- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జప్తు చేసిన రూ.20 కోట్ల సామగ్రి మాయం!
వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు.
అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ కర్మాగారంలో భారీ చోరీ
ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు
ఈనాడు, అమరావతి: వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి.. సెక్యూరిటీ గార్డు కాపలా ఉంటున్నారు.. కానీ లోపల యంత్రసామగ్రి మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. కనీసం కేసు నమోదు కాలేదు. ఆరునెలల తర్వాత కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని ‘ఈనాడు’ దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ కర్మాగారంలో మాయమైన వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల పైమాటే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ పేరుతో 1995లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో ఓ కర్మాగారాన్ని రూ.4.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేశారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సూరంపల్లిలో ఏర్పాటుచేసిన పారిశ్రామికవాడలోనే ఈ కర్మాగారం పెట్టారు. ఇక్కడ పచ్చళ్ల మసాలాలు, పచ్చళ్లు, సుగంధద్రవ్యాల ఉత్పత్తులు, ఇన్స్టెంట్ ఫుడ్స్ తయారు చేసేవారు. వీటిని విదేశాలకూ ఎగుమతి చేసేవారు. తర్వాత అగ్రిగోల్డ్ సంస్థ దివాలా తీసింది. ఈ కర్మాగారానికి వివిధ బ్యాంకులు రుణాలిచ్చాయి. వీటిని తిరిగి రాబట్టుకునేందుకు కోర్టు ఉత్తర్వులతో యూనియన్ బ్యాంకు 2019 మార్చి 25న కర్మాగారాన్ని జప్తుచేసింది. ఆస్తులను వేలం వేసేందుకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా.. వేలంలో జాప్యం చేసినట్లు తెలిసింది.
తనిఖీ లేదు.. కేసూ లేదు
తర్వాత ఈ కర్మాగారానికి తాళం వేసి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా కర్మాగారం లోపల యంత్రసామగ్రి, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులను తరలించారు. ఈ విషయం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి తెలిసి.. 2023 సెప్టెంబరు 5న గన్నవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాటి గన్నవరం సీఐ కనకారావు కనీసం కర్మాగారాన్ని సందర్శించలేదు, సామగ్రి మాయంపై ఆరా తీయలేదు. ఫిర్యాదును పక్కన పెట్టేశారు. యూబీఐ ఎటాచ్ చేసిన ఆస్తులు కాబట్టి.. వాళ్లు ఫిర్యాదు చేస్తేనే కేసు పెడతామని పోలీసులు చెబుతున్నారు. యూబీఐ దీనిపై ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుత సీఐ వరప్రసాద్ను వివరణ కోరగా సంబంధిత యజమానులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదని చెప్పారు.
ఉలుకూపలుకూ లేదు
అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. సూరంపల్లి కర్మాగారం కూడా వారి జాబితాలోనే ఉంది. మధ్యలో కోర్టు నుంచి యూబీఐ ఎటాచ్మెంట్ తీసుకుంది. అంత పెద్ద కర్మాగారంలో రూ.20 కోట్ల సామగ్రి మాయమైనా.. అధికారులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తోందని అగ్రిగోల్డ్ బాధితులు వాపోతున్నారు. దీనిపై అగ్రిగోల్డ్ మొదటి యజమాని ఇటీవల కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. చోరీ కేసు నమోదు చేయలేదని వ్యాజ్యం దాఖలు చేసినట్లు తెలిసింది. యూబీఐ అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా
రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. -
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
కోట్ల ప్రజాధనం.. వైఎస్ విగ్రహాలపాలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. -
సీమ ముఖచిత్రం మార్చనున్న హైదరాబాద్ - బెంగళూరు హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. -
పోతేపోనీ అని వదిలేశారు!
గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. -
ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ముఖాముఖి భేటీ కాబోతున్నారు. -
సహకార సంఘాలకు వైకాపా చెదలు
వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. -
ప్రజాదర్బార్కు వినతుల వెల్లువ
రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. -
హమ్మయ్య.. ఈ చెట్లు బతికిపోయాయి
రహదారిపై పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఈ దృశ్యం.. రాజధాని అమరావతిలోనిది. నేలపాడులో హైకోర్టు ఎదుట రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు సుందరంగా కనిపించడమే కాదు.. దారెంట నీడనిస్తున్నాయి. -
పవన్కల్యాణ్ వారాహి దీక్షోద్వాసన
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. -
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి బాధ్యులెవరు?
‘అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఉన్న అధికారులు ఎవరు? పింఛా ప్రాజెక్టు నిండిపోయి అన్నమయ్యకు అంచనాకు మించి వరద వస్తుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? -
రాజధాని నిర్మాణానికి తొలి వేతనం విరాళం
విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభ సభ్యుడిగా అందుకున్న తొలి గౌరవ వేతన మొత్తం రూ.1.57 లక్షలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. -
తితిదే నిర్ణయించిన ధరలకే ఆహారమందిస్తాం
తిరుమలలోని ఏపీ టూరిజం హోటళ్లలో తితిదే నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఆహారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ ఛైర్మన్, రేమండ్స్ సీఎండీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, రేమండ్స్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా వేర్వేరుగా దర్శించుకున్నారు. -
ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులివ్వండి
కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. -
పేదల భూముల్ని చౌకగా కొట్టేశారు
పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై గత వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. -
ధ్రువపత్రాలు ఎందుకు అందించలేదో వివరణ ఇవ్వండి
మాజీ మంత్రి, వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ జడ్జి ఎస్.రామకృష్ణ 2021లో వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన కేసులో దిగువ కోర్టు ధ్రువపత్రాలు(సర్టిఫైడ్ కాపీలు) ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. -
9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో శుక్రవారం 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి
ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖాధికారులను ఆదేశించారు.