- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Praveen Prakash: ప్రవీణ్ ప్రకాష్ కొత్త ప్రావీణ్యం!
‘అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్’ అని నానుడి. ప్రభుత్వ పెద్దగా చేసిన ఒకాయన ‘ఓటమి తర్వాత హిమాలయాలకు పోవాలనుకున్నానని’ మనసులో మాట బయటపెట్టారు.
ప్రభుత్వం మారాక ఇన్స్టా రీల్స్తో కొత్త అవతారం
గుడులు, పార్కుల్లో హిందీ పాటలకు అభినయం
ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్ల ఆశ్చర్యం
వైకాపాతో అంటకాగి ఇప్పుడు వీఆర్ఎస్కు దరఖాస్తు
ఈనాడు, అమరావతి: ‘అధికారాంతమందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్’ అని నానుడి. ప్రభుత్వ పెద్దగా చేసిన ఒకాయన ‘ఓటమి తర్వాత హిమాలయాలకు పోవాలనుకున్నానని’ మనసులో మాట బయటపెట్టారు. అప్పుడు ఆయనతో అంటకాగి తిరిగి.. అడ్డగోలుగా వ్యవహరించిన ఓ అధికారి ఇప్పుడు చెట్లు, పుట్టలు పట్టి తిరుగుతూ, నదీ తీరాల వెంట ఒంటరిగా సంచరిస్తూ.. పాటలకు అభినయిస్తూ ‘ఇన్స్టా’లో రీల్స్ చేసుకుంటున్నారు..
ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ తాజా వ్యవహారమిది! మొన్నటి వరకు పాఠశాలల తనిఖీలు, పరిశీలనల పేరుతో హడావుడి చేసిన ఈయన ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వంలో పెద్దలకు అనుకూలంగా వ్యవహరించిన ఈయన్ని కూటమి ప్రభుత్వం ఈనెల 19న బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఖాళీగా ఉండి రీల్స్ చేస్తున్నారా? లేక దీని వెనుక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానది తీరాన, పార్కుల్లో, గుడిలో.. ఇలా పలుచోట్ల ఆయన వీడియోలు చేస్తున్నారు. హిందీ పాటలకు హావభావాలను ఒలికిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన్ని ఓ ఉన్నతాధికారిగా చూసినవారు ఇప్పుడు ఈ కొత్త అవతారంలో చూసి ఆశ్చర్యపోతున్నారు.
కూటమి ప్రభుత్వం వస్తుందని ముందే తెలుసా?
వైకాపాతో అంటకాగిన ప్రవీణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తనకో మంచి ప్రైవేటు కొలువు చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్ను కోరడం.. వాట్సప్లో సందేశం పంపడం చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లాలో బడి ఈడు పిల్లలు బడి బయట కనిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఒకసారి ప్రకటించారు. కొంతమంది అధికారులు వారించినా వినలేదు. ఒక దశలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగింది. చివరికి ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేశారు. అయితే అందులో స్వయంగా సంతకం చేయాల్సి ఉండగా.. డిజిటల్ సంతకం చేయడం గమనార్హం. దీన్ని ప్రభుత్వం ఆమోదించదని తెలిసే అలా చేశారా.. అనేది కొందరి సందేహం.
ఎన్నో అక్రమాలకు సహకారం..
గత వైకాపా ప్రభుత్వంలో ఓ మంత్రి చేసిన అనేక అక్రమాలకు ప్రవీణ్ ప్రకాష్ సహకారం అందించారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపులో ఆయనకు సాయం చేశారు. రూ. 772 కోట్ల విద్యా కానుక సామగ్రి కొనుగోళ్లలో టెండర్లు లేకుండా పాతవారికే ఇచ్చేశారు. మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లెక్క చేయకుండా ప్రవర్తించినట్లు విమర్శలున్నాయి. కొంతమంది అధికారులపై తెదేపా ముద్ర వేసి ఇబ్బందులకు గురి చేశారు. విశాఖపట్నం కలెక్టర్గా పని చేసిన సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోక ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల విద్యలో తనిఖీలతో హడావుడి చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు. ఇలా ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు ప్రవీణ్ ప్రకాష్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది. -
వైకాపా జేబు సంస్థగా ఏపీ ఫైబర్నెట్!
ఏపీ ఫైబర్నెట్ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు.. ఎంపీ అవినాష్రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చారు. -
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి నవరాత్రులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఉంటాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా.