- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: విలువల శిఖరం రామోజీ
తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు.
ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం.. విశాఖలో చిత్రనగరి
ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత
ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు
ప్రజాచైతన్యంతో సేవలందించొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి
భయమెరుగని జీవితం.. సమాజం కోసమే పోరాటం
‘రామోజీరావు సంస్మరణ సభ’లో ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగుజాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడూ తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు.
రేటింగ్ల కోసం పోరాడే రోజులివి. తిమ్మిని బమ్మిని చేస్తూ అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్లి పనులు చేయించుకునే పరిస్థితి. కానీ రామోజీరావు ఎప్పుడూ ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనో, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనో ఎక్కడా ఒక్క మాట చెప్పలేదు. ఒక్క పని కూడా అడగలేదు. ఆయన నీతి, నిజాయతీ, విలువల కోసం బతికారు. ప్రజల కోసం పోరాటాలు చేశారు.
మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారు. రామోజీరావును ఎన్నో రకాలుగా హింసించారు. అయినా సరే.. నేను ప్రజల కోసం పోరాడుతున్నా. నేను సంపాదించిన ఆస్తులివి. ఆస్తులన్నీ పోయినా రాజీపడేది లేదని చెప్పి పోరాడిన వ్యక్తి రామోజీరావు. భయం తెలియని వ్యక్తి ఆయన. 86 సంవత్సరాల వయసులోనూ ప్రజలకు న్యాయం చేయాలని తపించారు’
రామోజీరావు నాకు చెప్పిన మాట ఒక్కటే. మీరు రాజకీయాల్లో ఉన్నారు.. నేను పత్రికా రంగంలో ఉన్నాను. మన ఇద్దరం ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు.. మీ స్వేచ్ఛకు భంగం కలిగించను. నేను మిమ్మల్ని ఏమీ అడగను.. మీరు నన్నేం అడగొద్దని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన మహనీయుడు ఆయన. రాష్ట్రం కోసం, విలువల కోసం పని చేసిన వ్యక్తి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఈనాడు - అమరావతి
విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి,
హిందూ పూర్వ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్,
ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, నారా భువనేశ్వరి, ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు
తెలుగుజాతికి, ప్రజలకు రామోజీరావు చేసిన విశేష సేవలను భావితరాలకు తెలియజెప్పేలా రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దిల్లీలోని విజ్ఞాన భవన్ తరహాలో కాన్ఫరెన్స్లు, రీసెర్చ్, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ నిర్వహించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో ఒక రహదారికి రామోజీరావు మార్గ్ అని పేరు పెడతామని వెల్లడించారు. రామోజీరావు తొలిసారి విశాఖపట్నంలో పత్రిక ప్రారంభించారని.. ఆయన స్మారకంగా అక్కడ రామోజీ చిత్రనగరి అని పేరు పెట్టి సినిమా చిత్రీకరణలు చేస్తామని ప్రకటించారు. దీనిపై పవన్ కల్యాణ్తోనూ మాట్లాడానని చెప్పారు. ‘ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం. రామోజీరావుకు అలాంటి గుర్తింపు ఇవ్వాలి. దీనిపై అందరూ సలహాలు ఇస్తే.. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి తగిన గుర్తింపు ఉండేలా, ప్రజలకు చిరకాలం గుర్తుండేలా చేస్తాం’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన ‘రామోజీరావు సంస్మరణ సభ’లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్ కిరణ్ సహా పలువురు ప్రముఖులు మాట్లాడారు. ప్రజాస్వామ్యం
అపహాస్యం పాలైనప్పుడు.. నేనున్నానంటూ వచ్చి ప్రజల తరఫున ముందుండి పోరాడిన వ్యక్తి రామోజీరావు.. అని చంద్రబాబు కొనియాడారు. పదవులు ఉంటేనే సేవ చేయొచ్చని చాలా మంది అనుకుంటారు.. ప్రజాసేవకు పదవులు అవసరం లేదని, ప్రజాచైతన్యంతో మేలైన పాలన, సేవలందించొచ్చని రామోజీరావు నిరూపించారని ప్రశంసించారు. ‘40 ఏళ్లుగా ఆయన్ను చూశాను. భయమనేదే ఆయన జీవితంలో లేదు. పోరాటం ఆయన జీవితంలో భాగం. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం మనందరిపైనా ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రామోజీరావు ప్రజల ఆస్తి
‘రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థ వారి కుటుంబసభ్యులదే కాదు, పది కోట్ల మంది తెలుగు ప్రజలది. ఆ వ్యవస్థలన్నింటినీ భావితరాలకు అందించే బాధ్యత వారిది. ఆయన పేరు తెలుగుజాతి చరిత్రలో నిలిచేలా మనమంతా ఆలోచించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ ఇద్దరే. వారికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత.. మహానాయకులు, యుగపురుషులకు మనం అర్పించే నివాళి అదే’ అని కొనియాడారు. ‘రాజకీయాలు, పత్రికా రంగం, సినిమాల్లో వారికి విశ్వసనీయత ముఖ్యం. ఎన్టీఆర్ను తెలుగుజాతి ఉన్నంత వరకు నంబర్ 1గా ఎలా గుర్తుంచుకుంటారో.. రాష్ట్రానికి సేవలందించిన వ్యక్తిగా తెలుగుజాతి రామోజీరావును అలాగే శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను, వారసత్వాన్ని కొనసాగించాలి’ అని కోరారు.
