- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
N.Ram: ప్రభుత్వాల ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ.. విలువల కోసమే పోరాడిన వ్యక్తి
వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నారనే కక్షతో రామోజీరావు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా ఆయన ఎంతో ధైర్యంగా నిలబడ్డారని హిందూ పత్రిక పూర్వ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ కొనియాడారు.
హిందూ పూర్వ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్
వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నారనే కక్షతో రామోజీరావు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా ఆయన ఎంతో ధైర్యంగా నిలబడ్డారని హిందూ పత్రిక పూర్వ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ కొనియాడారు. ‘‘ప్రభుత్వాల ఒత్తిళ్లు, దాడిని ఎదుర్కొంటూ.. వార్తాపత్రికల స్వతంత్రతను కాపాడిన వ్యక్తి రామోజీరావు. మరణానికి కొద్దిరోజుల ముందు కూడా దాడులు కొనసాగాయి. అయినా ధైర్యంగా నిలబడ్డారు. అన్నీ పోగొట్టుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. నమ్మిన విలువలకు కట్టుబడి పోరాడారు. భారత పాత్రికేయ రంగంలోనే అరుదైన వ్యక్తి రామోజీరావు. విశ్వసనీయ పాత్రికేయం, క్లిష్టమైన పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఆయన నమ్మారు’’ అని ప్రశంసించారు. పత్రికలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్గాంధీ ప్రభుత్వం తెచ్చిన నేరపూరిత పరువునష్టం బిల్లును అడ్డుకునేందుకు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా రామోజీరావు పోరాటం చేశారని ఎన్.రామ్ గుర్తుచేశారు. ‘‘రామోజీరావు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు. అవినీతి, అధికార దుర్వినియోగంపై పరిశోధనాత్మక జర్నలిజం దూకుడుగా సాగుతున్న రోజులవి. బోఫోర్స్ కుంభకోణాన్ని బయటపెట్టడంలో నా పాత్ర ఉంది. 1988లో రాజీవ్గాంధీ ప్రభుత్వం పత్రికలు, పాత్రికేయుల్ని వేధించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న చట్టం కంటే క్రూరమైన నిబంధనలతో క్రిమినల్ పరువు నష్టం బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమంలో ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఉన్న రామోజీరావుతో కలిసి పనిచేశాం. ఆయన పోరాటం ఫలితంగా రాజీవ్గాంధీ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పుడు రామోజీరావు పూర్తి సంతృప్తి చెందారు’’ అని ఆనాటి విషయాలను వెల్లడించారు. ‘‘భారత వార్తాపత్రికా రంగంలో ‘ఈనాడు’ ద్వారా రామోజీరావు విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కొత్త టెక్నాలజీతో పాటు క్షేత్రస్థాయి రిపోర్టింగ్, మార్కెటింగ్ విధానాలను ప్రవేశపెట్టారు. జిల్లా పత్రికల ద్వారా స్థానిక వార్తలకు ప్రాధాన్యం పెంచారు. ఉత్తమ కథనాలను అందించారు. ఈ వివరాల్ని ఉటంకిస్తూ 2000వ సంవత్సరంలో భారత వార్తాపత్రికల విప్లవం పేరుతో నా స్నేహితుడైన ఆస్ట్రేలియన్ రాజకీయ శాస్త్రవేత్త రాబిన్ జెఫ్రీ రాసిన పుస్తకం ఎంతో ఆదరణ పొందింది’’ అని రామ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి
-
రాహుల్ VS రాజ్నాథ్.. అగ్నిపథ్పై మాటల తూటాలు
-
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
-
జియో, ఎయిర్టెల్ కొత్త టారిఫ్లు.. వార్షిక రీఛార్జికి ‘ప్లాన్’ చేస్తున్నారా?
-
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్..