవాడ గుణదలకు చెందిన వృద్ధురాలు సీసపు నారాయణమ్మ ఆనందోత్సాహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. -
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. -
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. -
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సు తొలగింపు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. -
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పురోగతి, తర్వాత వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు. -
అమరావతిని బంగారం చేస్తాం
అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికే నిర్ణయం
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. -
అందరికీ ఉచిత ఇసుక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. -
మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. -
హైకోర్టులో జీపీ, ఏజీపీల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు ఆరుగురు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), 14 మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ) నియమితులయ్యారు. -
ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అమలు కావడం లేదు. వైకాపా ప్రభుత్వంలో నియమించిన వారే పని చేస్తుండడంతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్కు తరలించారు. -
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. -
ఐఏఎస్లూ.. పొలాలకు వెళ్లండి
ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
ప్రోత్సాహకాలు అందిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. -
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం
రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు