- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: స్థానిక విద్యార్థులతోనే వైద్య సీట్ల భర్తీ
రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. జూన్ 2తో పదేళ్ల కాలపరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే వైద్య విద్య సీట్ల భర్తీ చేపట్టనున్నారు.
‘పదేళ్ల కాలపరిమితి’ ముగిసినందున.. స్థానికేతర కోటా విధానానికి స్వస్తి
న్యాయ శాఖ పరిశీలనలో ప్రతిపాదనలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. జూన్ 2తో పదేళ్ల కాలపరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే వైద్య విద్య సీట్ల భర్తీ చేపట్టనున్నారు. అందుకోసం సిద్ధం చేసిన దస్త్రాలు ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఉత్తర్వుల జారీ లాంఛనమే కానుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. 2014కు ముందు ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్/పీజీ సీట్లను స్థానిక, స్థానికేతర కోటాలో 85:15 నిష్పత్తి ప్రకారం కేటాయిస్తున్నారు. 15% కోటాలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కాదు. ఇప్పటికే 2014 తరువాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని సీట్లలో స్థానిక విద్యార్థులే ప్రవేశాలు పొందుతున్నారు.
రాష్ట్ర కళాశాలల విషయంలోనూ..
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాలలు రాష్ట్రస్థాయి విద్యా సంస్థలుగా ఉన్నాయి. వీటిలో కిందటి విద్యా సంవత్సరం వరకు 42:32:22 నిష్పత్తిలో ఏయూ, ఓయూ, ఎస్వీయూ ప్రాంతాల వారీగా సీట్లను కేటాయిస్తూ వచ్చారు. పునర్విభజన చట్టం-2014 ప్రకారం పదేళ్ల కాల పరిమితి ముగిసినందున ఈ రెండు వైద్య కళాశాలల్లోనూ స్థానిక విద్యార్థులతోనే సీట్లను భర్తీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇకపై ఈ రెండింటికీ రాష్ట్రస్థాయి హోదా తొలగనుంది. ఈ ఉత్తర్వులూ త్వరలో వెలువడనున్నాయి. సంబంధిత ప్రతిపాదనలు విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వం ద్వారా న్యాయ శాఖకు వెళ్లాయి.
మినహాయింపు కోరిన ఆరోగ్య వర్సిటీ
ఎంబీబీఎస్ ‘సి’ కేటగిరీ సీట్లను జాతీయస్థాయిలో భర్తీ చేస్తామని ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేయొద్దని కోరుతూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జాతీయ వైద్య కమిషన్కు తాజాగా లేఖ రాసింది. ‘సి’ కేటగిరీ సీట్ల విధానంపై మా ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు మాకు లేఖ రాశాయి. దీంతోపాటు ప్రవేశాల నిర్వహణకు తక్కువ సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పులు చేయొద్దు’ అని అందులో పేర్కొంది.
పీజీ ఇన్సర్వీస్ కోటా సీట్ల తగ్గింపునకు కమిటీ సిఫార్సు
రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా చేరిన వారికి ఇన్సర్వీస్ కింద పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు నిర్దేశించిన 30% కోటాను ఎంపిక చేసిన స్పెషాల్టీల్లో 15%కు తగ్గించాలని ప్రత్యేక కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2022 నుంచి పీజీ వైద్య విద్యలో క్లినికల్ సబ్జెక్టుల్లో 30%, నాన్-క్లినికల్ సబ్జెక్టుల్లో 50% సీట్లను రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్సర్వీసు కోటాలో కేటాయిస్తున్నారు. ఇలా 2023లో సుమారు 500 మంది పీజీ సీట్లు పొందారు. నాన్-క్లినికల్ స్పెషాల్టీ సీట్లలో ప్రస్తుతం ఉన్న 50% సీట్లను 30%కు కుదించాలని కమిటీ సిఫార్సు చేసింది. క్లినికల్ స్పెషాల్టీల్లోని పీడియాట్రిక్స్, గైనిక్, రేడియాలజీ, జనరల్ మెడిసన్, ఎనస్థీషియా కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే ఇన్సర్వీస్ కోటాను పరిమితం చేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వంలో సమాలోచనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల సంఖ్య అవసరాలకు తగ్గట్లు ఉందని, పీజీ వైద్య విద్యను పూర్తిచేసిన వారు తిరిగి విధుల్లోకి రావడం లేదని.. వచ్చినా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నారన్న ఉద్దేశంతో కమిటీ ఈ సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇన్సర్వీస్ కోటాను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆరు రాష్ట్రాల వైద్య సంఘాల పోరాటాల ఫలితంగా, న్యాయస్థానాల ఆదేశాలతో ఇన్సర్వీస్ కోటాలో వైద్యులు సీట్లు పొందుతున్నారని గుర్తుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
వైకాపా అధినేత జగన్కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. -
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. -
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
స్టార్ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది. -
అమ్మ వెంకటరెడ్డీ.. ఇంత మోసమా?
జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసేశారు. -
ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్
‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. పోలీసులూ స్పందించలేదు. -
‘వేలిముద్రలు’ చెరిపేసిన నేరం జగన్దే!
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: మంత్రి లోకేశ్
విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. -
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో.. సాంకేతిక సమస్యలను అధిగమించాలి
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. -
‘ఆర్థిక’ శ్వేతపత్రం రూపకల్పనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా
జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకంపై శ్వేతపత్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం తన ఛాంబరులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు వినయ్చంద్, జానకి తదితరులతో సమావేశమయ్యారు. -
విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ
విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. -
18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించాయి. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ డెమో పోస్టు భర్తీ
వైద్య, ఆరోగ్యశాఖ జోన్-3 పరిధిలోని డిప్యూటీ మాస్ మీడియా అధికారి (డెమో) పోస్టును నిబంధనలకు విరుద్ధంగా జోన్-4 అధికారులు భర్తీ చేయడం చర్చనీయాంశమైంది. -
అమరావతి అనుసంధాన రహదారుల అభివృద్ధి
రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. -
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
అచ్యుతాపురం సెజ్లో కృతిమ మేధ పరిశ్రమ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్స్ట్రాక్ట్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. -
టెస్లాతో మళ్లీ సంప్రదింపులు
పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది. -
154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. -
ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేష్చంద్ర లడ్హా
రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా మహేష్చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. -
ఇసుక విధానంపై సీఎం కీలక భేటీ
రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. -
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి
పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. -
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు
గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.