- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
LV Subramanyam: స్టీల్ప్లాంటును జరిపేసి.. రాజధాని కట్టేద్దామన్నారు!
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి.
ప్రజావేదిక కూల్చేస్తామన్నప్పుడు షాక్కు గురయ్యాను
రాజధానిలో చంద్రబాబుకు భూములున్నాయని నిరాధార ఆరోపణలు
జగన్తో ఎదురైన అనుభవాల్ని వెల్లడించిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఈనాడు - అమరావతి
జగన్ లాంటి విపరీత, విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం సీఎస్గా పనిచేసిన ఆయన జగన్తో తనకు ఎదురైన, షాక్కు గురిచేసిన కొన్ని అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. విశాఖలోని ఉక్కు కర్మాగారాన్ని నగరం నుంచి 20 కి.మీ.ల దూరానికి తరలించి, ఆ భూముల్లో రాజధాని కడదామని జగన్ చెప్పినప్పుడు దిగ్భ్రాంతి చెందానని ఆయన తెలిపారు. ప్రజావేదికను కూల్చేయాలన్న నిర్ణయమూ తనను షాక్కి గురి చేసిందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, నిధులు, బడ్జెట్ లాంటి అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఎంతమాత్రం ఆసక్తి, ఓపిక ఉండేవి కావు. దేనిపైనా లోతుగా, విస్తృతంగా చర్చించడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆయనతో ఏం చెప్పాలనుకున్నా రెండు నిమిషాల్లో ముగించేయాలి. మనం ఏదైనా విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తే మనకు చాదస్తమని, ఆ పని చేయడానికి మనం వ్యతిరేకమని భావించేవారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాలి. మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో పెట్టినప్పుడు... బాధ్యతగా వ్యవహరించకపోతే మన ప్రాణాలకు, భవిష్యత్తుకు ముప్పు. ఈ విషయాలు నేను ఎన్నికల ముందు చెబితే దురుద్దేశాలు అంటగడతారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. మనం ఎలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నామన్న విషయంలో ప్రజలు ఇకపైనా అప్రమత్తంగా ఉండాలన్నదే నా అభిమతం’’ అని ఆయన తెలిపారు.
అర్థం కావడానికి సమయం పట్టింది
విశాఖలో స్టీల్ప్లాంటు వల్ల కాలుష్యం పెరుగుతోందని, దాన్ని అక్కడినుంచి తీసేసి ఆ భూముల్లో రాజధాని కడతానని జగన్ ఒక సందర్భంలో చెప్పడంతో షాక్ తిన్నానని ఎల్వీ చెప్పారు. ‘‘ఆయన ఏమంటున్నారో అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది. స్టీల్ప్లాంటు వల్ల అంత కాలుష్యమేమీ ఉండదని, కావాలంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అధ్యయనం చేయిద్దామని చెప్పాను. ‘దానికాయన... నీకేమీ తెలియదన్నా ఊరుకో...! ప్రతిదానికీ కేంద్రం అంటావ్’ అని విసుక్కున్నారు. ‘స్టీల్ప్లాంటుకు ఎంత భూమి ఉందో తెలుసా?’ అని అడిగారు. 32-33 వేల ఎకరాలుంటుందని చెప్పాను. స్టీల్ప్లాంటును నగరం నుంచి 20 కి.మీ.ల దూరం జరిపేస్తే... ఆ భూముల్లో రాజధాని కట్టుకోవచ్చని ఆయన అన్నారు. దానిలోని మంచి.. చెడు చర్చించేందుకు ఆయన ఇష్టపడలేదు’’ అని ఎల్వీ తెలిపారు.
ప్రజావేదికను చూశాకైనా..
