- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra News: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోర్స్
ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
ఫిర్యాదుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్
సమాచారమిస్తే నగదు బహుమతులు
వంద రోజుల్లో నియంత్రణ, రెండేళ్లలో నిర్మూలన
మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న సత్యకుమార్, వంగలపూడి అనిత, లోకేశ్, గుమ్మిడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఐజీ స్థాయి అధికారిని దీనికి అధిపతిగా నియమించాలని, జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులుగా పెట్టాలని తీర్మానించింది. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని, పది రోజుల్లోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గంజాయి, డ్రగ్స్పై ఫిర్యాదుల స్వీకరణ కోసం వారం రోజుల్లోగా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించింది. సమాచారమిచ్చి గంజాయి, డ్రగ్స్ను పట్టించినవారికి నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే వీటికి బానిసలైన వారిని ఆ ఉచ్చు నుంచి బయటకు తెచ్చేందుకు మరిన్ని వ్యసన విముక్తి కేంద్రాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. జైళ్లలోనూ వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో గురువారం తొలిసారి సమావేశమైంది. మానవవనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంబంధిత శాఖల అధికారులతో దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనిత, గుమ్మిడి సంధ్యారాణి విలేకర్లకు వెల్లడించారు. వంద రోజుల్లోగా వీటి నియంత్రణ, రెండేళ్లలోగా నిర్మూలన చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. వైకాపా హయాంలో రెండేళ్లపాటు గంజాయి విధ్వంసానికి కూడా అనుమతివ్వలేదని.. దీంతో విచ్చలవిడిగా లభ్యత పెరిగిందని చెప్పారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి రాకుండా చర్యలు
- సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి గంజాయి రాకుండా నియంత్రించేందుకు మరిన్ని చెక్పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానిస్తాం.
- దొంగ నంబర్లతో వెళ్లే వాహనాలను గుర్తించే వ్యవస్థను తీసుకొస్తాం. అవసరమైతే ఆయా రాష్ట్రాల హోం మంత్రులు, ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. గంజాయి రవాణా వాహనాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ను కూడా సమకూర్చుకుంటాం.
- రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో గంజాయి సాగవుతోంది. వీటిలో గంజాయి సాగే చేపట్టనీయకుండా నియంత్రించే చర్యలు తీసుకుంటున్నాం.
- గంజాయి స్మగ్లింగ్ వెనక ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ముఠాలు, కింగ్పిన్లపై నిఘా పెట్టాం. త్వరలోనే పట్టుకుంటాం.
ఏడేళ్ల బాలల సైతం గంజాయికి బానిసలే
కొన్నిచోట్ల ఏడేళ్ల బాలలు సైతం గంజాయి తీసుకుంటున్నారు. ఇలాంటిచోట్ల పాఠశాల విద్యార్థుల బ్యాగ్లు పరిశీలిస్తే అందులో 30 శాతం మంది దగ్గర గంజాయి ఉంటోంది. మన్యంలో గంజాయి సాగు, అక్రమ రవాణా వెనక కింగ్పిన్లు ఉన్నారు. అయితే కొరియర్లుగా చిక్కి అమాయక గిరిజనులు జైల్లో మగ్గిపోతున్నారు. ఇటీవల విశాఖపట్నం జైల్లో పరిశీలించగా గంజాయి కేసుల్లో రిమాండులో ఉన్న ఖైదీల్లో దాదాపు 50 శాతం మంది 15 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న గిరిజన యువకులే. కనీసం వీరికి బెయిల్ ఇచ్చేవారైనా లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు కారణమై జీవితఖైదు పడిన దోషులను.. నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఓఆర్ఆర్తో ‘అభివృద్ధి పరుగులు’
అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం... రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మేలిమలుపు తిప్పే పరిణామం. -
రేపటి నుంచి ఉచిత ఇసుక
రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. -
విశాఖ తీరాన.. వీయాలి ఐటీ వీచిక!
దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా, నేవీ కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం.. ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. -
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. -
8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు. -
దాతలు ఇచ్చే ఆస్తులను సంరక్షించుకోవాలి
దాతలు విరాళంగా ఇచ్చే ఆస్తులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!