- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఒడిశా తరహాలో ఏపీలోనూ ‘వరల్డ్ స్కిల్ సెంటర్’
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న వరల్డ్ స్కిల్ సెంటర్ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి
ఎన్నారై టీడీపీ సహకారంతో 15 మంది ఉపాధ్యాయులకు అమెరికాలో ఉద్యోగాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న వరల్డ్ స్కిల్ సెంటర్ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. టీడీపీ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొంది అమెరికాలో ఉద్యోగాలు సంపాదించిన 15 మంది ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు జావా నేర్చుకున్న 31 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు, యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ ద్వారా శిక్షణ పొందిన నలుగురికి ధ్రువపత్రాలు అందజేశారు. ‘విదేశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులు గురువుల గౌరవాన్ని నిలబెట్టాలి. అక్కడ మంచి విషయాలు నేర్చుకుని గొప్పగా స్వదేశానికి తిరిగి రావాలి. మాతృభూమి రుణం తీర్చుకోవాలి’ అని మంత్రి శ్రీనివాస్ ఆకాంక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇకపై ప్రభుత్వ సహకారం ఉంటుందని తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవికుమార్ తెలిపారు. టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా విదేశాలకు వెళ్లిన వారు విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని, ఇప్పుడు వెళ్తున్న ఉపాధ్యాయులకు టెక్ట్రా ఐటీ సర్వీసెస్ సీఈవో మేకా శ్రీకాంత్ వసతి కల్పిస్తారని తెలిపారు. 2015 నుంచి 107 మంది ఉపాధ్యాయులను అమెరికాకు పంపినట్లు సెంటర్ హెడ్ డాక్టర్ యామినీ పెండ్యాల వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ, టెక్ట్రా ఐటీ సర్వీసెస్ సీఈవో మేకా శ్రీకాంత్, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!
మరో 30 ఏళ్లు తానే సీఎంగా ఉంటాననుకొని విశాఖలోని రుషికొండ మీద జగన్ రాజమహల్ను కట్టించుకున్నారు. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని విలాస వసతులకు ఖర్చు చేశారు. -
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ చిత్రం కాకినాడ 49వ డివిజన్ రాజేంద్రనగర్లోని చైతన్య డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గంలోనిది. -
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస పవిత్ర సారె ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తొలి సారెను వైదిక కమిటీ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు కుటుంబసభ్యులతో కలిసి సమర్పించారు. -
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. -
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి
వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్తోనే ప్రయోజనం: విశాఖ ఎంపీ శ్రీభరత్
శాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణకోస్తా రైల్వేజోన్ సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆ దిశగా కృషిచేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విశాఖ నుంచి పూరీకి నడపనున్న ప్రత్యేక రైలును శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -
మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. -
ట్రిపుల్ఐటీ డైరెక్టర్ల రాజీనామా
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్, బాలాజీ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. -
ఇసుక దోపిడీకి రాచమార్గం
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్లో వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారు. -
ఐదేళ్ల తర్వాత పలాసకు సాగునీరు
వైకాపా ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతులు సాగునీటికి నానాకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వంశధార ఎడమ కాలువ ద్వారా నీరందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షలు పడేలా నూతన చట్టాలు పటిష్ఠంగా ఉన్నాయని, వీటిపై జూనియర్ న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు. -
దాతలు ఇచ్చే ఆస్తులను సంరక్షించుకోవాలి
దాతలు విరాళంగా ఇచ్చే ఆస్తులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. -
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
గ్రామ సచివాలయాల గురించి పదేపదే గొప్పలు చెప్పుకొన్న గత వైకాపా ప్రభుత్వం వాటి నిర్మాణపనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా మొండిచేయి చూపింది. -
ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్ఎంసీ నిరాకరణ
వైకాపా ప్రభుత్వ పాపాలు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రావడంపై ప్రభావం చూపాయి. -
డీ అడిక్షన్ సెంటర్లను పటిష్ఠం చేయాలి
గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోర్సు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
పాఠశాల అకడమిక్ క్యాలండర్ విడుదలలో జాప్యం
పాఠశాలలు పునఃప్రారంభమై మూడువారాలు గడిచినా అకడమిక్ క్యాలండర్ రూపకల్పన ఇంతవరకు పూర్తికాలేదు. -
సీబీఎస్ఈ పదోతరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత
రాష్ట్రంలో పదోతరగతి సీబీఎస్ఈ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఈ ఏడాది మార్పు చేసింది. -
ఛైర్మన్ లేరు.. జీతాలు ఇవ్వడం కుదరదు
ఉన్నత విద్యామండలికి ఛైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైకాపా హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలిచ్చారు. -
తితిదే నిధుల వినియోగంపై విజిలెన్స్ ఆరా
తితిదే గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల హయాంలో నిబంధనలను అతిక్రమించి నిధుల కేటాయించడం, ఇంజినీరింగ్ పనులు చేపట్టడంపై విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. -
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం
హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి కాంట్రాక్టులు
ఆయన హోదా కంటి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్ స్థాయి. రోగులకు సేవచేయాల్సిన ఆయన.. ఆస్పత్రికి రావడం, సంతకం చేయడం, వెంటనే కారులో బయటకు వెళ్లడం, తన కాంట్రాక్టు పనులు పరిశీలించడం దినచర్యగా మార్చుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!