‘‘వైకాపా అధికారంలోకి వచ్చాక కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నారు. స్టార్ హోటళ్లలో పెట్టడం సీఎంకు ఇష్టం లేదని సీఎంఓ చెప్పింది. ప్రజావేదిక అనుకూలంగా ఉంటుందని, కాదంటే ఏదైనా ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో పెట్టాల్సి వస్తుందని చెప్పాను. కాన్ఫరెన్స్ తేదీకి రెండు మూడు రోజుల ముందు వరకు సమావేశం ఎక్కడ పెట్టాలన్న విషయంలో సీఎంఓ నుంచి స్పష్టత రాలేదు. వేదిక ఖరారు కానిదే ఏర్పాట్లు చేయలేం. మేం ఆ టెన్షన్లో ఉన్నప్పుడు సీఎంఓ నుంచి ధనుంజయరెడ్డి ఫోన్ చేసి... ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సీఎం అంగీకరించినట్టు చెప్పారు. ప్రజావేదికను కూల్చేయబోతున్నారన్న విషయాన్నీ అప్పుడే చెప్పారు. దాన్ని గోప్యంగా ఉంచాలని, ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. అది విని షాక్ తిన్నాను. జగన్ ప్రజావేదిక చూడలేదు కాబట్టి అలాంటి ఆలోచన చేస్తున్నారని, దాన్ని చూశాకైనా మనసు మార్చుకుంటారని అనుకున్నాను’’ అని తెలిపారు. ప్రజావేదికను కూల్చేస్తున్నప్పుడు దానిలోని ఏసీలను కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాడుకోవచ్చునని జీఏడీ అధికారులకు సూచించానని, కానీ వాటన్నిటినీ అక్కడే పడేయడం గత ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అలా అనడంతో ఆశ్చర్యపోయా!
‘రాజధానిని అమరావతిలో కట్టేద్దామంటావా.. నీ అభిప్రాయమేంటన్నా? అని జగన్ నన్ను అడిగారు. రాజధానిగా అమరావతినే నోటిఫై చేశారు కదా అని బదులిచ్చాను. నీకు తెలియదన్నా... అమరావతిలో చంద్రబాబుకు చాలా భూములున్నాయి... అని జగన్ అనడం ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాల్లేకుండా అలాంటి ఏకపక్ష ఆరోపణలు చేసినప్పుడు మనం ఏం సమాధానం చెబుతాం..! ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినా అవి నిరూపితమయ్యే వరకు వాటి గురించి మాట్లాడకూడదన్న సూత్రాన్ని... సీఎం వంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు పాటించాలి. లేకపోతే విచారణ చేస్తున్న అధికారుల్ని ప్రభావితం చేసినట్టవుతుంది’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాజధానిలో చంద్రబాబుకు భూములున్నాయా? అని తర్వాత సీఆర్డీఏ అధికారులను తాను కనుక్కుంటే.. అలాంటిదేమీ లేదని వారు బదులిచ్చినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్పే, గూగుల్పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. -
95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!
కాకినాడలో రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. -
స్తంభించిన దేవాదాయశాఖ వెబ్సైట్
దేవాదాయశాఖకు చెందిన వెబ్సైట్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్లైన్లో ముందే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. -
ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. -
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. -
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు.. -
పలువురు వీసీల రాజీనామా
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు సోమవారం రాజీనామాలు సమర్పించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన వీసీల్లో పలువురు అనేక ఆరోపణలు మూటగట్టుకున్నారు. -
గుంతలు పూడ్చిన గుత్తేదారులకే రూ.668 కోట్ల బకాయిలు
మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా.. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు. -
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
వైకాపా హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. -
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఆదేశాలతో ఈ సేవలను సోమవారం పునఃప్రారంభించారు. -
ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై త్వరితగతిన అధ్యయనం అవసరమని రాష్ట్ర రవాణా, వ్యవసాయశాఖ మంత్రులు మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. -
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. -
బందోబస్తుకు ఆలస్యంగా వచ్చారని ఎస్ఐపై మంత్రి భార్య ఆగ్రహం
మంత్రుల పర్యటనల్లో ఆడంబరాలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా ఓ మంత్రి భార్య పోలీసులపై మండిపడటం.. ఏకవచనంతో సంబోధించడం వివాదాస్పదమైంది.