వ్యక్తి కాదు.. వ్యవస్థ
‘కృష్ణా జిల్లా పెదపారుపూడిలో మామూలు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అచంచల విశ్వాసంతో ఎదిగారు. ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు. వారిని ఎవరూ అధిగమించలేరు. అది అసాధ్యం. రామోజీరావు వ్యక్తి కాదు.. వ్యవస్థ. అసాధారణ శక్తి. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీలేని పోరాటం చేశారు. ఏ రంగంలోకి ప్రవేశించినా మొదటి స్థానంలో నిలిచారు. వ్యాపారం, సినీ, సేవా, పత్రికా రంగాల్లో ఆయనకు ఆయనే సాటి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తుపాను, ఇతర విపత్తులొచ్చినప్పుడు బాధ్యతగా ముందుండి సేవలందించారు. పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్పల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని రూ.25 కోట్లు ఖర్చు పెట్టారు. కొవిడ్ సమయంలో రూ.20 కోట్లతో ప్రజలకు సేవలందించారు’ అని చంద్రబాబు ప్రశంసించారు.
‘ఈనాడు’ ఎండీ కిరణ్, శైలజాకిరణ్ దంపతులతో మాట్లాడుతున్న చంద్రబాబు
ఆయన సూచనతోనే రాజధానికి అమరావతి పేరు
‘ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేశాం. వాటిలో రామోజీరావు ఆలోచనలు ఉన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టాలని రామోజీరావే సూచించారు. ఆ పేరు ఎందుకు పెట్టాలో వివరిస్తూ పరిశోధనాపత్రం పంపారు. ఆ తర్వాత అమరావతి పేరు ప్రపంచమంతా మార్మోగింది. నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి’ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘అమరావతి ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడింది. మళ్లీ అమరావతి దశ, దిశ మారుతుంది. తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది’ అని ఆయన ఆకాంక్షించారు.
అభిప్రాయాల్ని నిస్సంకోచంగా చెప్పడమే తెలుసు
‘రామోజీరావు ఎవర్నీ పిలవరు. ఎవరూ తన దగ్గరకు రావాలని కోరుకోరు. ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇస్తారు. సలహాలు అందిస్తారు. తన అభిప్రాయాల్ని నిస్సంకోచంగా చెప్పడం ఆయన అలవాటు. పనిచేస్తూ చనిపోవాలనే ఆయన కోరిక నెరవేరింది. నిరంతరం పని చేయాలనేది ఆయన ఆలోచన. కొంతమందే అలా ఆలోచిస్తారు. చనిపోవడం తథ్యమని, తాను చనిపోయాక ఎక్కడ అంత్యక్రియలు చేయాలో కూడా చెప్పిన వ్యక్తి ఆయన. కొన్ని పత్రికల్లో ఇతర పార్టీల వారి వార్తలు వేయరు. కానీ రామోజీరావు మాత్రం ప్రతి పార్టీ, నాయకుడికి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తారు. కవరేజిలో ఎక్కడా తప్పు చేయరు. తన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో చెబుతారు. అవసరమైనప్పుడు తప్పుల్ని ఎండగడతారు. అవతలివారు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేయరు’ అని చంద్రబాబు గుర్తుచేశారు.
నారా భువనేశ్వరి, ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి
రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి పాదాలకు నమస్కరిస్తున్న రామోజీరావు మనవడు సుజయ్
సంస్మరణ సభకు హాజరైన రామోజీరావు కుటుంబ సభ్యులు వెంకట్ అక్షయ్, రేచస్ వీరేంద్రదేవ్, వినయ్, సోహన, సహరి, బృహతి, సుజయ్, దివిజ
సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులు, ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. -
అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు
ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు అవసరమైన సన్నాహాల్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోంది. -
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
‘అరకొర సొమ్ము చేతిలో పెట్టి విడాకులు తీసుకుంటే.. రేప్పొద్దున్న భార్య, పిల్లలు ఎలా బతుకుతారు.. ఇదేం పరిష్కారం?’ అని గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు విస్మయం వ్యక్తంచేశారు. -
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం దిల్లీ చేరుకున్నారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా నిలిచిపోయాయి. -
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
మీ భద్రత మా బాధ్యత
సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. -
స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. -
దారి ఇస్తారా.. ఇక్కట్లు కొనసాగిస్తారా?
పదవి ఏదైనా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఉపయోగించాలి. జగన్ మాత్రం అధికారం అండతో తన నివాసం పరిసరాల వారిని ఇబ్బందులకు గురిచేశారు. -
పదవి కాదు.. బాధ్యత
‘ఎంతో కీలకమైన పదవి ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తా’ అని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. -
కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలుపైనే తొలి సంతకం: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. -
జీజీహెచ్ అభివృద్ధికి ఆర్థిక సహకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో (జీజీహెచ్) మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందిస్తామని గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన 14,389 కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. 14,389 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.49.36 కోట్ల పరిహారం అందజేశారు. -
నాగార్జున వర్సిటీ వీసీ రాజీనామా
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.రాజశేఖర్ ఎట్టకేలకు శనివారం రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలోని శారదా పీఠం భవనాలు సీజ్ చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. -
ఇదీ సంగతి!
-
మా భవనాలపై దాడులు జరగకుండా నియంత్రించండి
వైకాపా కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనాలపై దాడులు జరపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని గవర్నర్కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. -
జోగి కుటుంబం కబ్జాపై డీజీపీకి నివేదిక
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి, వైకాపా నాయకుడు జోగి రమేష్ కుటుంబం పాత్రపై డీజీపీ కార్యాలయానికి ప్రాథమిక నివేదిక చేరింది. -
‘అనంతబాబుపై నమోదైన హత్య కేసును.. ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలి’
ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.