- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramanaidu: పట్టిసీమ.. అన్నదాతల కొంగు బంగారం
‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది.
నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల
పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో మీటనొక్కి నీటిని విడుదల చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు, పక్కన ఎమ్మెల్యేలు ధర్మరాజు, బాలరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి తదితరులు
ఈనాడు, ఏలూరు: ‘పట్టిసీమ..సీఎం చంద్రబాబు దార్శనికతకు ప్రతిబింబం..పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. అంతటి బృహత్తర పథకాన్ని వైకాపా గాలికొదిలేసింది. తెదేపా ప్రభుత్వం చేపట్టిన పథకం కావడంతో జగన్ పట్టిసీమను ఒట్టిసీమ అంటూ అవహేళన చేశారు. నేడు బంగారు సీమగా లక్షల ఎకరాలకు సాగునీరు..వేల గ్రామాలకు తాగునీరు అందిస్తోంది’ అని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పశ్చిమలో 920 పనులకు అంచనాలు సిద్ధం చేశామని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఆయన బుధవారం ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. మూడు మోటర్ల మీట నొక్కి చేసి 1050 క్యూసెక్కుల నీటికి పోలవరం కుడి కాలువలోకి విడుదల చేశారు. ముందుగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేసింది.పోలవరం పూర్తి చేసేలోగా వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాతో పాటు, రాయలసీమలో తాగు, సాగు అవసరాలు తీరుస్తాం. 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తాం’ అని నిమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసి పరిహారం..పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఐటీడీఏ పీవో సూర్యతేజ పాల్గొన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదలను పరిశీలిస్తున్న మంత్రి రామానాయుడు తదితరులు
తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల
సీతానగరం, తాళ్లపూడి, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి, సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి బుధవారం సాగునీటిని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఆగస్టులో వచ్చిన వరదలకు పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు సాంకేతిక నిపుణల బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్టును దెబ్బతీసిన వైకాపా పాలకులు ఇప్పటికీ దానిపై విషప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో జలవనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా కాపాడేవారని పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని ఎప్పుడూ రిజర్వులో ఉంచేవారని మంత్రి గుర్తుచేశారు. వైకాపా పాలనలో ఒక్క టీఎంసీ నీరు కూడా లేదన్నారు. తెదేపా హయాంలో రూ.7 లక్షల కోట్ల బడ్జెట్లో జలవనరులశాఖకు రూ.80వేల కోట్లు కేటాయిస్తే, జగన్ ప్రభుత్వంలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ.30 వేల కోట్లే ఇచ్చారన్నారు. అందులోనూ 50 శాతానికి పైగా నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. పురుషోత్తపట్నం రైతులకు ఇవ్వాల్సిన పరిహారంతోపాటు ప్రాజెక్టుకు ఉన్న ఎన్జీటీ అంశాలను, న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. -
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.