- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP News: మచిలీపట్నం పూర్వ కమిషనర్ చంద్రయ్యపై హైకోర్టు ఆగ్రహం
న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్.వెంకటేష్ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్ జి.చంద్రయ్య (ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత అదనపు కమిషనర్)కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
కోర్టుధిక్కరణ కేసులో 6 నెలల జైలుశిక్ష, రూ 2వేల జరిమానా విధింపు
కోర్టు ఆదేశాలకు రంధ్రాన్వేషణ చేయకుండా వాటి అమలే అధికారుల విధి అని స్పష్టీకరణ
అప్పీలు దాఖలుకు వీలుగా శిక్ష అమలు 4 వారాల నిలుపుదల
ఈనాడు, అమరావతి: న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారి ఎస్.వెంకటేష్ను విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్ జి.చంద్రయ్య (ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత అదనపు కమిషనర్)కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అప్పీలు దాఖలుకు సమయం కావాలని చంద్రయ్య తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో శిక్ష అమలును నాలుగు వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు ఉత్తర్వులకు రంధ్రాన్వేషణ చేయకుండా వాటిని అమలు చేయడమే అధికారుల విధి అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీలు దాఖలు చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులపై చంద్రయ్య అవిధేయత చూపినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వ్యవహారాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్కు వదిలేస్తున్నట్లు చెప్పారు. చంద్రయ్య వ్యవహారశైలి చట్టబద్ధ పాలనకు అవరోధం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాక న్యాయవ్యవస్థకు, పాలనకు తీవ్ర నష్టం చేస్తుందని మండిపడ్డారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ తనను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ రెవెన్యూ అధికారి ఎస్.వెంకటేష్ 2023లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. విధుల్లోకి తీసుకునే విషయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉత్తర్వులు, పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీచేయాలని 2023 మే 12న తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను చంద్రయ్య అమలుచేయకపోవడంతో వెంకటేష్ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పూర్వ కమిషనర్ చంద్రయ్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ 2022 అక్టోబర్లో జారీచేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వెంకటేష్ను సస్పెండ్ చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తూ.. తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు స్పష్టంగా ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పాటు ఉన్నతాధికారి ఉత్తర్వులను చంద్రయ్య ఉల్లంఘించారని స్పష్టంచేశారు. పిటిషనర్ను విధుల్లోకి తీసుకోకుండా ఆయన కోర్టు ఉత్తర్వులను అగౌరవపరిచారన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయ్యకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తమను నమ్మించి రూ.లక్షల్లో మోసం చేశారంటూ అభ్యుదయ గ్రామీణ రాష్ట్రకమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కోట దేవకీదేవి అనే మహిళ వాపోయారు. -
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని ఓ డ్రైవర్ తను నడిపే బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారు. ప్రయాణికులు తరచూ సెల్ఫోన్లో తలమునకలై పోతున్నారని గ్రహించి.. వారిని పుస్తకాల వైపు మళ్లించాలని ఈ వినూత్న ప్రయత్నం చేశారు. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. -
నేడే పింఛన్ల పండగ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పండగకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందించనుంది. -
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడర్ ట్రేడింగ్
పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగింది. ఆ పార్టీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. -
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలిరోజు ఆదివారం ఆరు గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
కృషి, పట్టుదలతోనే గుర్తింపు
కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడంతో పాటు గుర్తింపు లభిస్తుందని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
ఈదురుగాలులకు షెడ్డు కూలి 20 వేల కోళ్లు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి తర్వాత వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా కోళ్ల ఫారం కూలిపోయి 20 వేల కోళ్లు చనిపోయాయి. -
తొలకరి ‘జోరు’
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి అంటే జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తే.. సాధారణం కంటే 59% అధికంగా వానలు కురిశాయి. -
అరకు కాఫీ అద్భుతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారీ అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్కీబాత్’లోనూ దీని గురించి మాట్లాడారు. -
వైకాపా గుత్తేదారుకు నామినేషన్లపై రూ.కోట్లలో పనులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి రాజీనామా చేసిన ఆచార్య పి.రాజశేఖర్ తన పదవీకాలంలో ఇష్టానుసారం వ్యవహరించారు. -
కొన్ని వెబ్సైట్లు ఇంకా వైకాపా రంగుల్లోనే
ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి రోజులు గడిచిపోతున్నా.. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, యాప్లకు వైకాపా రంగులు, వైఎస్సార్ పేరు అలాగే కొనసాగుతున్నాయి. -
తితిదే వెబ్సైట్లో బోర్డు నిర్ణయాలు
భక్తుల సౌకర్యార్థం తితిదే తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటిస్తూ గతేడాది ఆగస్టు ఏడో తేదీనుంచి ఈ ఏడాది మార్చి 11వ తేదీ వరకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తితిదే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
నేటి నుంచి ‘స్టాప్ డయేరియా’ రెండో దశ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ‘స్టాప్ డయేరియా’ రెండో దశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఇసుక టెండర్లలో జగన్ మార్క్ జిత్తులు
ఇసుకలో రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్ ప్రభుత్వం ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్